Tuesday 9 April 2019

వాగ్దేవి విహారస్థలాలు


వాగ్దేవి విహారస్థలాలు

తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవునా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లంబల్కుము నాదువాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా !
అని ' పలుకులతల్లి ''వాగ్దేవి 'దయ కోసం అనాదిగా అంతా  తల్లిని అర్చిస్తూనే ఉన్నారు. ' ఋగ్వేదందేవీ భాగవతంబ్రహ్మవైవర్త, పద్మపురాణాలలోనూ తల్లి సరస్వతి  గురించి అనేక కధలున్నాయిసరస్వతీదేవి ఆద్యంత రహిత,శక్తి స్వరూపిణి అని వివిధస్తోత్రాలలో స్తుతిస్తాంబ్రహ్మసకల సృష్టికర్త  గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడనిసృష్టికార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన 
 జిహ్వపై ఆమెను ధరించాడ నీ  ఒక కధసృష్టి కార్యాన్ని   నిర్వ హించడానికి బ్రహ్మకు శక్తిస్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీభాగవతం తెలుపుతోంది
సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక కధనంవాక్బుద్ధి,వివేకం,విద్య ,కళలు,విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని మనం అర్చిస్తాం . దేవత హంస వాహనంపై, 'కచ్ఛపిఅనే పేరు గల వీణ ధరించి స్వరాలు పలికిస్తూ , ప్రార్ధించినవారికి విద్యాబుధ్ధులు , జ్ఞానం ప్రసాదిస్తుంటుంది.
  తల్లి తెల్లని పద్మంపై ఆసీనురాలై , తెల్లని వస్త్రాలు ,తెల్లని 
ముత్యాల సరాలు  ధరించి దరహాస వదనంతో భక్తుల పాలిట  
కొంగుబంగారంగా ఉంటుంది.

     శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
     హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
     దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా
     కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ!

అంటూబమ్మెరపోతనాచార్యులు తల్లి సరస్వతిని స్తుతించారు.

పరాశక్తి తొలిగా ధరించిన ఐదురూపాల్లో సరస్వతి ఒకటి మాత కేవలం చదువులనే కాదు ,సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందిబ్రహ్మభూదేవిసనత్కుమారుడుఇంద్రుడు ,శ్రీకృష్ణుడు , శివుడుబృహస్పతివాల్మీకివ్యాసుడు మొదలైన మహామహులు అనేక సందర్భాలలో సరస్వతీదేవిని ప్రార్ధించి కృతకృత్యులైన వారేయాజ్ఙవల్కమహర్షి ఓసారి పొరపాటున గురువు ఆగ్రహానికి గురై తాను చదువుకున్న చదువునంతా మఱచి పోతాడుఅపుడాయన సూర్యుని ప్రార్ధించగా  మహర్షి భక్తికి  మెచ్చి వేదవేదాంగాలను సూర్యుడు ఆయనకు బోధిస్తాడుఐతే  యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపకశక్తి లేక పోవటాన అంతా మఱచిపోవడం సూర్యుడు గమనించి,సరస్వతీ స్తోత్రాన్నిభక్తి తో పఠించమని చెప్తాడు ,యాజ్ఞవల్క్య మహర్షి భక్తితో సరస్వతీ స్తుతి చేస్తాడుసరస్వతి మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా ఆశీర్వదిస్తుంది.

 తల్లిని పూజిస్తే బుద్దివికాసంతోపాటు , సకలశుభాలూ సమకూరుతాయని భక్తుల విశ్వాసంవాక్కుబుద్ధివిద్యజ్ఞానాలకుభాషకులిపికి అధిష్టానదేవత సరస్వతీదేవిఈమె వీణాపుస్తక ధారిణిశుద్ధసత్యస్వరూపిణిహంస ఆమె వాహనంసరస్వతి బ్రహ్మ దేవుని నాలుక యందు నివసిస్తుందిపలుకు తేనెల బంగారుతల్లివేదాలకు జనయిత్రితెల్లని వన్నెలు విఱజిమ్ముతూ,  తెల్లని వస్త్రాలు ధరించి  వీణపుస్తకాలు చేదాల్చిరత్న భూషణాలు మెడలో ధరించిసకల శాస్త్రాలకూ అధిదేవత అయిన సరస్వతీదేవి భక్తులకు కోరిన కోర్కెలు ప్రసాదిఒచేందుకు ఆయత్తమై ఉంటుందిఆమె దయ ఉంటే మూర్ఖుడు సైతం పండితుడు కాగలడుఆమెను తృణీకరించిన మహా పండితుడుసైతం జ్ఞాన భ్రష్టునిగావివేకశూన్యునిగా మారి సర్వం పోగొట్టుకుని పిచ్చివాడయిపోతాడుఅందుకే  తల్లి కరుణ కోసం మనం పరిపరివిధాల ప్రాధేయపడతాం.

సరస్వతి మాత యొక్క అనేక నామాలు  విధంగా ఉన్నాయిశారద ,హంస వాహిని , జగతీ ఖ్యాత , వాగీశ్వరి ,కౌమారిబ్రహ్మ చారిణి , బుద్ధిధాత్రి ,వరదాయిని ,క్షుద్ర ఘంట ,భువనేశ్వరి ,భారతివీణా
పుస్తుకధారిణి ,అనుష్టుప్ఆదిత్య బ్రాహ్మీభగవతీభారతీభాషా
 వర్ణ రూపిణీ మొదలైనవి.

హిందూమత ప్రభావం ఉన్న బౌద్ధమతంలో కొన్నిచోట్ల మంజుశ్రీ
మహాసరస్వతివజ్రసరస్వతిఆర్యవజ్ర సరస్వతివజ్రవీణా
సరస్వతివజ్ర శారద వంటి పేర్లతో సరస్వతి ఆరాధన జరిగినట్లు , జైనులు శృతదేవతగాషోడశ విద్యా దేవతలకు అధికారిణిగా సరస్వతిని ఆరాధించినట్లు ,శ్వేతాంబరులు హంసవాహిని అని ఈదేవిని స్తుతించినట్లు, "శ్రీ మద్భోజ నరేంద్ర చంద్ర నగరీ విద్యాధరీఅని భోజుడు వాగ్దేవిని ప్రతిష్టించాడని చారిత్రక ఆధారాలవలన తెలుస్తోంది .

సరస్వతీక్షేత్రాలు దేశవ్యాప్తంగా  - బాసర,వర్గల్కాష్మీర్ లోని శారదా మందిరం ,రాజస్థాన్  లోని పుష్కర్కర్ణాటక లోని శృంగేరితమిళనాడులో 'కూతనూర్' ,రాజస్థాన్ లోని పిలాని మొదలైనచోట్ల ఉన్నాయిక్రీ.పూ. 2 శతాబ్దికి చెందిన సరస్వతీ విగ్రహము ఉత్తరప్రదేశ్లో మధుర సమీపంలోని 'ఖజ్జాలీటీలా'లో లభించిందిగుప్తరాజులలో ఒకడైన సముద్ర గుప్తుడు తన సువర్ణ నాణెములపై ఒకవైపు సరస్వతీ దేవినిమరొకవైపు వీణను ముద్రించాడుఅలాగే క్రీ.పూ. 550-575 ప్రాంతంలో ఒక గౌడవంశ రాజు తన నాణెములపై సరస్వతీదేవి రూపమును ముద్రించాడు.
క్రీ..10 శతాబ్దంలో ఒరిస్సా (ఖచ్చింగ్)లో  వీణాపాణియైన సరస్వతి  విగ్రహం చెక్కబడిందిపాలవంశపు రాజుల నాటివని చెప్పబడుచున్న సరస్వతి విగ్రహాలు పాట్నాలోనుకలకత్తా (హాష్తోష్మ్యూజి యంలోను భద్రపఱచ బడ్డాయిఇంకా  వివిధ  మ్యూజి యాల లో సరస్వతీశిల్పాలున్నాయిఖజురాహోలోని పార్శ్వనాధాలయంలోనుఖందరీయ మహాదేవాలయంలోను వాగ్దేవి విగ్రహాలున్నాయిఆంధ్రప్రదేశ్‌ లోని ఘంటసాలలో క్రీ.పూ. 2 శతాబ్దికి చెంది న సరస్వతీ విగ్రహం లభించిందిక్రీ.. 10 శతాబ్దికి చెంది న చాళుక్యుల కాలం నాటి విగ్రహం సామర్లకోట భీమేశ్వరాలయంలో ఉందికారెంపూడితంజావూరుహలెబీడుశ్రీరంగంలలో సరస్వతీదేవి విగ్రహాలున్నాయి.

.హైదరాబాదుకు సుమారు 48 కి.మీదూరం లోగల వర్గల్లోని వాగ్దేవి  సరస్వతీ దేవి ఆలయం ఇప్పుడిప్పుడే ప్రాముఖ్యాన్ని పొందుతోంది   .భక్తులు  ఆలయం గురించీ తెలుసుకుని అమ్మ దర్శనానికై రావడం మొదలుపెడుతున్నారు .  అమ్మవారి ఆలయం చిన్న కొండపైన చూడముచ్చటగా ఉంటుందిమాఘశుధ్ధ త్రయోదశిరోజున వర్గల్ లోని విద్యాసరస్వతీ అలయంలో నిర్వహించే '2 నుండీ 4 సంపిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం హృద్యంగా  ఉంటుందివసంతపంచమీ ఉత్సవాలు వైభవంగా  జనవరి 20 జఱుగుతాయి ఉత్సవాల్లో  వేలసంఖ్యలో   భక్తులు దేవీదర్శనానికి వస్తుంటారు.  కంచి శంకరమఠం వారిచే  ఆలయం నిర్వహింపబడుతోందిఇచ్చటి వేదపాఠశాలలో ఎంతోమంది విద్యార్ధులు వేదాభ్యసనం చేస్తున్నారు.  విద్యాసరస్వతితోపాటుగా 3 అడుగుల ఎత్తైన శనిదేవుని విగ్రహంలక్ష్మీగణపతిశివవైష్ణవ ఆలయాల కాంప్లెక్స్  కొండపైన చక్కని శిల్పసంపదతో మనస్సును దోచుకుంటుంది.

కాశ్మీర్ లోని శారదామాత ఆలయం  చాలా పురాతనమైనది.  ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న కాశ్మీర్ భూభాగంలో ఉన్న  మందిరం చారిత్రికంగా చాలా ముఖ్యమైనదికాశ్మీర్ చరిత్రకారుడైన కల్హణుడు తన రాజ తరంగిణిలో  మందిరం గుర్కించి చాలా వివరంగా వ్రాశాడు. "నమస్తే శారదా దేవి కాశ్మీర మండల వాసినిఅన్న ప్రార్ధన దేశమంతటా వినిపించేదిశాండిల్యమునికి శారదా దేవి ఇక్కడ  ప్రత్యక్షమైనదని అంటారు  . దేశం లోని పండితులందఱికీ ఇది పరమ పవిత్రక్షేత్రంఆది శంకరాచార్యులవారు , రామానుజాచార్యులవారు వంటి గురువులు ఇక్కడికి వచ్చి దేవి దర్శనం చేసుకొన్నారని అంటారు. మందిరం ఉన్న స్థలాన్ని కూడా కల్హణుడు  తన కాశ్మీర రాజచరిత్రలో వర్ణించాడు.

బాసర :- ఆదిలాబాదుజిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం నిర్మల్ పట్టణానికి 35 కి.మీదూరంలో గోదావరినది ఒడ్డునహైదరాబాదుకు సుమారు 200 కి.మీదూరంలో ఉందిబాసరలో జ్ఞానసరస్వతి అమ్మవారు మహాలక్ష్మిమహాకాళి సమేతులై కొలువు తీఱి ఉన్నారుఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది మందిరం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది.

ఆలయ చరిత్ర :- గోదావరి ప్రవహిస్తున్న  పుణ్యభూమి వ్యాసమహర్షి పాదస్పర్శతో పునీతమైందివ్యాసమహర్షి ప్రశాంత చిత్తంతో తపస్సుచేయడానికి  ప్రాంతానికివచ్చి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయిబ్రహ్మాండపురాణాన్ని రచిస్తున్నప్పుడు ప్రకృతి ఖండంలోని శక్తిని వర్ణించాల్సిరాగాశక్తిని వర్ణించాలంటే మరింత తపశ్శక్తితో పాటు ఎలాంటి అంతరాయంలేని మహిమగల ప్రశాంత వాతావరణం అవసరమని భావించి ఆయన అన్నిప్రాంతాలూ తిరిగి బాసర చేఱుకున్నాడునాందేడ్‌ నుంచి బ్రహ్మే శ్వరం వఱకు గోదావరి నాభిస్థానం అంటారుఅక్కడ వ్యాసుడు ధ్యానం చేసుకోవడానికి ఆగాడట , గోదావరితీరంలో ధ్యానముద్రలో 
ఉన్నఆయనకు శక్తిరూపం నీడలా కనిపించి వెనువెంటనే మాయమైందిటదీంతో  రూపం ఎవరిదాఅని దివ్యదృష్టితో చూడగా జ్ఞానసరస్వతి అమ్మవారు కనిపించారటపూర్తిరూపం కనిపించకపోవడానికి కారణం అడగగా  అమ్మ ఋషితో  ' ప్రతిరోజూ ధ్యానంచేసి గోదావరిలో పిడికెడు ఇసుకను అచ్చట వేయాలనిఇలా వేసిన ఇసుకతో తన పూర్తి రూపం తయారవుతుందనిఅనంతరం జ్ఞాన సరస్వతిగా అందరికి దర్శనమిస్తానని '  చెప్పిందిటఅప్పుడు వ్యాసుడు గోదావరితీరానికి కొంతదూరంలో ఉన్నకుమారచర పర్వతంలోని ఒక గుహలో తపస్సు ప్రారంభించాడట . అమ్మవారు చెప్పినట్టు ఇసుకను తీసుకువచ్చి ప్రస్తుతం బాసరలో ఉన్న కోనేరు ఎదురుగా వేయడం ప్రారంభించారటఇలా కొన్ని ఏళ్లు గడిచిన అనంతరం అమ్మవారి రూపం పూర్తయ్యిఆమె జ్ఞానసరస్వతిగా ఆవిర్భవించిందని పురాణకధనం.  విగ్రహానికి జీవం పోయడం కోసం తగిన శక్తి కలిగేందుకు సరస్వతిదేవి ఆయనకు జ్ఞానబీజాన్నిఉపదేశించిందిజ్ఞానానికి పుట్టుక బాసరలో జఱిగినందున బాసర జ్ఞానానికి పుట్టినిల్లుగా వెలుగొందుతోంది
భారతదేశంలో కన్యాకుమారిలోకాశ్మీర్లలో సరస్వతీదేవాలయా లు ఉన్నప్పటికీ చదువులతల్లి  జ్ఞానసరస్వతీ  బాసరలోనిది మాత్రమేననిదేశంలోమరెక్కడాలేదని అంటారుఅయితే ఒక్క సరస్వతీదేవినే ప్రతిష్టించడం సబబు కాదనిఈమెకు తోడుగా  మహాకాళీమహాలక్ష్మీలను సైతం ప్రతిష్టించారు.

శక్తిరూపిణి శారద :- పుత్రసంతానం కోసం దశరథుడు ఇక్కడ పూజలు చేశాడుఎనిమిదిమంది దేవతలు కోనేరులోని వివిధ  ప్రాంతాల్లో స్నానాలు చేయడంతో దీనికి అష్టతీర్థ సరోవరమని పేరు వచ్చిందిఅవే ఇంద్రతీర్ధంసూర్యతీర్ధంవ్యాసతీర్ధంవాల్మీకి తీర్ధంవిష్ణు తీర్ధంగణేషతీర్ధంపుత్రతీర్ధంశివతీర్ధం
 ఒకసారి దుర్వాసమహాముని సరస్వతీదేవి ఇచ్చిన పుష్పమూలికను ధరించి స్వర్గలోకానికి వెళ్లి దాన్ని ఇంద్రునికి ఇచ్చాడుఇంద్రుడు దాన్ని ఐరావతానికి అలంకరించాడుఅది దాన్ని తొండంతో అందుకుని నేలమీద వేసిందిదీనికి కారణం ఇంద్రుడేననే కోపంతో 
అతడు త్రైలోక్యరాజ్య భ్రష్టుడై కుష్టువ్యాధి గ్రస్తుడు కూడా కావాలనిశపించాడు దుర్వాసుడుఇంద్రుడు బృహస్పతి మాట ప్రకారం కోనేరులోని తూర్పుభాగంలో స్నానంచేసి శాపవిమోచనం పొందాడుదీనికారణంగా  స్థానానికి ఇంద్ర తీర్థమని  పేరువచ్చింది.  ఇంద్రుడు  పూజలు చేసిన స్థలం సరస్వతీదేవి మందిరానికి పూర్వభాగంలో ఒకమైలుదూరంలో గోదావరి నదీతీరంలో ఉందిదీనిని ప్రస్తుతం  ' కుక్కుటేశ్వరం ' అనిపిలుస్తారు.
సూర్యుడు ఆకలిని తట్టుకోలేక మంత్రోచ్ఛారణకు ముందుగానే భుజించడంతో ఆగ్రహించిన ఇంద్రుడు వజ్రాయుధంతో సూర్యుడు కాంతి హీనుని చేస్తాడు.  కోనేటికి ఆగ్నేయభాగంలో స్నానంచేయడంతో పూర్వవైభవాన్ని పొందాడుసూర్యుడు పూజలుచేసిన చోటు సరస్వ తీదేవికి  ఆగ్నేయదిశగా అఱమైలుదూరంలో గోదావరి నదీతీరాన ఉందిప్రస్తుతం దీనిని సూర్యేశ్వరమని పిలుస్తు న్నారుఆలయాని కి దక్షిణ దిక్కున వేదవ్యాసుడు తపస్సు చేసిన ప్రాంతాన్ని ఇప్పుడు వ్యాసతీర్థం అంటున్నారుఇక్కడ వ్యాసమందిరం కూడా  ఉందివాల్మీకి మహర్షి కోనేటికి నైరుతిదిశలో స్నానం చేసిశ్రీమద్రామాయణం వ్రాశాడువాల్మీకి పూజలు చేసిన స్థలం బాసర బస్టాండు సమీపంలో రోడ్డుకు కుడివైపున శ్రీ వెంకటేశ్వర మందిరంగా వెలుగొందుతోందివినాయకుడు అగ్రపూజార్హత పొందేందుకు కోనేటికి వాయువ్య దిశలో స్నానం చేశాడుగణేశుని మందిరం బాసరగ్రామం నుంచి సరస్వతీ మందిరానికి వెళ్లేమార్గం లో ఉంది. దశరథుడు ఉత్తర తీరంలోస్నానంచేయడంతో దీనిని పుత్రతీర్థం అంటున్నారుకుమారస్వామి పూజలు చేసిన స్థానం కుమార తీర్థం అనీఈశాన్య దిశలో ఈశ్వరుడు స్నానంచేసి దేవిని ధ్యానించిన ప్రాంతాన్ని శివతీర్థం అని పిలుస్తారుసరస్వతీ మంది రానికి ఉత్తరా న ఒక మైలు దూరంలోని ప్రదేశాన్ని ' పాపహరేశ్వరాలయ 'మని పిలుస్తారుకోనేటి మధ్యభాగంలో ఉన్నదానిని సరస్వతీ తీర్థం అని పిలుస్తారు.
 మందిరం చాళుక్యుల కాలంలో నిర్మించినదిగా చెప్తారుదేవాలయం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలోఆహ్లాదకరంగా ఉండ టం వల్ల ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుందిధ్యానదేవాలయానికి తూర్పుభాగమున ఔదుంబర వృక్ష (మేడిచెట్లఛాయలో దత్త మంది రమూదత్త పాదుకలూ మనం చూడవచ్చు
మహాకాళీ దేవా లయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉందిశ్రీ వ్యాసమందిరం దక్షిణదిశలో ఉంటుందిఇందులో వ్యాసభగవానుని విగ్రహమువ్యాసలింగము ఉన్నాయిమంది రానికి దగ్గఱలో ఒక గుహ ఉన్నదిఇది నరహరి మాలుకుడు తపస్సుచేసిన స్థలమని చెప్తారుఅక్కడ "వేదవతిఅనే శిలపై తడితే ఒక్కో ప్రక్క ఒక్కో శబ్దం వస్తుందిఅందులో సీతమ్మవారి నగలున్నాయని చెప్తారు.
ఇంత మహా మహిమాన్వితమైన బాసరకునేటికీ  దేశవిదేశాల్లో నివశిస్తున్న భారతీయులుముఖ్యంగా ఆంధ్రులు ప్రత్యేకించివచ్చితమ పిల్లలకు అక్షరాభ్యాసం చేసుకుని , తమ బిడ్డలు జ్ఞానసంపన్నులుగావిద్యా వివేకాలతోసద్బుధ్ధులతో  విరాజిల్లాలని  అమ్మను  పూజిం చి వెళుతుంటారు
అట్టి జ్ఞానమూర్తిని దర్శించని జన్మ వృధా అనడంలో అతిశయం లేదని భావించవచ్చుఒక్కమారైనా అమ్మను దర్శిస్తే  జన్మ సార్ధక మవు తుంది.
                                                         ***********


No comments:

Post a Comment