Thursday 20 June 2013

రాజోద్యోగి అవినీతిని బయటపెట్టిన కస్తూరి తైలం

రాజోద్యోగి అవినీతిని బయటపెట్టిన కస్తూరి తైలం


apr -   Sat, 15 Jun 2013, IST


  hyd

ఆనందపాలుడు ఆ వినతిపత్రం చదివి, వెంటనెె ఒకసైనికుని పిలిపించి, అతనికి ఏదోవిషయం రహస్యంగా చెప్పి పంపాడు. ''నాయనా! ఏదీ నీవు శిసు ్తచెల్లించి న పత్రం?'' ని దగ్గరగా పెట్టుకుని పరిశీలించి,'' నీవు శిస్తుకట్టడానికి ఎంత సొమ్ము ఇచ్చావు?'' అని అడిగాడు. దానికినాగప్ప'' అయ్యా! నేను పది బంగా రుకాసులు ఇచ్చా ను. నాకు ఐదువెండికాసులు తిరిగి ఇవ్వవల సి ఉండగా, అవి ఇవ్వకనే రసీదుపత్రం ఇచ్చాడు లేఖకు డు , 'ఇదేమినిటి?' అడిగితే, వెళ్ళి దిక్కు న్న చోట చెప్పుకోమ న్నాడు. రెక్కా డి లేకానిడొక్కడని నిరుపేదలం, మా మొర ఆలకించేవారెవరు? మీరే న్యాయం చేయాలి''అని విన యంగా కోరాడు. ఆనందపాలుడు లేఖకుని పిలిపించి'' దీనికి నిసమాధానమేమి'' అని ప్రశ్నిం చాడు. ''ప్రభూ! నేను తిరిగి ఇవవ్వలసిన ఐదు వెండి కాసులూ ముందుగా ఇచ్చేసీ, ఆపైన, రాజ ముద్ర వేసి శిసు ్తరసీదు ఇచ్చాను. ఐతే ఆసమయంలో అక్కడెవ్వరూలేనందున నేను సాక్ష్యం చెప్పించలేను'' అన్నాడు భయభయంగా.
మీరెవ్వరూసాక్ష్యం చెప్పినవసరంలేదు. నేనే చెప్పాను దోషమెవరిదో!'' అంటూ మహారాజు విజయవర్మ సమీపానికి వెళ్ళి, ఆ రశీదు పత్రాన్ని ఇచ్చి రహస్యంగా ఏదో చెప్పాడు. ఆ రసీదు అందుకుని దగ్గరగా పెట్టుకుని చూశాడు విజయవర్మ. ''ఆనందపాలా! నీవే ఈసమస్యను పరిష్కరించు'' అన్నాడు. మహారాజా! మనం మన రాజోద్యోగులకు జీతాలు పెంచి చాలా కాలమైంది. ముందుగా చిరు ఉద్యోగుల కు ఈ మాసం నుండీ జీతాన్ని పెట్టింపు చేయవలసినదిగాను, చిరుద్యోగుల కుటుంబాలకు ఉచిత వైద్య సౌకర్యం కూడా కలిగించమని, ఈ రైతుకు ఇవ్వలసిన ఐదు వెండికాసులకూమరో ఐదు కలిపి పది కాసులు ఖజానా నుండీ చెల్లించవలసినది గాను, పేదరైతులకు శిస్తు సొమ్ము సగానికి తగ్గించి వారిని ఆదుకోవలసినదిగాను, మనవిచేసుకుంటున్నాను. ''అన్నాడు. ఆ తీర్పు విని మహారాజు ఆశ్చర్యపోగా సభికులంతా అయోమయంలో పడ్డారు. ఉద్యోగులంతా కరతళధ్వనులు చేశారు. విజయవర్మ ''ఆనందపాలా! నీనిర్ణయాలు ఆమోదిస్తున్నాను, నీవే సభికులకు విష యం వివరించ కోరుతున్నాను. నీవు గుర్తు చెసే వరకూ నా కర్తవ్యం మరచి నందుకు బాధపడుతున్నాను''అన్నాడు రాజు.
ఆనందపాలుడు తన స్థానం నుంచి లేచినిలబడి, స్వరంసవరించుకుని ''ప్రభూ! సభి కులారా! మన నిత్యజీవన సంభా రాలన్నీ సామాన్యులకు అందుబా టులోలేని విధంగా ధరలన్నీ పెరిగి పోయాయి. సామాన్యుల జీవనం భారమైంది. కనుకే చిరుద్యోగులు వారికి అందుబాటు లో ఉన్నంత మేరకు ప్రజలనుండీ కొంత సొమ్ము మిగిలించు కోజూడటం జరుగుతు న్నది. ఈ విషయం నాకు చూచాయ గా తెలుస్తునే ఉంది చారుల వలన. కానీ అది ప్రభువుల సమక్షానికి వచ్చిన ప్పుడు వారే పర్యవసానం ప్రస్తావించాలని ఇంతకాలం ఆగా ను. నేను పంపిన సేవకుడు వెళ్ళి ఈ లేఖకుని ఇంటి పరిస్థితి పరికించి వచ్చి చెప్పాడు. వయోభారంతో అనా రోగ్యం తో ఉన్న తల్లి, వింత వ్యాధి తో బాధపడుతున్న భార్య దిక్కుతోచని పరిస్థితుల్లో ఇతడు వారికి వైద్య సేవలు అందించడానికి కావల్సిన డబ్బుల కోసం ఇలా చేశాడు. అది అతడి తప్పుకాదు.
అతని పరిస్థితి గ్రహించిన నేను ప్రభువుల వారిని చిరు ఉద్యోగుల జీతభత్యాలు పెంచమని కోరాను. అంతేకాదు అన్ని నాణాల సంచు లలోనూ కస్తూరీతైలం ఉంచుతాను. అది ఎవ్వరికీ తెలీయదు.
కాసులను తీసే సమయంలో ఆ తైలం వారికి చేతులు అంటుకుని రసీదు
పత్రానికి అంటుకుంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే దాని నివాసన తెలుస్తుంది ఈ రైతుకువెండికాసులు ఇవ్వలేదని తైలం అంటనందున తెల్సుకున్నాను. మహారాజా! ఎవ్వరూ పుట్టుకతో దొంగలూ, లంచగొండులుకారు. వారిపరిస్థితులు, వారినలా చెస్తాయి. ప్రభువులు ప్రజల, ఉద్యోగుల అవసరాలు గుర్తిస్తే ఈ ఇబ్బందులు ఏర్పడవు. నేనే ముందుగా ప్రభువులకు విన్నవించుకోకపోవడం నాదే పొరబాటు.'' అని ముగిం చాడు. ఆనంపాలుడి తెలివిని అభినందిస్తూ.. ఆయన చేసిన సూచనలను ఆమో దించాడు రాజు.
ప్రజల బాధల గుర్తించే ప్రజ్ఞ పాలకులకుంటే అంతటా నీతినిజాయితీలు కలకాలముంటాయి.
http://www.prabhanews.com/childrenspecial/article-378247
ఆంధ్రప్రభ దినపత్రికలో బాలప్రభ లో శనివారం జూన్ 15 న ప్రచురితం.