Wednesday 27 February 2013

ఫిబ్రవరి 28 జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం



ఫిబ్రవరి 28 జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం
            మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల 28న 'జాతీయ సైన్స్ దినోత్సవం' జరుపుతూనే ఉన్నాం. నోబెల్ బహుమతి గ్రహీత సర్ సి.వి.రామన్ కనిపెట్టిన 'రామన్ ఎఫెక్టు 'కు గుర్తింపుగా ఈరోజున 'జాతీయ విజ్ఞాన శాస్త్ర' దినోత్సవాన్ని జరపా లని  1986లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి,ఈ ఉత్సవాన్ని1987 లో ప్రారంభించారు.విజ్ఞానశాస్త్ర ఫలాలు సమాజంలోని అందరికీ ,  అందాలని మనఆకాంక్ష.గత ఐదేళ్లలో చేసిన కృషి ఆధారంగా విజ్ఞానశాస్త్రాన్ని సమర్థవంతంగా ప్రచారం చేసిన వ్యక్తికి లేదా సంస్థకు, ప్రచార మాధ్యమానికి ,బాలల్లో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేసిన వారికి వేరువేరుగా ఈ సందర్భం లో జాతీయ పురస్కారాలు ఇస్తారు. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం వైపు బాలల్ని ఆకర్షించేందుకు ఈ రోజున వివిధ పరిశోధనా సంస్థలు బాలల్ని ఆహ్వానించి తమ పరిశోధనల్ని చూపుతాయి.
                   సైన్స్ ప్రదర్శనలు, పోటీలు, ఇతర కార్యక్రమాలు భావిపౌరులైన బాలల్లో శాస్త్ర విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథంపై అవగాహనను పెంచుతుంది. దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాం. శాస్త్రీయదృక్పథంవిస్తరిస్తున్న మేరకు ఈ ఉత్సవాల లక్ష్యాలు నెరవేరినట్లుగా భావించాలి.విజ్ఞాన శాస్త్ర ప్రయోజనాలను ప్రజలకు తెలియజెప్పి వారిఅనుభవంలోకితెచ్చేప్రయత్నా లలో జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం (నేషనల్ సైన్స్ డే ) ఒకటి. జాతీయ వైజ్ఞానిక, సాంకేతిక ప్రచారమండలిప్రతీసంవత్స రం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఉత్సవంలో భాగంగా చర్చలు, ప్రదర్శనలు, ఉపన్యాసాలతోపాటు క్విజ్ పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. పాఠశాల, కళాశాల విద్యార్ధులను, అధ్యాపకులను ప్రోత్సహించడం ద్వారా వైజ్ఞానిక దృక్పథాన్ని వ్యాప్తి చేయడం ఈ ఉత్సవాల ముఖోద్దేశం.
     వైజ్ఞానిక విషయాలను ఉపయోగాన్ని ప్రజలకుతెలియజెప్పడం వలన  వైజ్ఞానికపురోభివృద్ధివేగవంతమవుతుంది. దీనికై  ఈ విషయాలను తేలికైన భాషలో విడమర్చిచెప్పేకమ్యూనికేటర్లనుఅభివృద్ధిచేసుకోవడంముఖ్యం.  జాతీయ వైజ్ఞానిక దినోత్సవం నిర్వహణ ద్వారా మన జాతి మెత్తం ఏడాదికి ఒకసారి తన పూర్తి దృష్టిని శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశాలపై కేంద్రీకరించడానికి వీలవుతుంది.ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు ప్రజల్లో సైన్స్ పట్ల ఆసక్తిని, వైజ్ఞానిక పరిశోధనల ఫలితాలను తెలుసుకొనే అవకాశాన్ని కలిగిస్తాయి. శాస్త్ర వేత్తలు సాధారణ ప్రజలతో ముఖాముఖీ కలవడం ద్వారా శాస్త్ర సాంకేతిక పురోగతిని జనబాహుళ్యపు అవసరాలకు తెల్సుకునే వీలు కలుగుతుంది. జనాభాలో అత్యధిక శాతం ప్రజలు ఆధారపడుతున్న వ్యవసాయరంగానికి ఆధునిక పద్ధతులను, వంగడాలను తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఆ దిశగా అవసరమైన భూమికను అభివృద్ధి చేయడానికి ఉత్సవం కొంతమేరకు దోహదపడుతుంది. శాస్త్ర పరిశోధనల్లో తలమునకలై ఉండే వైజ్ఞానికులు, జీవన సమరంతో తీరికలేని సామాన్య ప్రజలు ఇద్దరిని ఒక్కచోటకు చేర్చే అరుదైన రోజుగా ఈ విజ్ఞానిక దినోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జాతీయ వైజ్ఞానిక, సాంకేతిక ప్రచార మండలి ప్రతీ సంవత్సరం ఒక ప్రత్యేక అంశాన్ని ఎంచుకుంటూ వస్తోంది. ప్రాధమిక విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని పెంపొందింపచేయడం, సమాచార సాంకేతిక విజ్ఞానం సాయంతో  సైన్స్ బోధన, వ్యర్ధం నుంచి సంపద, డి.ఎన్. ఏ ఆవిష్కరణ స్వర్ణోత్సం, భౌతిక శాస్త్రం పురోభివృద్ధి, మోర్ క్రాప్ ఫర్ డ్రాప్ పేరిట సమర్ధ సేద్యపు నీటి వినియోగం వంటి అంశాలను సైన్స్ డే ఉత్సవాలకు ముఖ్యాంశాలుగా ఎంచుకుంటున్నారు.  శాస్త్ర అంశాలని సులభగ్రాహ్యంగా మార్చి ప్రజలకు తెలియజెప్పడానికి ఎంతో ప్రాధాన్యత వుంది. దీనిని గుర్తించిన జాతీయ వైజ్ఞానిక సాంకేతిక ప్రసార మండలి కేంద్ర ప్రభుత్వంలోని శాస్త్ర సాంకేతిక శాఖతోకల్టివేషనల్ సైన్స్ పాపులరైజేషన్ ‘ అవార్డులను ఇస్తుంది. సమాజపు సంపూర్ణ అభివృధికి తోడ్పడే విధంగా వైజ్ఞానిక అంశాలను గుర్తించి అవార్డులు ప్రధానం చేస్తున్నారు.
 అభివృద్ధి చెంది ఆధునిక దృక్పథాన్ని అలవరుచుకొన్న వర్గాల సంఖ్య క్రమంగా పెరిగుతున్నప్పటికీ, సమాజం మొత్తం శాస్త్ర దృక్పథాన్ని అనుసరించడం ఇంకా పూర్తిగాని లక్ష్యంగానే మిగిలివుంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పాటించడం, ఉత్సవాలు జరపడం పౌరుల్లో శాస్త్ర దృక్పథాన్ని అలవరుచుకునే వారి సంఖ్యను పెంచుతుంది. తిరుగులేని హేతుబద్ధమైన ఆలోచనను రేకెత్తించండం మానవ సంక్షేమంలో శాస్త్ర విజ్ఞానాల పాత్ర. ప్రయోగాత్మక పరిశీలనలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడంవలన  కచ్చితమైన ఫలితాలు లభిస్తాయి.
 భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి సి.వి రామన్. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికి సుపరిచితుడు శ్రీచంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి.రామన్).1888నవంబరు7 న తమిళనాడులోని తిరుచినాపల్లిలో జన్మించి,చిన్నతనంనుంచి విజ్ఞానశాస్త్రవిషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడంతో అతడు పసితనం నుండే  భౌతికశాస్త్రం వైపు కుతూహలం పెంచుకున్నాడు. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్ లో  గోల్డ్ మెడల్ సాధించి) పూర్తి చేశాడు. 1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి ప్రధముడిగా నిలిచారు. తన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు ఆయన ఇంగ్లాండు వాతావరణానికి సరిపడడని తేల్చడంతో అతను ఇంగ్లాండు ప్రయాణం విరమించుకున్నాడు.
‘నన్ను అన్ఫిట్ అన్న ఆ డాక్టరుకు నేనెంతో రుణపడి ఉన్నాను ‘ అని తర్వాత రామన్ పేర్కొన్నారు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ‘ఐసిఎస్ ‘ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు ‘లోకసుందరి అమ్మాళ్తో ‘ పెళ్ళయింది. ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌబజారు స్ట్రీట్ వద్ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి పరుగు పరుగున వెళ్ళాడు. ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాడు. పరిశోధనలపై ఉన్న ఆసక్తి వలన తెల్లవారుజామున ఐదున్నరకే ఐసిఎస్కు వెళ్ళేవారు. తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశోధన, ఆదివారాలు, సెలవు దినాలు పరిశోధనలోనే గడిచేవి. 
అతని తల్లి పార్వతి అమ్మాళ్ కు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీతవాయిద్యాల గురించి సాగాయి. విజ్ఞాన పరిశోధన తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. 1921లో లండన్లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చాడు. అప్పుడు శ్రోతల్లోని ఒకరు ‘ఇలాంటి అంశాలతోరాయల్ సొసైటీ సభ్యుడవు కావాలనుకుంటున్నావా !’ అంటు నవ్వులాటగా అన్నప్పుడు ఆయనలో పరిశోధనలపై మరింత ఆసక్తి పెరిగింది. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతి శాస్త్రం వైపు మార్చాడు.
  ఒకమారు ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపచేసింది. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణం అని ఊహించాడు. కలకత్తా చేరగానే తన ఊహను నిరూపించడానికి ద్రవాలు,వాయువులు,పారదర్శక ఘనపదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. అందుకు యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్ .కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు.
 కె.యస్.కృష్ణన్ 1927 డిసెంబరులో ఒకరోజు సాయంత్రం రామన్ వద్దకు పరుగెత్తుకొని వచ్చి కాంప్టన్ (భౌతిక శాస్త్రవేత్త)కు నోబెల్ బహుమతి వచ్చిందని ఆనందంతో చెప్పగానే రామన్ ఎక్సలెంట్ న్యూస్ అని సంతోషపడ్డా, కాంప్టన్ ఫలితం ఎక్సరేయిస్ విషయంలో నిజమైనపుడు, కాంతి విషయాలలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. తగినంత అధునాతనమైన పరికరాల్లేకపోయినా, రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్నాడు.
అతను అనుకున్నట్లే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించాడు. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ’రామన్ ఎఫెక్టు‘అసామాన్యమైనదని, అందులో 200 రూపాయలు కూడా ధరచేయని పరికరాలతో ఆ దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్ను అభినందించారు. ఈయన పరిశోధన యొక్క విలువను గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రధానం చేశారు. ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో 'భారతరత్న' అవార్డు బహుకరించిన సమయంలో సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ 'విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి' అన్న మాటలు నేటికి ఆలోచింపచేసేవి. ఆయన పరిశోధనల అధారంగా భౌతికశాస్త్రంలో' రామన్ స్పెక్ట్రోస్కోపి 'అనే కొత్త విభాగం ప్రసిద్దిగాంచింది.
ఆయన’నాజీవితంలో ఒకవిఫల ప్రయోగం. ఎందుకంటే నేను నామాతృభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలననుకున్నాను. ,అంటూ చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్దికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబరు 20 న భౌతికంగా కన్నుమూసినా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఆయనను చిరంజీవిగా మనమధ్యే నిలిపేలా కొన్ని సంస్థలు ఆయన పేరు మీద టాలెంట్ టెస్ట్ లు, సైన్స్ కు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నాయి. విద్యార్ధినీ, విద్యార్ధుల్లో ఆయన స్పూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా చేస్తున్నాయి.
'కొత్త విషయాలను కనిపెట్టి దేశాభివృద్ధికి తోడ్పడిన శాస్త్రజ్ఞులకు ఈరోజున దేశం కృతజ్ఞతలతో, గౌరవాభివందనలను తెలుపుతుంది. ఈ రోజున జరిగే విద్యాకార్యక్రమాలు బాలల్ని 'విజ్ఞానశాస్త్రం' వైపు ఆకర్షించి, వృత్తిగా స్వీకరించేందుకు ప్రోత్సహిస్తుంది. శాస్త్రజ్ఞులందరూ నాణ్యమైన పరిశోధనలతో దేశాభివృద్ధికి పునరంకితం కావడానికి, వీరి పరిశోధనలతో దేశం గర్వపడడానికి ఈ రోజు అవకాశం కల్పిస్తుంది. దేశప్రగతికి, జాతిపురోభివృద్ధికి శాస్త్రవిజ్ఞానం అత్యవసరమని ఈ రోజు ఉత్సవాలు దేశప్రజలకు సందేశాన్నిస్తాయి.
ఈ సందర్భంగా పిల్లలందరికీ పూర్వం నుండీ సాధారణ మానవాళికి ఉపయోగపడే అనేక పరికరాలను కనిపెట్టినవారినీ, శాస్త్రేవిఙ్ఞానాన్ని కొత్తపుంతలు తొక్కించినవారినీ, భారతదేశానికి చెందినవారినేగాక , ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవిఙ్ఞానానానికి ఎనలేని సేవలు అందించిన శాస్త్రఙ్ఞులందరినీ పరిచయం చేయటం ధర్మ.కనీసం వారిని స్మరించేలాచేయడమ్మనధర్మ.
ఆనేక రంగాలకు చెందిన ఫ్రాచీనకాలపు శాస్త్ర విఙ్ఞానవేత్తలు
        పాణిని(క్రీ.పూ.4],పింగళుడు,వరాహమిహిరుడు (క్రీ.శ.505-587),ఆర్యభట్టు,బ్రహ్మగుప్తుడు -అంకగణితం లో "సున్న" భావన తెచ్చుటకు దోహదపడినవాడు (క్రీ.శ 598-670),మొదటి భాస్కరుడు (క్రీ.శ 600 నుండి 680),    శ్రీధరుడు (క్రీ.శ 650-850 ల మధ్య) - గోళం యొక్క ఘనపరిమాణం కనుగొనుటకు ఉత్తమ సూత్రములు ప్రతిపాదించినవాడు,మహావీరుడు (9 వ శతాబ్దం),పావులూరి మల్లన - మొదటి తెలుగు గణిత శాస్త్రవేత్త,         ఆచార్య హేమచంద్రుడు (క్రీ.శ 1087 నుండి 1172),        రెండవ భాస్కరుడు (క్రీ.శ 1114 నుండి 1185 వరకు).
మధ్య యుగం నుండి మొఘల్ కాలం వరకు--నారాయణపండితుడు,మాధవుడు--కలన గణితంలో కొన్ని భావనలు],పరమేశ్వరుడు (1360–1455)[దృ క్ -గణితం, ఖగోళ శాస్త్ర ఆధారంగా పరిశీలనలు],నీలకంఠ సోమయాజి 1444–1545 – గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త,మహేంద్ర సూరి ,(14 వ శతాబ్దం),శంకర వారియార్ (చ్.1530),రఘునాధ శిరోమణి (1475–1550)--తర్క శాస్త్రము, నవద్వీప పాఠశాల;జ్యేష్టదేవుడు (1500–1610)"యుక్తిభాస" గ్రంధ రచయిత;అచ్యుత పీషరటి (1550–1621)ఖగోళ శాస్త్రవేత్త,గణిత శాస్త్రవేత్త;మునీశ్వరుడు (17 వ శతాబ్దం),కమలాకరుడు (1657),జగన్నాధ రాయలు (1730).
        ఆధునిక యుగపు శాస్త్రవేత్తలు(1800లలో జన్మించినవారు)--
రామచంద్ర లాల్,గణేష్ ప్రసాద్,శ్రీనివాస రామానుజన్,ఎ.ఎ. కృష్ణస్వామి అయ్యంగార్.
1900లలోజన్మించినవారు---తిరుక్కన్నపురంవిజయరాఘవన్(19021955);దత్తాత్రేయరామచంద్రకప్రేకర్(19051986),సర్వదమన్చౌలా(19071995),లక్కోజుసంజీవరాయశర్మ(19071998),సుబ్రహ్మణ్యచంద్రశేఖర్(19101995),ఎస్.ఎస్.శ్రీఖండే[1917),హరీశ్చంద్ర(19201983),సీ.రాధాకృష్ణరావు[1920),మతుకుమిల్లివెంకటసుబ్బారావు(19212006),పి,కెశ్రీనివాసన్(19242005),శ్రీరాంశంకర్అభయంకర్(1930),ఎం.ఎస్నరసింహన్[1932),సీ.ఎస్శేషాద్రి(1932),కె.ఎస్.ఎస్నంబూద్రిపాద్[1935),వినోద్జోహ్రీ(1935),ఎస్.రమణన్(1937),సి.పి.రామానుజన్(19381974),వి.యన్.భట్(19382009),ఎస్.ఆర్.శ్రీనివాసవరదాన్(1940),ఎం.యస్.రఘునాథన్[1941),పాల్ప్రసాద్[1945),విజయ్కుమార్పటోడి(1945–1976),ఎస్.జి.దాని[1947),రామన్ పరిమళ(1948),నవీన్ఎం. సింఘి[1949),నరేంద్ర కర్మాకర్ ( 1957),మణీంద్రఅగర్వాల్ 1966),మధుసూధన్[1966),చంద్రశేఖర్ ఖరె [1968),మంజుల్ భర్గవ [1974),అమిత్ గార్గ్ (1978),అక్షయ్ వెంకటేష్ (ఈందీన్ ఒరిగిన్ ఆఉస్త్రలీన్) (1981),ఊ.శ్.ఋ.మూర్తి,విజయ్వజరాని,ఉమేష్వజరాని,సంతోష్వెంపల,కన్నన్సౌందరరాజన్[1982),సుచరిత్శంకర్[1983),ఎల్.మాధవీన్,ఆనంద్కుమార్.అయ్యగారిసాంబశివరావు,నారాయణంనరసింహమూర్తి,
యలవర్తి నాయుడమ్మ,యల్లాప్రగడ సుబ్బారావు.
కొందరు శాస్త్రవేత్తలను కొద్దిగా పరిచయం చేసుకునేప్రయత్నం చేద్దాం-
అమార్త్య కుమార్ సేన్ (1933] భారతీయ తత్త్వ శాస్త్రవేత్త.'ఆర్థిక శాస్త్రం'లో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. 1998లో కరువు, మానవ అభివృద్ది సిద్ధాంతము, సంక్షేమ ఆర్థిక శాస్త్రము, పేదరికమునకు కారణములు మరియు పొలితిచల్ లిబెరలిస్మ్ లలో చేసిన విశేష కృషికి,'సోషల్ ఛాయిస్ 'అనే నూతన సూత్రీకరణను ప్రవేశపెట్టాడు.
యూక్లిడ్ -ఇతడి రచన’ఎలిమెంట్స్ ‘గణితశాస్త్రపు చరిత్రలో ఒక ప్రసిద్ధ మైన రచన.. దీనిలోని సూత్రాలను ‘యూక్లీడియన్ జియోమెట్రి ‘గా పిలుస్తారు. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ అంతటివాడు కూడా తన సాపేక్ష సిద్ధాంతము వివరించటం కోసము యూక్లిడ్ జామెట్రి పద్ధతిని వాడు కోవడం మరో దృష్టాంతం అంతే కాదు. " జ్యామితీయ గణితంలో తర్క బధ్ధమైన   ఆలోచనకు తావు కల్పించిన గొప్ప మేధావి యూక్లిడ్ అని కూడా ఐన్ స్టీన్ ప్రశంశించాడు
యొనార్డో డావిన్సి - ఇటలీ కు చెందిన ఒక శాస్త్రజ్ఞుడు, గణితజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు. ఇతడు చిత్రించిన చిత్రాలలో ప్రసిద్ది చెందినది మొనాలిసా చిత్రం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన "లాస్ట్ సప్పర్" చిత్రాన్ని2సం కాలం చిత్రించాడు.విమానాల వంటిఎగిరే యంత్రాలకు నమూనాలను తయారుచేసాడు. నీటి గడియారాన్ని అందించాడు.బరువైన వాటిని తేలికగా తొలగించే "క్రేన్" లను యేర్పాటు చేశాడు.
విలియం హార్వే  --ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యశాస్త్రవేత్త. గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతినికనిపెట్టాడు.  రక్తం ప్రవహించే మార్గంలో వాల్వులు ఎలా పనిచేస్తాయో కనిపెట్టాడు. మనిషి గుండె నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుందో, ఎంత రక్తాన్ని పంప్ చేస్తుందో చెప్పగలిగాడు. తన పరిశీలనలతో’అసటామికల్ ఎక్సర్ సైజ్ ఆన్ ది మోషన్ ఆఫ్ ది హార్ట్ అండ్ బ్లడ్’ , లో "ఎక్సర్ సైజస్ ఆన్ ది జనరేషన్ ఆఫ్ ఆనిమల్స్" అనేరెండు అమూల్యమైన గ్రంథాలను వెలువరించాడు.హంప్రీ డేవి—'డేవీ దీపం' పేరుతో ఈయన కనుగొన్న  దీపాన్ని పిలుస్తారు.గనులలో మీథేన్ వాయువు వల్ల జరిగే ప్రమాదాలు ఈ 'డేవి సేఫ్టీ 'దీపంతో తగ్గిపోయాయి. నైట్రస్ ఆక్సైడ్ లేదా లాఫింగ్ గ్యాస్ (నవ్వించె వాయువు] నుకూడాకనుగొన్నాడు. "ఎలిమెంట్స్ ఆఫ్ కెమికల్ ఫిలాసఫీ"పుస్తకాన్ని ప్రచురించాడు.
హిప్పోక్రేట్స్ -- ప్రాచీన గ్రీకు పెరికల్స్ యుగానికి చెందిన "వైద్యశాస్త్ర పితామహుడు" అనే బిరుదు గల వైద్యుడు.రోగి లక్షణాలను నిశితంగా పరిశీలించాకే రోగాన్ని గురించి తెలుసుకోవాలని చెప్పాడు.దీన్ని  హిప్పోక్రటిస్ భావన గాప్ గా పిలిచేవారు.హిప్పోక్రటిస్ కు ఎముకల గురించి,కండరాలగురించి, నరాల గురించి, రక్త నాళాల గురించి ఎంతో తెలుసు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈయన రాసిన "ఎములు విరుగుట,బెణుకుట" అనే గ్రంధం. చేతివేళ్ళ క్లబ్బింగ్ చేయుటలో ఇతను మొదటి సారిగా సఫలీకృతుడయ్యాడు, దీర్ఘకాలిక రోగాలైన ఊపిరితిత్తుల కేన్సర్ మరియు సయానోటిక్ గుండె జబ్బు లను నిర్ధారించి, వైద్యవిధానాలను రూపొందించాడు, చేతివేళ్ళను జోడించడంలో సఫలుడైనందు వలన ఈ వేళ్ళను "హిప్పోక్రటిక్ ఫింగర్స్" అనికూడా వ్యవహరిస్తారు.
ఆర్యభట్టు -- భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 476-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఇతను ఆర్యభట్టీయం, ఆర్య సిధ్ధాంతం, గోళాధ్యాయం,సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఆర్యభట్టు ‘పై ‘విలువను సుమారుగా కనుకున్నట్లు చెప్తారు. గణితం లో మనం నేర్చుకున్న' సైన్' 'కొసైన్ 'లను ఇతను "జ్యా" మరియు "కొ జ్యా" గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ‘ఆర్యభట్ట’ అని పేరు పెట్టారు.ఆర్యభట్టు తన పుస్తకంలో మేరు పర్వతం హిమాలయాల్లో సుమారు యోజనం ఎత్తున ఉందని ప్రతిపాదించాడు" . క్షేత్రగణితం, మరియు త్రికోణమితి ,ఆరవ గణిత పాదంలో త్రిభుజం యొక్క వైశాల్యాన్ని ఆర్యభట్ట వివరించాడు.బీజ గణితం ఆర్యభట్టీయంలోనే శ్రేణుల మొత్తాన్ని గణించడానికి  సూత్రాలు ప్రవేశ పెట్టాడు. భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు వస్తాయని, రాహు కేతువులు అనేవి నిజంగా లేవని వాదించాడు గ్రహాలకుస్వయంప్రకాశం లేదనీ సూర్యకాంతి పరివర్తన వలన వచ్చినదని చెప్పాడు. సూర్య గ్రహణాల ను ఖచ్చితంగా లెక్క కట్టాడు.భూమి తన చుట్టూ తాను తిరగటానికి పట్టే సమయం 23 గంటల, 56 నిమిషాల, 4.1 సెకనులు గా లెక్కగట్టాడు. ఈనాటి ఆధునిక లెక్కల ప్రకారం అది 23 గంటల, 56 నిమిషాల, 4.091 గా తేలింది.
సర్ జగదీష్ చంద్ర బోస్ --బెంగాల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఇతడు రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు. ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు.వృక్ష భౌతిక శాస్త్రంలో అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు. తాను రూపొందించిన పరికరం ‘క్రెస్కోగ్రాఫ్ ను ఉపయోగించి వివిధరకాలైన పరిస్థితుల్లో మొక్కలు ఎలా స్పందిస్తాయో పరిశోధనాత్మకంగా నిరూపించాడు.
ఆర్కిమెడిస్ -- ప్రముఖ గ్రీకు గణిత, భౌతిక శాస్త్రవేత్త , ఇంజనీరు, ఆవిష్కర్త మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు . భౌతికశాస్త్రంలో ఆయన చేసిన హైడ్రోస్టాటిస్టిక్స్, స్టాటిస్టిక్స్ , లేవేర్ సిద్దాంతాలు ముఖ్యమైనవి . సీజ్ ఇంజిన్స్ మరియు స్క్రూ పంప్ లతో పాటు క్రొత్త యంత్రాల రూపకల్పనలు ఆయనకు ప్రతిష్టనిచ్చాయి. ఆధునిక ప్రయోగాల అర్హత అంతర రూపకల్పనల పరిశోధించు సామర్ద్యంగల ఆర్కిమెడిస్ సూత్రం గా ఆవిష్కరింపబడింది.
టోలెమీ -"భూకేంద్రక సిద్ధాంతము"ఆవిష్కరించాడు... దృక్ శాస్త్రం గురించి   రాశాడు. కాంతి కిరణాలు పరావర్తనం చెంది మన కంటిని చేరినప్పుడు మనకు కనిపిస్తాయి. ఇలాగే కాంతి కిరణాలు యానకాలను మారేటఫ్ఫుడు మార్గాలలో మార్పులు తెచ్చుకుని వక్రీభవనం ప్రదర్శిస్తాయని తె;లిపాడు.
పాస్కల్--' పాస్కల్ సూత్రం ' తెలియని వారు ఎవరూ ఉండరు. ద్రవ పదార్థంలో ఏదైనా ఒక విందువు వద్ద పీడనాన్ని ఉపయోగించడం  జరిగితే ఆ పీడన ప్రభావం ఆ ద్రవ పదార్థం అన్ని పైపులకు సమానంగా విస్తరిస్తుంది. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని'సిరెంజ్ని, హైడ్రాలిక్ ప్రెస్ ను, హైడ్రాలిక్ బ్రేక్ 'ను రూపొందించటం జరిగింది. పాస్కల్ నిర్మించినత్రిభుజాన్ని' పాస్కల్ త్రిభుజం 'అంటారు. పాస్కల్ లెక్కలు చేసే యంత్రాన్ని రూపొందించాడు. ఈ కాలిక్యులేటింగ్ మెషిన్ కూడికలు,తీసివేతలు, గుణింతాలు,భాగహారాలు వంటివి చేసిపెట్టేది.
పైథాగరస్ --ప్రపంచ ప్రసిద్ధి గాంచిన  గ్రీకు గణితశాస్త్రజ్ఞుడు.'పైధోగొరస్ సిద్ధాంతం 'శాస్త్రములో ముఖ్యంగా -జ్యామితి విభాగాములో ఈయన గురించి తప్పక చదవుతాం.ఒక త్రిభుజం లోని కోణాల మొత్తం అంటే 180 డిగ్రీలు లేదా రెండు లంబకోణాలని ఆయన చెప్పారు. బ్లెయిస్ పాస్కల్ కూడా అదే విషయాన్ని ఋజువు చేసారు. అదే విధంగా ఒక లంబ కోణ త్రిభుజంలో కర్ణం మీదివర్గం మిగిలిని భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం అనేది పైథాగరస్ సిద్ధాంతం.  
నికోలాస్ కోపర్నికస్ --మధ్యయుగానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. శాస్త్రీయంగాసూర్యకేంద్ర సిధ్ధాంతాన్ని నిరూపిస్తూ సిద్ధాంతీకరించాడు.
అరిస్టాటిల్ -ప్రముఖ ప్రాచీన గ్రీకు తత్వవేత్త. ప్లేటో కి శిష్యుడు మరియు అలెగ్జాండర్ కి గురువు.ఈయన భౌతిక శాస్త్రము, గణితము, కవిత్వము, నాటకాలు, సంగీతం, తర్కము, రాజకీయం, ప్రభుత్వం, నీతి నియమాలు, జీవశాస్త్రం మొదలగు చాలా విషయాలపై పుస్తకాలు రాశాడు."జీవ శాస్త్ర పిత" గా బహళ ప్రాచుర్యం పొందాడు.
గెలీలియో --మొట్టమొదటి టెలిస్కోప్ నిర్మాత.
చార్లెస్ రాబర్ట్ డార్విన్ -ఇంగ్లాండుకు చెందిన వాడు. ఇతని జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రదిపాదించాడు. సకల జీవరాశులు క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడతాయని,. వానరుని నుంచి నరవానరుడు, నరవానరుని నుంచి నరుడు పరిణామ పరంగా ఉద్భవించాడని తెలిపి సంచలనం రేపిన ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్.
టోరసెల్లి -- భారమితి ని కనుగొన్న మాహనీయుడు.
జాన్ నేపియర్.-- లాగరిథమ్స్ సృష్టి కర్త .ఆట్టో వాన్ గెరిక్-- మొట్టమొదటి ఎయిర్ పంపుని రూపొందించిన వాడు గెరిక్.వైద్యునిగా, ఇంజనీరుగా, తత్వవేత్తగా ఆట్టో వాన్ కు శాస్త్ర లోకంలో ఎంతో పేరుంది.
ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్  -- డైనమైట్ ఆవిష్కర్త. ఈయన ఆఖరి వీలునామాలో నోబెల్ బహుమతి స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడబెట్టాడు. కృత్రిమ మూలకము నోబెలియం ఇతని పేరు మీదుగా నామకరణం చేసారు.
సర్ ఐజాక్ న్యూటన్--ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. న్యూటన్ సూత్రాలు- వైఙ్ఞానిక ప్రపంచంలొ పేరుగాంచినవి.
జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ –స్కాట్లాండుదేశీయుదూ. భౌతిక/గణిత శాస్త్రజ్ఞుడు. ఆతని విశేషమైన కృషి వల్ల’మాక్స్‌వెల్ సమీకరణాలు ‘ఉత్పత్తి అయినాయి. మొదటి సారి మాక్స్‌వెల్ విద్యుత్ ను అయస్కాంతత్వాన్ని ఏకీకరించే సూత్రాలను ప్రరిపాదించెను.
జీన్ బాప్తిస్తే జోసెఫ్ ఫోరియర్—ఫ్రాంన్స్ దేశీయుడు. ఒక భౌతిక మరియు గణిత శాస్త్రవేత్త.'ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ nu ఫోరియర్ సీరీస్' ను కనుగొన్న శాస్త్రవేత్తగా లోకానికి సుపరిచితుడు.
డిమిట్రి ఇవనోవిఛ్ మెండలీఫ్-- సోవియట్ యూనియన్కు చెందిన రసాయన శాస్త్రవేత్త. ఇతడు మొట్టమొదట రసాయనిక మూలకాలతో ఆవర్తన పట్టికను ఆవిష్కరించాడు. అతని స్మృత్యర్ధం 101 పరమాణు సంఖ్య ఉన్న మూలకానికి మెండెలీవియం అని పేరు పెట్టారు.
లియొనార్డ్ ఆయిలర్ --స్విట్జర్లాండు కు చెందిన గణిత శాస్త్రజ్ఞుడు మరియు భౌతిక శాస్త్రజ్ఞుడు.ఇతడు ‘కలన గణితము ‘మరియు టోపోలజీ ‘లలో చాలా ముఖ్యమైన విషయాల కనుగొనెను. నవీన గణిత శాస్త్రము లో ప్రత్యేకంగా విశ్లేషక గణితములో చాలా మటుకు వ్యావహారిక పదాలను సంకేతాలను చాలా  మటుకు ఆయనే ప్రతిపాదించెను.ఆయిలర్ ఆతని గతి శాస్త్రము,. జామెట్రీ, కలన గణితము, త్రికోణ శాస్త్రము,బీజ గణితము మరియు సంఖ్యా సిద్ధాంతము.
సుబ్రహ్మణ్య చంద్రశేఖర్—భారతీయుడు. విలియం ఆల్ఫ్రెడ్ ఫోలర్ తో కలిసి నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను నోబెల్ బహుమతిని అందుకున్నాడు. ఇతని మేనమామ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్. చంద్రశేఖర్ కు భారతప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదు తో సత్కరించింది.
మేరీ క్యూరీ-- ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) ప్రప్రధమంగా ఈమెకే లభించాయి. ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకూ రెండు వేరువేరు వైజ్ఞానిక రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు. రేడియో ధార్మికతలో ఈమె పరిశోధనలు ఆ విషయంలో తరువాతి శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి. ఈమె భర్త, సహ పరిశోధకుడు అయిన పియరీ క్యూరీ వారి మొదటి నోబెల్ బహుమతిని ఈమెతో కలసి అందుకొన్నాడు. ఈమె కుమార్తె ఇరీన్ జూలియట్ క్యూరీ మరొక నోబెల్ బహుమతి గ్రహీత. ఇలా వీరి కుటుంబంలో ముగ్గురికి నోబెల్ బహుమతులు లభించాయి.
ఇలా కొంతవరకూ సందర్శకులకు శాస్త్రవేత్తలను పరిచయం చేసి, వారి కృషిఫలితంగా మనం ఎలా సౌఖ్యంగా జీవించగలుగుతున్నామో తెలిపి, వారివలె విద్యార్ధులు కూడా కొత్తకొత్త ఆవిష్కరణలకు కృషిచేయాలని ఉద్భోధించడం ఎంతైనా అవసరం.

Saturday 2 February 2013

31-జనవరి -నెమలిని జాతీయపక్షి గా గుర్తించిన రోజు.


                             31-జనవరి -నెమలిని జాతీయపక్షి గా గుర్తించిన  రోజు.

       భారతజాతీయపక్షి నెమలి .సృష్టి లోనే  సంభోగం చెయ్యని ప్రాణి నెమలి మాత్రమే.నెమలి అంత పవిత్ర మయినది కనుకే మన జాతీయపక్షిఐంది. శర్వాణీ తనయుడు శరవణుడు  తన వాహనంగా నెమలిని ఎంచుకున్నాడు.నెమలిని మయూరం అంటాం .పక్షిజాతులన్నింటిలోకీ అందమైనదీ, నృత్యం చేసే మగపక్షి నెమలి  ఒక్కటే అనవచ్చు.

మెరిసే నీలం రంగు ఛాతీతో అందమైన మెడతో  కంటికి విందుచేసే కంచు- ఆకుపచ్చ రంగులో దాదాపు రెండువందల పొడవైన ఈకలుకలిగిన  పింఛం తో మగజాతి నెమలి ఉండగా ఆడ నెమలి గోధుమ రంగులో మగ నెమలి కంటే చిన్నగా తోక లేకుండా ఉంటుంది. మగ నెమలి సర్వాంగ సుందరమైన ప్రణయనృత్యంతో తన తోకను విసనకర్రలా విప్పి ఈకలను సవరించుకునే విధానం ఒక కమనీయమైన ,చూచి కనువిందుచేసుకోవలసినదృశ్యం.
పక్షిజాతిలో "యోగవిద్య "తెలిసిన పక్షులు ఐదు మాత్రమే ఉన్నాయి, అవి:- శుకము, హంస, గరుత్మంతుడు, నెమలి , పావురము. వీటికి షట్ చక్రాల కుండలినీ పరిజ్ఞానము ఉంటుంది.  నెమలికి అందం దాని పింఛంమే,కానీ దానికి  ప్రమాదమూ దాని అందం చాటున పొంచే ఉంటుంది  .  

క్రౌంచపక్షి దేవతా పక్షి ఐనందున ఎంత దాహమేసినా భూమిపైన లభ్యమయ్యే ఏ నీటినీ త్రాగదు.మేఘాలు  వర్షించే సమయంలో పడే స్వఛ్ఛ మైన నీటిబిందువులు భూమిపై పడక ముందే నోరుతెరచి ఆనీటిని నాలుకపై పడేలా చూసుకుని  ఎంతో చాకచక్యంతో తన దాహాన్ని తీర్చుకుంటుంది.
ఇక నెమలి పుట్టుక వృత్తాంతంగురించీ   తెలుసుకుందాం :-
దేవతాపక్షులైన క్రౌంచపక్షులకు ఒకమారుశరీరమంతా గాయాలు కాగా  శ్రావస్తి పట్టణ సామంతుడైన పంచవర్ణుడు అనే రాజు వాటి గాయాలు నయంచేసినందుకు  కృతఙ్ఞతతో " ఓరాజా ! నీవుమా గాయాలు నయంచేసి నందుకు ప్రతిగా నీవు వృధ్ధుడివైనావుగనుక నీకు 'నవయవ్వనాన్ని' ప్రసాదించ దలచాము, నీకు   ఇష్టమే కదా!"  అని అడిగాయి.
 దానికి ఆరాజు పంచవర్ణుడు" ఓ! దేవతావిహంగాల్లారా! నాకు మీరు యవ్వనాన్ని ప్రసాదించడం కంటే నామరో కోరిక తీర్చితే సంతోషిస్తాను .." అనగా ఆక్రౌంచపక్షులు " రాజా ! మాకు మహోపకారం చేసిన నీకు నీవు కోరిన కోర్కెతీర్చడంకంటే ఆనందకరమైన విషయం మరోటి ఉండదు.నీకోరికేంటో  చెప్పు , తప్పకతీర్చుతాంఅన్నాయి.
 వృద్ధుడైన ఆ రాజు పంచవర్ణుడు  " నాకూ  మీకు మల్లే  విహంగంలా  ఆకాశంలో విహరించాలనే బలమైన  ఇఛ్ఛ ఉంది , అది అనుగ్రహించండి. " అనికోరగా ఆపక్షులు,
 " అలాగే నీ ఇఛ్ఛనెరవేర్చుతాము , మేము చెప్పబోయే' దేవతా మంత్రం 'ఆకాశంలో మబ్బులు క్రమ్మినపుడే నీకు పనిచేసి, నీకు చిత్రవిచిత్రమైన వర్ణనలు కలిగిన శరీరము,ఈకలు, పింఛము కలుగుతాయి.. అప్పుడు ఈ జగత్తులో నీకంటే  అందమైన పక్షి మరొకటి ఉండబోదు,ఐతే దీనికో నియమముందిఎటువంటి పరిస్థితులలో ఈ మంత్రం నీ భార్యకు చెప్పకు, అలాచెప్పావంటే ప్రమాదం సంభవిస్తుంది సుమా!" అనిచెప్పి మంత్రంబోధిం చి  వెళ్ళిపోయాయి.
     ఒకనాడు ఆకాశం మేఘావృతమై యుండగా  మంత్రప్రభావం చూద్దామని, మంత్రోఛ్ఛారణ చేయగా  ఆ మంత్రప్రభావానికి  పంచవర్ణమహారాజు ఒక మనోహరమైన, అందమైన పక్షిగా మారిపోయి ఆనందంగా గెంతులు వేస్తూ ఎగురుతుండగా అతని భార్య చూసింది. ఆమెకూ తన భర్తలా అలాంటి అందమైన పక్షిలా మారి ఆకమ్మని వాతావరణంలో విహరించాలనే కోరికకలుగగా  ,ఆనాటినుండి భర్తను ఎన్నోవిధాలుగా బ్రతిమాలుతూ, కోపిస్తూ, అలుగుతూ చివరకు  వేధిస్తూ ,హింసిస్తూ,ఆ మంత్రాన్ని తనకు చెప్పమని పోరసాగింది. ఇక ఆ బాధలు పడలేక పంచవర్ణమహారాజు సరేననిఅమంత్రాన్ని చెప్పాడు. ఇది తెల్సుకున్న ఆ మంత్ర అధిష్టాన దేవత అతని భార్యకు బుద్ధిచెప్పాలనుకుంది. ఆ మంత్రదేవత కారుమేఘాలను సృష్టించి ,వాతావరణాన్ని ఆనందమయం చేసింది. ఆ సమయంలో ఆరాజు  భార్యఆ మం త్రా న్ని జపించి , తను అతిసుందరమైన విహంగంగా మారిపోతున్నాననే భావనలో " అతిసుందర:" అనబోయి "అసుందర:" అన్నది. వెంటనే ఆ పదజాలంతో ఆమె పింఛంలేని ఆడ నెమలిగా మారిపోయింది. తమకిచ్చిన వాగ్దానాన్ని తప్పినందుకు  ఆ క్రౌంచపక్షులు కోపించి ఆ రాజుని శాశ్వతంగా మగనెమలిగా మారిపొమ్మనిశపించాయి.
ఆవిధంగా మగనెమలి, ఆడనెమలి సృష్టిలో ఉత్పన్నమయ్యాయని ఒకకధనం ..  

                     రేతస్సు అనగా వీర్యం  దీనిలో అమోఘమైన శక్తి నిక్షిప్తమై  ఉంటుంది. ఇలాంటి శక్తిని అధోపతన క్రియ ద్వారా మానవులు సంతానాన్నిపొంది వీర్యహీనులు అంటే తేజమును,శక్తిని కోల్పోతుండగా , యోగులు యిదే వీర్యాన్ని " ఊర్ధ్వపతన" క్రియ ద్వారా కపాల భాగానికి చేర్చి మోక్ష మార్గ గాములుగా అవుతున్నారు.ఇటువంటి యోగులందరిలోకి శ్రీకృష్ణభగవానులు  పరమోత్తములైన పరమయోగి పుంగవులు.. పదహారువేల మంది గోపికలున్నా, అష్టభార్యా సహితుడైనా, భామాలోలుడన్న పేరున్నా ఆయన అసలుసిసలైన అస్కలిత  బ్రహ్మచారి. 
           నెమళ్ళు తమ వీర్యాన్ని ఊర్ధ్వముఖంగా నడిపించగలశక్తి గలవి. అయితే జ్ఞానంలో మనిషికన్నా ఒకస్థాయి తక్కువగా ఉండటంవలన ఈ రేతస్సు (వీర్యం)పల్చటి జిగురు రూపంలో కంటిలోని గ్రంధుల ద్వారా బయటకు శ్రవించబడి ఒక రకమైన మదపువాసనను చిమ్మి ఆడనెమలిని ఆకర్షిస్తుంది. ఈ మదజలం, ఈ పతనమైన వీర్యం ద్వారా ఆడ నెమలి గర్భం ధరిస్తుంది.ఇక్కడ నెమలి గర్భం ధరించడం మానసికమైనది, స్త్రీపురుష జననేంద్రియాల సంభోగ ప్రక్రియ ప్రసక్తే లేదు. అందుకని నెమళ్ళు అర్ధస్ఖలిత బ్రహ్మచారులు. ఎప్పుడైతే,ఎక్కడైతే స్ఖలనము లేదో దానికి, యోగ సమానమై ఆరాధ్యనీయత కలుగుతుంది., ఆవిధంగా నెమలి పూజనీయమూ గౌరవస్థానమూ  ఆక్రమించింది. అందువల్లే శ్రీకృష్ణుడు తన శిరముపైన నెమలిపింఛానికి సముచిత,సమున్నత స్థానాన్ని అనుగ్రహించాడు.

నెమలి జాతి శాకాహారము మరియు మాంసాహారము రెండిటినీ ఆహారంగా స్వీకరిస్తుంది. పూవుల రెక్కలు, మొక్క భాగాలు, విత్తనం మొలకలు, కీటకాలు, అప్పుడప్పుడూ బల్లి వంటి సరీసృపాలను మరియూ కప్పలు వంటి ఉభయచరాలను ఆహారంగా భుజిస్తుంది.
'పావో క్రిస్టేటస్  'అనేది మన భారత దేశనెమలి - ఈ నెమలి మనకు భారత ఉప ఖండంలో తరుచుగా కనిపిస్తుంది. ఈ జాతి నెమలినే భారత మరియు శ్రీలంక దేశాలు తమ జాతీయ పక్షిగా ఎన్నుకున్నాయి.

నెమళ్ళు  ఎక్కువగా గడ్డిమైదానాలలో నివశిస్తుంటాయి.మగ నెమళ్ళకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పింఛం ఉంటుంది. మగ నెమలికి వెనుక భాగంలో తోకలాగా కనిపించేది పింఛం , దానికి పొడవాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తుంది. ఆడ నెమలికి ఆకుపచ్చ, గోధుమ మరియు బూడిద రంగులలో ఉండే పింఛం ఉంటుంది. మగ నెమళ్ళ వలె ఆడనెమలికి పొడవైన తోక లాంటి ఈకలు ఉండవు, కానీ వీటికి ఒక కొప్పు ఉంటుంది.

నెమలి పింఛాలలోని ఆ అద్భుత రంగులకు కారణం, వాటి ఈకలమీద పేర్చినట్లు ఉండే సన్నని పీచు లాంటి పదార్దాలే. ఈకలపై  కనిపించే వివిధ రంగులకు వాటి అమరికలోని నిడివి తేడాలే కారణం. గోధుమ రంగు ఈకలకు, ఎరుపు మరియు నీలం రంగులు అవసరం - వీటిలో ఒక రంగు అమరిక వలన సృస్టింపబడగా, రెండవది హద్దులలో ఉండే ఇంకో అమరిక వలన వచ్చే కాంతి పరావర్తనం వలన ఏర్పడుతుంది. ఇటువంటి పరావర్తనం వల్ల నే నెమలి నాట్యమాడుతున్నప్పుడు వాటి పింఛాలు  మనకు వివిధ  కోణాలలో వివిధ  రంగులుగా కనిపిస్తాయి.

ఇతర జాతులతో అంటకట్టించటం వలన వేరు వేరు రంగుల ఈకలున్న నెమళ్ళు  మనకు లభ్యమయ్యాయి. అటువంటి వాటిలో తెల్ల శరీరం కలవి చెప్పుకోతగ్గవి. దాదాపు 2000 సంవత్సరాల కాలం నుండి ఋషులు నివసించే మునివాటికల్లో మొదట నెమళ్ళు నివసిస్తూ క్రమేపీ మనుషుల పోషణలో నెమళ్ళు ఉన్నట్లు భావిస్తున్నారు. అయినా కూడా నెమలిలో పెంపుడు జంతువులలో కనిపించే లక్షణాలు చాలా తక్కువగా గమనించవచ్చు. కాకపోతే వీటి నుండీ ఇతర కొత్త జాతులు సృష్టింపబడ్డాయి.

సాధారణంగా నెమలి జగడాల మారి, ఇతర పశుపక్ష్యాదులతో అంతత్వరగా కలవదు.  నెమలి మన జాతీయ పక్షి. మన సంస్కృతీ సంప్రదాయాలలో ఈ మనోహర పక్షి స్థానం అద్వితీయమైనది; అనుపమేయమైనది. పురాతన యుగాల నుంచి  మనభారత ప్రజలు మయూరాన్ని పూజిస్తున్నారు. 

నాలుగు దశాబ్దాల క్రితం ప్రభుత్వం తొలుత వన్య ప్రాణుల సంరక్షణా చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు నెమలి ఈకల వ్యాపారాన్ని అనుమతించారు. ఆ పక్షులు సహజంగా రాల్చిన ఈకలతోనే ఆ వ్యాపారం జరుగుతుందని విశ్వసించడమే అందుకు కారణం.  అన్ని పక్షులు మాదిరిగానే నెమలి కూడా తన ఈకలను రాల్చుతుంది; అయితే, పక్షులన్నిటి వలే నెమలి సైతం కేవలం సంవత్సరంలో ఒక నెల మాత్రమే తన ఈకలను రాల్చుతుంది. ఆగస్ట్ -సెప్టెంబర్ మాసాలలో ఇది జరుగుతుంది. పగటిపూట నెమలి ఒంటరిగా ఉంటుంది. నెమలి నింగిలోకిఇతర పక్షుల వలె ఎగిరి  వెళ్ళలేదు. నెమలి బృంద జీవి. ఒకే చెట్టు మీద నివశిస్తుంది. సదా ఒకే గూటిలో ఉంటుంది. మానవ ఆవాసాల పరిసర ప్రాంతాల్లో నెమళ్ళు విహరిస్తుంటాయి. కనుక అది అందుబాటులో ఉంటుంది. 

ఒంటరి పక్షి కనుక తన ఈకలను ఏకాంత ప్రదేశాలలో రాల్చుతుంది. నెమలి ఈకలను విక్రయించే దుకాణాలు ఉన్న వారెవ్వరూ కేవలం నెమళ్ళు రాల్చివేసే ఒకే ఒక్క ఈక కోసం ఎవరినీ ఆ ప్రదేశాలను వెదకడానికి పంపించరు. నెమలి చాలా దూరం ఎగుర లేదుకనుక  చాలా ఎత్తు ప్రాంతాలకు కూడా వెళ్ళలేదు, కనుక దానిని పట్టుకోవడం చాలా తేలిక. చెట్టుపై ఎప్పుడూ ఒకే కొమ్మ పై ఉంటుంది. కనుక మా వుసులువుగా పట్టుకోగల పక్షి నెమలి.  

      నెమలిని మాటు వేసి పట్టుకోవడం చాలా తేలిక. పట్టుకున్న నెమళ్ళను చంపివేసి, వాటి ఈకలను పెరికి గోతాలనిండా వేసి ట్రక్కుల్లో వ్యాపార కేంద్రాలకు పంపుతారు. నెమళ్ళు నీరు త్రాగటానికి సరస్సులు, చెరువులు వద్దకు వచ్చినప్పుడో లేదా అవి తమ గూళ్ళకు వెళుతున్నప్పుడో వాటిని జాగ్రత్తగా అనుసరించి వెళ్ళి ,దొంగ వేటగాళ్ళు వాటి కళ్ళు మిరిమిట్లు గొలిపేలా కాంతిని ప్రసరింపచేసి వల వేసి పట్టుకుంటారు. పట్టుకోవడం కష్టమైనపుడు వాటిని ఆహార పదార్థాల వైపు ఆకర్షించి , ఆ తరువాత ఆ పదార్థాలలో విషం కలిపి నెమళ్ళు అవితిని చనిపోతే వేటగాళ్ళు ఆతర్వాత వాటి ఈకలు పీకి తీసుకెళతారు.రాజస్థాన్, గుజరాత్‌లలో దుర్భిక్ష పరిస్థితుల మూలంగా నెమళ్ళు దాదాపుగా అంతరించిపోయాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో రోజూ వేలాది మయూరాలను వ్యాపారంకోసం మానవులు చంపేస్తున్నారు. 

చంపి వేసిన నెమళ్ళ ఈకల గట్టి భాగం (కాడ) లోపల రక్తపుచారికలు ఉంటాయి. సహజంగా త్యజించిన ఈకల కాడలలో ఇటువంటి రక్తపు చారికలు ఉండవు. నెమలి ఈకల వ్యాపారంలో ఉన్నవారు నెమళ్ళను పట్టుకోగానే ఈకలను పెరికివేసి వాటి కాడలను నరికివేస్తారు. మార్కెట్‌లో లభ్యమయ్యే నెమలి ఈకలను నిశితంగా గమనిస్తే  ప్రతిదాని కాడ నరికి వేయబడివుంటుంది. నెమలి ఈక లేదా పింఛం మానవులకు నిరుపయోగమైనది. తినడానికి గాని, ధరించడానికి గాని పనికిరాదు. కొనుక్కుని ఇంటి వద్ద లేదా దైవ మందిరంలో కలశంలో పెట్టుకొని చూసి ఆనందించడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. వ్యాపారస్తులు వాటితో పింఛంతో విసనకర్ర లు తయారుచేసి అమ్ముతారు. నెమలి ఈకల వ్యాపారం దాదాపు 90 శాతం విదేశీ పర్యాటకులతోనే జరుగుతుంది. స్టార్ హోటళ్ళలోని దుకాణాలు, పర్యాటకులను ఆకర్షించే క్యూరియో షాపుల్లో  , నెమలి ఈకలను విక్రయిస్తుంటాయి. నెమలి ఇప్పుడు మనుగడ ముప్పులో ఉన్న పక్షి. మరి మన భారత జాతీయపక్షి ఒక విసనకర్రగా మారిపోవడాన్ని తక్లుచుకుంటే బాధగా అనిపిస్తుందికదూ.

రాజస్థాన్, గుజరాత్‌లలో ఇప్పటికే నెమళ్ళు దాదాపుగా అంతరించిపోయాయి. ఉత్తర గుజరాత్‌లో అయితే నెమలి మచ్చుకు కూడా కనిపించదు. నిషిద్ధ క్రిమి కీటక సంహారి డిడిటిని, క్రిమికీటకాలను సమర్థంగా తట్టుకోగల విత్తనాలను రైతులు విచక్షణారహితంగా ఉపయోగించడం వల్ల నెమళ్ల జనాభా త్వరితగతిన అంతరించిపోతోంది. నెమలి తన గుడ్లను భూమి మీదనే పెడుతుంది. అధునాతన విత్తనాల కారణం గా పంట క్షేత్రాలలో గతంలో వలే పొదలు, తుప్ప లు పెరగక పోవడంతో నెమలి గుడ్లు కుక్కల భారిన పడుతున్నాయి. చిన్నారి నెమళ్ళు వేటకు గురవుతున్నాయి. నెమలి ఈకల వ్యాపారం యథాతథంగా కొనసాగితే రాబోయే పదేళ్ళలో రాబందు వలే నెమ లి కూడా మనకు శాశ్వతంగా కన్పించకపోవచ్చు. 

వంద కన్నుల పింఛంతో మనోహరంగా నర్తనం చేసే నెమలి నక్షత్రాలు, సూర్యచంద్రులు, విశాల విశ్వానికీ ప్రతినిధి. కరుణ, సహానుభూతి, పరిశుద్ధాత్మకు సంకేతం. ఒక సూఫీ తాత్వికుని దృష్టిలో జీవాత్మ నెమలిరూపంలో సృష్టించబడిందిట!. అది తనను తాను దివ్య దర్పణంలో చూచుకున్నప్పుడు తన అందానికి తానే మురిసిపోతుంది. దాని శరీరం నుంచి జాలువారిన చెమట చుక్కలే ఇతర జీవులుగా పరిణమించాయని అంటాడు!. 

గ్రీకు దేవత హెరా, రోమన్ దేవత జూనో, క్రిస్టియన్ సర్వశక్తిమంతుని చిహ్నం, చైనా సంస్కృతిలో వర్ష చిహ్నం, బౌద్ధ ధర్మపు జీవన చక్రం... ఇలా వివిధ మతాలు, సంస్కృతులలోని ఉత్కృష్ట భావనలకు ప్రతీక నెమలే. ఇహ మన సంస్కృతిలో నెమలికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుమారస్వామి వాహనం నెమలి. నెమలి పింఛం ధరించిన శ్రీకృష్ణపరమాత్మ హిందువుల హృదయాల్లో నిలిచిఉంటాడు. అమరత్వానికి చిహ్నం నెమలే. అయినా జాతీయ పక్షిగా మనం గౌరవిస్తున్న నెమలి విసనకర్రగా పరిణమించేందుకు మనందర సహకరించి అంగీకరిస్తూనే ఉన్నాం.
నెమలిని భుజిస్తే స్థూలకాయులు బరువు తగ్గుతారని ప్రపంచ అథ్యయన సంస్థలు ప్రకటన చేసినప్పటి నుంచి వీటిని రక్షించటం ప్రభుత్వాలకు పెద్దసవాల్‌గా మారిందిఆడ నెమలి, మగ నెమలి ఈకలు ఒకేవిధంగా ఉండవు. మగ నెమలి మాత్రం పించం విప్పుతుంది. పెద్ద పెద్ద కళ్లున్న ఈకలు మగ నెమలివే. ఆడ నెమలికి పించం ఉండదు. అయినా నాట్యమయూరి అంటూ స్త్రీలింగ పదాన్ని మగ నెమలికి ఆపాదించడం ఆశ్చర్యం.ఆగౌరవం హిందువులు స్త్రీ ల కిచ్చే  గుర్తింపుగాచెప్పుకోవచ్చు.   

               ***********************************************