Friday 3 May 2013

అఖండ తేజోమూర్తి ఆంజనేయస్వామి

http://www.pushkarinee.com/?q=content/%E0%B0%85%E0%B0%96%E0%B0%82%E0%B0%A1-%E0%B0%A4%E0%B1%87%E0%B0%9C%E0%B1%8B%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%86%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%87%E0%B0%AF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B--పుష్కరిణి -ఆధ్యాత్మిక అంతర్జాలపత్రిక--ఈ లింక్ ద్వారాచూడవచ్చు.
పుష్కరిణి -ఆధ్యాత్మిక అంతర్జాలపత్రికలో  -నవంబర్ 2012లో ప్రచురితం.


అఖండ తేజోమూర్తి ఆంజనేయస్వామి.

ఆదూరి హైమవతి
బెంగళూరు.
యత్ర యత్ర రఘునాధ కీర్తనం -తత్ర తత్రకృతమస్తకాంజలిం......'
http://www.pushkarinee.com/sites/default/files/images/eh%281%29.bmpక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయస్వామి ప్రత్యక్షమవుతారని మన విశ్వాసం. ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రులవారు తప్పక ఉంటారు. శ్రీరాముని పేరు వినగానే  మనకు ఆంజనేయస్వామి తప్పక గుర్తువస్తారు. హిందువులంతా హనుమంతుని ఆంజనేయుడనీ, మారుతి అనీ ఇంకా అనేక నామాలతో కొలిచి కీర్తిస్తుంటారు. రామాయణంలో రాముని కున్నంత ప్రాముఖ్యం హనుమకూ ఉంది. హనుమాన్ అంజనాదేవి, కేసరిల సుతుడు. చైత్ర శుధ్ధపౌర్ణమినాడు, మూలానక్షత్రాన, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలోజన్మించినట్లు ఒక కథ.

వేదముల కథ ఆధారంగా, అంజనాదేవి ఒక అప్సరస అనీ, శాపవశాన భూలోకంలో వానర వంశంలోజన్మించిందనీ, రుద్రదేవుడైన శివుని వరం వల్ల ఆమెకు పుత్రుడు జన్మించాక ఆమె శాప విముక్తురాలవుతుందని చెప్పబడింది. అందువల్ల ఆమె భర్తతో కూడి శంకరుని అతిభక్తితో ధ్యానించి , రుద్రుని వరంతో, ఆయన అంశతో ఆంజనేయుని పుత్రునిగా పొందిందిహనుమకు 28 మహిమలు లభించాయి, ఆకాశగమనం, శరీరాన్ని పెంచడం, కుంచించడం వంటివి.
మఱొక చారిత్రక కధనం ప్రకారం - కర్ణాటకలోని, హంపీవద్ద గల ' గుంలవ్య తోట ' అనే గ్రామానికి18 కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ పర్వతంలోని 'అంజని గుహ 'లో , పంపానదీ తీరం వద్ద ఆంజనేయ స్వామి జన్మించినట్లు ఉంది. వాల్మీకి రామాయణంలోని యుధ్ధకాండలో కేసరి బృహస్పతి కుమారుడనీ, రామరావణ యుధ్ధసమయంలో ఆయన రాముని సేనలో చేఱి యుధ్ధంచేసినట్లు ఉంది. అయోధ్యలో దశరధ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు , యజ్ఞపురుషుడు ప్రసాదించిన పాయసాన్ని, మహారాజు ముగ్గుఱు రాణులకూ పంచగా, సుమిత్రభాగమున్నపాత్రను ఒక గ్రద్ద తన్నుకుని ఆకాశంలో వెళుతూ విడచి వేయడంతో అదివెళ్ళి శివుని భక్తితో ప్రార్ధిస్తున్న అంజనాదేవి దోసిట్లోపడినట్లూ, ఆమె దాన్ని దైవప్రసాదంగా భావించి భక్తితో స్వీకరించగా , ఆమెకు ఆంజనేయులు జన్మించినట్లు రామాయణంలోఉందిఅందుచేతే శ్రీరాముడు హనుమను తన నాల్గవ సోదరునిగా ఆదరించారు.
          
ఆంజనేయులు బాల్యంలో సూర్యుని పండుగా భావించి నోట కఱచుకోగా, దేవేంద్రుని వజ్రాయుధ ఘాతానికి చెంప ఉబ్బడంతో ' హనుమ 'అనే నామం వచ్చినట్లు కూడా చెప్తారు. సూర్యుని హనుమ తన గురువుగా భావించి సేవించి , సూర్యదేవుని నుండి సకల శాస్త్రజ్ఞానం పొంది , గురుదక్షిణగా సూర్య కుమారుడైన , సుగ్రీవుని సేవించను అంగీకరిస్తాడు. ఇది ఆయన సత్య వాగ్ దీక్షకూ, గురుభక్తికీ  తార్కాణం.
మహిరావణుడు యుధ్ధసమయంలో రామలక్ష్మణులను పాతాళంలో దాచినపుడు , oజనేయస్వామి వెళ్ళి, మహిరావణుడు వెలిగించిన ఐదు అఖండ దీపాలను ఆర్పవలసివచ్చి పంచముఖాలతో - అనగా వరాహ ముఖంతో ఉత్తర దిశన, నరసింహ ముఖంతో దక్షిణ దిశన, గరుడముఖంతో పడమర దిశన, హయగ్రీవముఖంతో ఆకాశంవైపు, తన హనుమ ముఖంతో తూర్పు దిశన ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పేందుకు ' పంచముఖ ఆంజనేయులుగా రూపుదాల్చారు. ఇది ఆయన స్వామి కార్య దీక్షకు నిదర్శనం .
యుధ్ధానంతరం హనుమ హిమాలయ పర్వతం మీద నివసిస్తూ 'హనుమద్రామాయణాన్ని’   తన గోళ్ళతో వ్రాసినప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి, రామాయణాన్నిచదివి, అసంతృప్తిని వ్యక్తపఱచగా , హనుమ కారణం అడుగుతాడట!, అప్పుడు వాల్మీకి మహర్షి ' రామాయణంలో హనుమ పాత్రను చిత్రించనందున అది అసంపూర్తిగా ఉన్నది కనుక తనకు అసంతృప్తికలిగించినదని ' చెప్పారు. అప్పుడు హనుమ తన రామాయణాన్ని ఉపసంహరించుకున్నారు ! ఎంత నిరాడంబరత !! అందుకే హనుమను ధ్యానిస్తే మంచి గుణాలు కలుగుతాయని, గర్వాహంకారాలు పోతాయనీ అంటారు. అందుకే అందఱూ హనుమను పూజిస్తారు రామునితో సమానంగా ! అందుచేత భారతదేశంలోనే గాక ప్రపంచ దేశాలలో కూడా హనుమాన్ ఆలయాలు విలసిల్లి ఉన్నాయి  .
    
హిమాచల్ ప్రదేశ్ రాజధాని ఐన ' శిమ్లా ' లోని 'జాఖూ ' హనుమాన్ ఆలయం ప్రసిధ్ధి చెందినది. కొండపై యక్ష, కిన్నర గంధర్వ కింపురుషులు    నివసించేవారనీ  , హనుమ ఆకాశం పైకి ఎగరను కాలూనగా కొండసగానికి భూమిలోకి దిగిపోయిందని  , హనుమ కాలూనిన చోట ఆలయం వెలిసిందనీ చెప్తారు.
క్రీ.. 883 నాడు ఖుజరహో లో ఆజనేయ ఆలయం ఉన్నట్లు శిలాశాసనాల వలన తెలుస్తోంది. ’సంకటమోచన హనుమాన్ మందిరంపంజాబ్ లోనిఫిల్లూర్లో ఉంది. తమిళనాడులోనినమ్మక్కళ్ ' లో ఉన్నఆంజనేయ విగ్రహంఎత్తు 18 అడుగులు. తూర్పుముఖంగా ఉన్న ఆంజనేయ విగ్రహం ఎదురుగా ఉన్నలక్ష్మీ నారాయణ స్వామికి నమస్కరిస్తున్న భంగిమలో ఉంటుందిఈవిగ్రహం స్వయంభువు ఐనందున పెఱుగుతూనే ఉన్నారనీ, అందువల్ల పైన కప్పువేయను వీలుకాలేదని ఆలయ కధనం వలన తెలిస్తోంది.
వెల్లూరు జిల్లాలోని ఆర్కోణానికి 30 కిలోమీటర్ల దూరంలోయోగ నరసింహ ఆలయానికి సమీపంలో యోగాజనేయ ఆలయం చిన్నకొండ మీద ఉంది .ఆలయాన్ని చేఱను 480 మెట్లు ఎక్కవలసి ఉంటుందిఆంజనేయమూర్తి చతుర్భుజాలతో ,రెండు చేతులతో శంఖ చక్రాలు, మఱో రెండు హస్తాలతో జపమాల ధరించియోగ నరసింహస్వామిని వీక్షిస్తున్నట్లు ఉంటుంది . ’యోగ నరసింహస్వామి ‘, యోగామృత వల్లి ఉండే ఆలయం లోనికి పెరియవై కొండ మీదకు1305 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. భక్తులు ఎంత శ్రధ్ధగా శ్రమపడి ప్రార్ధిస్తారో దేవుని అనుగ్రహం అంత అధికంగా లభిస్తుందనేది భక్తులనమ్మకం.
కర్ణాటక రాష్ట్రం రాజధాని బెంగుళూర్ లోని జె.పి.నగర్లో వెలసి ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం ఒక గుట్టపై ఉంది. దీనిని మహామహిమాన్వితమైన ఆలయంగా భక్తులు సేవిస్తారు. మహారాష్ట్ర రాజధాని ముంబాయ్ లోని  ఎస్.. .ఎస్  కాంప్లెక్స్ లోని హనుమాన్ విగ్రహం ఎత్తు 33అడుగులు [ 10.మీటర్లు] 12..ఎత్తైన ప్లాట్ ఫాం మీద ప్రతిష్టించబడి ఉంది. మొత్తం విగ్రహం ఎత్తు భూమినుండి 456..[14.మీ] . వెండి కవచంతో మారుతీ విగ్రహం కప్పబడి ఉంది.
         

1989
లో చెన్నయ్ లోని నంగనల్లూర్ లో ఒకే ఱాతితో చెక్కబడిన 32..[10.మీ] ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం చెప్పుకోదగినది. ఒరిస్సాలోని రూర్కెలా లో హనుమాన్ వాటిక ఆలయ కాంప్లెక్స్ లో 72 .. హనుమాన్ విగ్రహం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొన్నూరులో 30.. అంజనేయస్వామి విగ్రహం భక్తులకు కొంగు బంగారంగా వెలసి ఉంది. అవధూతదత్త పీఠాధిపతిగణపతి సచ్చిదానందస్వామివారిచే 85.. [26.మీ] ఎత్తైన ఆంజనేయస్వామివారి విగ్రహం ప్రతిష్ఠ చేయబడి ఉంది.
135..ఎత్తైనఆంజనేయవిగ్రహం హైదరాబాద్ వద్ద గల పరిటాలలో 2003 లో ప్రతిష్టింపబడింది. సాగరపురంలో ప్రతిష్టింపబడిన ఆంజనేయ విగ్రహం దుష్టగ్రహాలను దూరం చేసేదిగా ప్రసిధ్ధి పొందినది. ప్రతిష్ఠాసమయంలో సజీవంగా కదిలిందని చెప్తారు.
తమిళనాడులోని కన్యాకుమారికి సమిపంలో 8 . ఎత్తైన మారుతీ విగ్రహం ఉంది. కేరళ తిరువళ్ళుర్ కు 5, 6 కి.మీ.దూరంలోఉన్న' చిన్నకవియూర్ 'లోని శివాలయంలో వంద సంవత్సరాల క్రితం పంచ లోహాలతో నిర్మించబడిన హనుమాన్ విగ్రహం ఉంది. కుంభకోణంలో 40..ఎత్తైన [12.మీ] పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం గ్రానైట్ ఱాతితో మలచబడి ఉంది. తిరువళ్ళూర్లో పంచముఖ ఆంజనేయ విగ్రహం భక్తుల భయాలు దూరంచేసే అభయమూర్తిగా నిలచిఉంది .
హనుమాన్ ఒక్కడే శని ప్రభావం సోకని వానిగా చెప్తారు. రావణుని నుండి విముక్తి పొందిన శనిదేవుడు, హనుమాన్ పట్ల కృతజ్ఞతగా మారుతిని పూజించే వానికి తన దృష్టి  ' సోకదని వాగ్దానం చేశాడట!
కేరళ రాష్ట్రంలోని తిరువళ్ళూర్ వద్దగల  , మల్లాపురం జిల్లాలోవశిష్ఠులవారిచే 3 వేల సం.క్రితం. [1,000.బి.సి} ప్రతిష్టింపబడిన హనుమాన్ మూర్తి అతిప్రాచీనమైనదిగా గుర్తింపబడి ఉంది. అలధియూర్ లోని హనుమాన్ ఆలయంలోఒక పెద్ద వేదికపైనున్నఒక గ్రానైట్ ఱాతిపై సముద్రచిత్రం చిత్రించి ఉండగా భక్తులు దూరం నుండీ పరుగుతీస్తూ వచ్చి హనుమాన్ సముద్రాన్ని లంఘించినదానికి చిహ్నంగా  ఱాతిపైనుండి దూకుతారు  . దీని వల్ల భక్తుల బాధలు, కష్టాలు తీఱిపోయి, ఆరోగ్యం, భాగ్యం, దీర్ఘాయువు కల్గి, అదృష్టం కలసి వస్తుందని విశ్వాసం. అలధియూ హనుమాన్ఆలయదర్శనం భక్తుల మానసిక శారీరక రుగ్మతలు బాపడమేగాక వారి సర్వకోరికలూ ఈడేరుతాయనే సంపూర్ణ నమ్మకం ఉంది. అందువల్లే భక్తులు తప్పక జీవితంలో ఒక్క సారైనా అలధియూర్హనుమను దర్శించి తరిస్తారు.

అహమ్మదాబాద్ లోని కంటోన్ మెంటు ప్రాంతంలోషహీబాగ్ సమీపంలోని ' క్యాంప్  ' హనుమాన్ ఆలయం పండిట్ గజాననప్రసాద్ నూఱు సంవత్సరముల క్రితం కట్టించారుభారత ప్రధానులైన, అటల్ బిహారీ వాజ్ పేయ్, ఇందిరాగాంధీ వంటి ప్రముఖులు ఆలయాన్ని దర్శించినట్లు చెప్తారు.
రామ చరిత మానస్, హనుమాన్ చాలీసా వ్రాసిన తులసీదాస్ [1532-1623] ఢిల్లీలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించిన దాఖలాలు ఉన్నాయి. ఆలయంలో 24 గంటలూ 'శ్రీరామ జయ రామ జయజయ రామ' అనే మంత్రాన్ని1964 ఆగస్టు ఒకటవ తేదీ నుండి నిరాటంకంగా జఱుగుతూండటం విశేషం.
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడైన 'బరాక్ ఒబామా' అధ్యక్షునిగా పోటీ చేస్తున్న సమయంలో , ఆలయమూర్తి ఐన హనుమ విగ్రహాన్ని , ఆయన శ్రేయోభి లాషులు ఆయన విజయాన్ని కాంక్షించి ఆయనకు బహుమతిగా ఇచ్చినట్లు మనం వార్తాపత్రికల్లో చదివాం.15 కె.జిల బరువైన , బంగారు పూతతో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని పవిత్రంగా పూజించి ఆయనకు అందజేశారు. ఆయన దాన్ని భక్తితో స్వీకరించడం, విజయం సిధ్ధించడం జఱిగింది.
          
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని' గొడుగుపేట ' లోని ప్రసన్నాంజనేయ ఆలయం  ప్రసిధ్ధి చెందిన మఱో మారుతీ ఆలయం. ఆగమశాస్త్ర ప్రకారం దక్షిణ ముఖంగా ఉన్న ఆంజనేయస్వామి వారిని దర్శించిన వారి కోర్కెలు తీఱుతాయని నమ్మిక. ఆలయ సంప్రోక్షణ సమయంలో 19 శతాభ్ధిలో కుర్తాళం మఠాధిపతి పూజ చేస్తున్న సమయంలో వర్షం అతిగా కుఱిసి , అలయం చుట్టూతా ఉన్న వీధులు వఱద తాకిడికి గురైనా, ఆలయం లోపల మాత్రం ఒక్కనీటి చుక్కైనా పడలేదట!  
మఱొక యోగాంజనేయ ఆలయం చెన్నయ్ లోనిక్రోంపేట ' వద్ద ఉంది.1930 లో ప్రాంతంలో నివసించే 13 సంవత్సరాల బాలికకు కలలో ఆంజనేయస్వామి కనిపించి ప్రాంతంలో తనకు ఆలయం నిర్మించమని ఆదేశించారట. ఆమె తన తల్లి దండ్రులకు చెప్పింది. తరువాత కంచి మఠపీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతీ స్వామీజీవారు ప్రాంతానికి వచ్చినపుడు బాలిక స్వామిజీతో తన స్వప్నం విషయం చెప్పింది. స్వామీజీ తన భక్తులతో,ఆలయ ప్రాంతంలో వెదికించగా, ప్రస్తుతం ఆలయం నిర్మించబడి ఉన్న ప్రాంతంలో ఆంజనేయ విగ్రహం లభించినట్లు, తర్వాత ' తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర ఆధారంగా తెలుస్తోంది .

భక్తులెవఱైనా కష్టాలూ , మానసిక రుగ్మతలూ కలిగినా , పసిపిల్లలకు దడుపు , అనారోగ్యం వంటివి కలిగినా, కార్యసిధ్ధికి ముందుగా పూజించేది హనుమనే. హనుమాన్ చాలీసా పారాయణం, రామరక్షా కవచం, సుందరాకాండ పారాయణ ఇవన్నీ హనుమద్ భక్తుల పాలిటి కల్పవృక్షమనీ, ఆయన కోరిన వెంటనే అండగా నిల్చే వేలుపనీ భావిస్తాం. ఇలాంటి హనుమదాలయాల దర్శనం మనకందఱికీ సుఖశాంతుల నిచ్చు గాక! !
                    జయ జయ హనుమా! జయ జయ హనుమా.
                         
వానర దూతా వాయుకుమారా !
                           
అతి బలవంతా ! అంజని పుత్రా!
                  
జయ జయ హనుమా !   జయ జయ హనుమా ! !.