Tuesday 30 October 2012

నిజాయితీ... నిర్భీతి.. ఉక్కుసంకల్పం!



  • నిజాయితీ... నిర్భీతి.. ఉక్కుసంకల్పం!

    నేడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి
  • పిరికి కండలనెరుగని బిరుదు మగడు
  • కార్యశూరుడు తెగుదారి ధైర్యధనుడు
  • ఇనుపమానిసి తప్పున్న నేరినైన
  • ఢీకొనగ జాలువాడు పటేలతండు!


సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అనే పేరులోనే తేజం, గాంభీర్యం కన్పిస్తుంటాయి. స్వాతంత్య్ర సమరయోధులలో ప్రసిద్ధుడైన 'పటేల్‌' తనదైన శైలిలో పోరాడి భారతదేశపు 'ఉక్కుమనిషి'గా పేరుగాంచాడు. 1875 అక్టోబర్‌ 31న గుజరాత్‌లోని నాడియర్లో, జవేరీ భాయి, లాడ్‌లా పటేల్‌లకు నాల్గవ సంతానంగా జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోనే జరిగింది, ఉన్నత న్యాయశాస్త్ర విద్యకై ఇంగ్లాండు వెళ్ళి బారిష్టర్‌ పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి అహ్మదాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. అప్పటికే వివాహమైనందున తన భార్య ఝవెర్బాను పుట్టింటి నుండి తీసుకొచ్చి గోద్రాలో కాపురం పెట్టాడు.1904లో ఆయనకు కుమార్తె మణిబెన్‌, 1906లో కుమారుడు దహ్యాభాయ్‌ జన్మించారు. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఉక్కు మనిషి అని నిరూపించే సంఘటనలు ఆయన జీవితంలో ఎన్నో. 1909లో ఆయన ఓ న్యాయసభలో వాదిస్తుండగా ఆయనకు ఒక టెలిగ్రాం వచ్చింది. ఆయన దాన్ని తీసుకుని చదివి జేబులో పెట్టుకొని తిరిగి తన వాదన ప్రారంభించి, కేసు గెలిచారూ. 'ఆ టెలిగ్రాం ఏమిటని' అడిగినవారితో అప్పుడు, కాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న తన భార్య మరణించిందని చెప్పారు. అంతా ఆశ్చర్యపోయారు. అంతటి మనోనిశ్చలత మానసిక స్థితి గలవాడు గనుకే ఆయన్ను 'పిరికికండల నెరుగని బిరుదు మగడు' అన్నారు. భార్య మరణానంతరం తిరిగి వివాహం చేసుకోక తన కుటుంబసభ్యుల సహకారంతో పిల్లలను పెంచి పెద్దవాళ్ళను చేశారు... దేశంలో జరుగుతున్న జాతీయోద్యమ ప్రభావానికి ప్రభావితుడై, తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1928 లో బార్దోలీలో బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా 'కిసాన్‌' ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతనికి సర్దార్‌ అనే పేరు వచ్చింది. గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 300,000 మంది సభ్యులతో కలిసి, 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. విదేశీ వస్తుదహనంలో భాగంగా తనవద్ద నున్న తెల్లదొరలు వేసుకొనే బట్టలను అగ్నిలో వేసి కాల్చేశాడు. తన కుమార్తె మణి, కొడుకు దాహ్యాతో కలిసి జీవితాంతం ఖాదీ బట్టలు ధరించాలని నిర్ణయించుకున్నా డు. గుజరాత్‌లో మద్యపానం, అస్పృశ్యత, కులవిచక్షణలకు వ్యతిరేకంగా పనిచేశారు. 1931 కరాచి భారత జాతీయ కాంగ్రెస్‌ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఉప్పు సత్యాగ్రహం, 1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమాలలో కూడ ప్రముఖ పాత్ర వహించాడు. మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్య్రోద్యమంలో పాలుపంచుకున్నాడు. దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగ రచనలో ప్రముఖ పాత్రవహించి, అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్య్రానంతరం జవహర్‌లాల్‌ నెహ్రూ మంత్రిమండలిలో హోం మంత్రిగాను, ఉప ప్రధానమంత్రిగాను బాధ్యతలను నిర్వహించాడు. జాతీయోద్యమ సమయంలోనే వల్లభాయ్‌ పటేల్‌ నెహ్రూతో విభేదించారు. ముఖ్యంగా 1936 భారతీయ జాతీయ కాంగ్రెస్‌ సదస్సులో నెహ్రూ ప్రవచించిన సోషలిజంను వల్లభాయ్‌ పటేల్‌లు వ్యతిరేకించారు. స్వాతంత్య్రానంతరం కూడా స్వదేశీ సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కాముకతను కాదని బలవంతంగా బలప్రయోగం, సైనిక చర్యలు చేపట్టి విజయం సాధించాడు.భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చాక స్వల్ప వ్యవధిలోనే ఎలాంటి హింస రక్తపాతం లేకుండా 534 రాచరిక సంస్థానాలు స్వతంత్య్ర భారతంలో కలసిపోయి భారత ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. కానీ నిజాం పాలనలోని హైదరాబాద్‌ ప్రాంతం మాత్రం భారత ప్రభుత్వంలో కలవక స్వయంపాలన చేస్తూ, 7వ నిజాం 'మీర్‌ ఉస్మాన్‌ ఆలీ ఖాన్‌' ఆదేశాలతో ఖాసిం రజ్వీ సైన్యాలు తెలంగాణా ప్రాంతంలో భయంకరమైన అరాచకం సృష్టించాయి. ప్రజలను అనేక ఇక్కట్లపాలు చేశాయి. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో దళాలు, సంఘాలు ఇంకా స్వాతంత్య్ర సమరయోధులు కొందరు, నిజాం రజాకార్ల సైన్యాన్ని ఎదిరిస్తూ ప్రజలకు సంపూర్ణ సహకారం అందించాయి. ఆ సమయంలో భారత ప్రభుత్వం, సర్దాల్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆదేశాలతో సైన్యం ''ఆపరేషన్స్‌'' పేరుతో 1948 సెప్టెంబర్‌ 13న హైదరాబాద్‌లోని నిజాం రాజ్యంలో ప్రవేశించాయి. ఆ సంస్థానాన్ని నలువైపుల నుంచి చుట్టుముట్టి దిగ్బంధం చేశాయి. వారి నెదిరించలేక 1948 సెప్టెంబర్‌ 17న నిజాం ప్రభువు 'మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌' భారత ప్రభుత్వానికి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఎదుట లొంగిపోయాడు. నిజాం సంస్థానం స్వతంత్ర భారతంలో విలీనమైంది. ఈ విలీనంతో సంపూర్ణ భారతదేశం ఏర్పడింది. అదీ పటేల్‌ కార్యదక్షత. దేశ విభజననుద్దేశించి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇలా అన్నారు. ''తీవ్రమైన రోగం శరీరాన్ని కబళిస్తున్నపుడు ఆ కుళ్ళిపోయిన అవయవాన్ని ఖండించి, మిగిలిన శరీరాన్ని కాపాడుకోవటం మన కర్తవ్యం. ఇప్పుడు దేశ విభజనకు ఒప్పుకోకపోతే ఇప్పట్లో స్వాతంత్య్రం వచ్చే అవకాశమే లేదు. మొత్తాన్ని కోల్పోయే ప్రమాదముంది. దానికంటే కొంత వదులుకోవడానికి నేను ఇష్టపడతాను.' సమయానికి తగిన సరైన నిర్ణయం తీసుకోవడంలో ఘనుడు పటేల్‌. కాశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్య సమితికి నివేదించడంలో నెహ్రూతో విబేధించారు. పాకిస్తాన్‌కు చెల్లించవలసిన రూ.55 కోట్లు ఇవ్వరాదని కూడా వల్లభాయ్‌ పటేల్‌ నెహ్రూతో వాదించారు. తొలి రాష్ట్రపతి ఎన్నికలలో కూడా చక్రవర్తి రాజగోపాలచారి వైపు నెహ్రూ మొగ్గు చూపగా, వల్లభాయ్‌ పటేల్‌ రాజేంద్రప్రసాద్‌ను ప్రతిపాదించి సఫలీకృతుడైనాడు. అలాగే 1950 కాంగ్రెస్‌ సమావేశంలో నెహ్రూ అభ్యర్థి కృపలానీని కాదని పురుషోత్తమదాస్టాండన్‌ను గెలిపించారు. కేవలం 40 నెలలు మాత్రమే పదవిలో ఉన్నా అనేక దేశసమస్యలను తనదైన ప్రత్యేక పద్ధతిలో పరిష్కరించారు. 1950 డిసెంబర్‌ 15న పరమపదించారు. ఆయన మరణించిన 4 దశాబ్ధాల అనంతరం 1991లోభారత ప్రభుత్వం 'భారతరత్న బిరుదా న్ని' ఇచ్చి గౌరవించింది. స్వార్థ రహితంగా, భారతదేశం తనది గా భావించి సేవించిన మహిమాన్వితుడు, ఆదర్శసేవకుడు, ధీరగంభీర నాయకుడు అయిన 'సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ను' ఆ యన జన్మదినమైన అక్టోబర్‌ 31న స్మరించి నివాళులర్పించడం మన కనీస కర్తవ్యం...
ఆదూరి హైమవతి


apr -   Wed, 31 Oct 2012, ఆంధ్ర ప్రభ దినపత్రికలో ప్రచురితం  

Monday 29 October 2012

అక్టోబర్ 28 [ ఈ ఏడాది ] అత్తగార్ల పండుగ!


                      అక్టోబర్ 28 [ ఈ ఏడాది ] అత్తగార్ల పండుగ!     
ప్రతిసంవత్సరమూఅక్టోబర్నెలనాలుగోఆదివారముMother.inLaw’s.Day[మదరిల్లాస్డే. ]జరుపుకుంటారు .ఈ పండుగ జరుపుకోనుఖచ్చితమైన కారణంప్రత్యేకంగాతెలీదు,ఐతే అత్తగారికి కృతఙ్ఞత తెలుపు తూ కోడళ్ళు , బహుశా మంచి భర్తను కనిచ్చినందుకు కావచ్చు,తమనుకోడంట్రికంపెట్టకుండాసజావు గాకాపురంచేసుకొనిస్తున్నందుకుకావచ్చు,లేదాఇంటిపనుల్లో,వంటపనుల్లోచేదోడువాదోడుగాఉంటూ ,తమబిడ్డల్నితాముఉద్యోగాలకైవెళ్ళినపుడునానీలాచూస్తున్నందుకుకావచ్చు,పెద్దదిక్కుగాఇంటిపట్టున ఉంటూ ,అనారోగ్యాలు వస్తే గృహవైద్యంచేసేఇంటిడాక్టరైనందుకుకావచ్చు,కారణంఏదైతేనేంకోడళ్ళుతమ అత్తగారిసాయానికి కృతజ్ఞతలు చెప్తూ ఆమెకుబహుమతులుఅందజేస్తూప్రేమ,ఆప్యాయతల్నిపంచేరోజు ఇది.ఈరోజునగ్రీటింగ్ కార్డ్స్ కంపెనీలుమంచివ్యాపారజోరుతోపండుగచేసుకుంటాయి,బహుశాఈతయారీ కంపెనీలేఈపండుగనుప్రారంభించిఉండవచ్చనేఊహాగానాలుకూడాలేకపోలేదనుకోండి,అదివేరేవిషయం.         చిన్నతనంలో వివాహమైఅత్తింటకాపురానికివచ్చేవరకూకమ్మనిప్రేమనందించినఅమ్మనుతిరిగిసంపుర్ణ హృదయంతోఅత్తలోచూసుకోడంకోడళ్ళుప్రారంభించాలి, తమకూతుళ్ళలాఅత్తలుకోడళ్ళను ఆదరించాలి, అప్పుడేఈపండుగఅర్ధంపరమార్ధంనెరవేరినట్లు.’అత్తకోడల్నికూతుర్లాచూస్తే,కోడలుఅత్త నుఅమ్మలా చూస్తుందనిపెద్దలమాట,ఇంటశుఖసంతోషాలువిరాజిల్లాలంటేఅత్తా కోడళ్ళమధ్యప్రేమాభిమానాలు, నమ్మకం,అవగాహనా,పరస్పరఅనురాగమూముఖ్యం.లేదంటేకొంపకొల్లేరైమగవారుఇడుములపాలై , నరకానికి మరోస్థాన మవుతుంది ఇల్లు.
అత్తాకోడళ్ళైన లక్ష్మీ సరస్వతులకే పడదనీ , అందుకే లక్ష్మి ఉన్నచోట సరస్వతి ఉండదనీ అంటారు.
 జీవితమంతా తోడూ-నీడగా కలసి మేలసి ఉంటామని కష్ట సుఖాల్లో అండదండగా ఉంటామని వివాహ సమయంలో [-- 'ధర్మేచ ..అర్ధేచ ..కామేచ ..నా అతిచరామి .' అని  --] చేసుకున్నబాసలు భార్యాభర్తలకు జీవితంలో నిజమవాలంటే ,అత్తకోడళ్ళ మధ్య సహాయ సహకారాలు సరిగా ఉండాలి. అత్తా  కోడళ్ళ గురించిన ' అత్త ఆర్భాటం..కోడలి ఆరాటం , అత్తను దిద్దినకోడలు, కోడల్ని దిద్దిన అత్త, అనే అనేక సినిమాలూ, నేడు తెలుగు టి.వి. లనిండా అత్తాకోడళ్ళపై అనేక సీరియల్స్ రోజంతా , అత్తను ఎలా బాధించాలనేకోడలు, కోడల్నెలా మట్టుపెట్టలనే అత్త, దుష్ట చింతనలు మనస్సుల్లోనిండివికృతరూపుదాల్చేఈసీరియల్సుచూడటం జరిగితే ఇక ఇల్లు యమపురే ! మరేకథలూదొరక్క పాపంతెలుగు సీరియల్సన్నీబుల్లితెరను, బుల్లి హింసాలయంగామార్చుతున్నై.  దాదాపుఅన్నికథల్లోనూ అత్తాకోడళ్ళనడుమ స్పర్ధలు ,వాటిని ఎక్కువచేయనునెగట్లోమంటఎగదోసేస్నేహితురాళ్ళూ,ఆడపడుచులూ,ఇరుగుపొరుగూనూ.మనకు సాధారణంగా కనిపించే బుల్లితెరభాగోతంఇదేగా!. కొత్తగాపెళ్ళైన కోడళ్ళంతా అవిచూసి " అమ్మో అత్తగారా!" అనుకుని భయపడ్డం, అత్తలు  " అమ్మో కోడలుపిల్లా!" అనుకుని ముందుగానే తామెలాఉండాలోజాగ్రత్తపడటంచేస్తుంటారు.వీటన్నింటికీకారణముసరైనఅవగాహనాలోపమే!సంపూర్ణహృదయంతో,వచ్చినకోడలు నచ్చిందని సంతోషంగా ఆఅమ్మాయిని మనకుంటుంబంలో కలిపేసుకుని,కోడల్నిఇంటికిఆహ్వానించిమమేకంకావాలి.,అలాగేకోడలూఅత్తగార్నితల్లిలా ఆదరించ గలగాలి.పరస్పరప్రేమేవారిద్దరిఅనుబంధాన్నినాగర్జునా సిమెంట్లా [నిజం నాగార్జునా సిమెంట్కూలు స్తుందోనిలబెడుతుందోతెలీదుగానీ]కలుపుతుంది.తనకుమంచిసంస్కారంగలభర్తనుఅందించినఅత్తపట్లకోడలూ,తన్నుకూతుర్లాచూసుకుంటూతనకొడుక్కుఒకమంచితోడుదొరికినందుకుఅత్త,తమబాధ్యతలుగుర్తుంచుకుంటూ,పరస్పరంకృతఙ్ఞతగామెలగాలనిగుర్తుచేయనేమోఈపండుగజరుపుకోడం
కొడుక్కి పెళ్ళిచేసేంతవరకుఆరాటపడినఅమ్మఅత్తగారిహోదారాగానే అనవసరపు రుసరుసలు! ఎక్కడ తనస్థానం తగ్గిపోతోందోనే భయం!తమపెత్తనానికి పతనమ్మొదలవుతుందనే అనుమానం! .పుట్టింట ఎలాంటి అరమరిలకూలేనిఅమ్మాయిమెట్టినింటఅడుగిడగానే కోడలు పోర్షన్ కొచ్చేసరికి ఏదో తెలియని అసంతృప్తితో ఆరాటపడటమ్మొదలవుతుంది.!అందుకుకారణము'ప్రేమ'మార్పిడీజరగటమే!.పెళ్ళైందాకా  ప్రతి చిన్నపనికీఅమ్మనుపిలుస్తూతనపైఅనుక్షణంఆధారపడే కొడుకుపెళ్ళయ్యాకఅన్నింటికీ 'హాయ్ స్వీటీ!' అనో మరో ముద్దుపేరుతోనో ,భార్యను పిలుస్తూ ,కోడలినిఅనుక్షణంతనఅవసరాలకు పిలుస్తుం డటం బహుశాఆత్తకు మానశిక అసంతృప్తి కలిగించడం ప్రారంభమవుతుంది....కొడుక్కు తనపై ప్రేమ దూరమవుతుందేమో!నే అనుమానం, తన పాధాన్యత క్రమేపీ తరిగి పోతుందేమోనే  భయంతోకూడిన ప్రేమేదీనికికారణం.. ఫలితం కొత్తగావచ్చినకోడలిపనుల్లో పొరపాట్లు చూడటం ,చీటికీమాటికి తప్పులు ఎంచుతూ తగవులు ప్రారంభం అవుతాయి .
చాలా ఇళ్ళలో భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్ధలకు అత్తగారినే బాధ్యురాల్ని చేస్తుంటారు .చివరకు కథల్లో కార్టూన్లలో అత్తాకోడళ్ళనడుమ వైరాలే కధావస్తువులు! ఇటువంటిస్పర్ధలుప్రారంభమై కుటుంబ సభ్యుల మధ్య  కోపతాపాలు,అకారణవైరాల,ఫలితంగా ఒత్తిడికి లోనవడం ! చాలామందికొత్తకోడళ్ళు  అత్తగారితోకలిసివుండేందుకుసైతంమొగ్గుచూపడంలేదు.భార్యాభర్తలమధ్య ఈవివాదం విడాకులవరకు దారితీస్తూంది.చిన్నచిన్నవిషయాలనుఅత్తాకోడళ్ళుభూతద్దంలోచూడక,కుటుంబవ్యవస్థచిన్నాభిన్నం కానివ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏవైనావిభేదాలుతలలెత్తితేవీలయినంతవరకు సంయమనాన్ని పాటించాలి.చిన్నచిన్నవిషయాల్నిపెద్దవి చేసుకుని, విచ్చిన్నధోరణిలోపడకపోడం మంచిది . 
కొన్నిమార్లు భరించలేనంత సాధింపులను ఇళ్ళలో ఎదురైనపుడు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని వెతకాలి . ఒకే ఇంట్లో ఒకరి నొకరు ప్రతిక్షణము శత్రువుల్లా చూసుకుంటూ బ్రతికే బదులు , విడివిడిగాఉంటూ అప్పుడప్పుడూ పండుగ పబ్బాల్లోకలిసి సంతోషంగా నవ్వుకుంటూ గడపడమ్మేలు. పంతాలుపట్టింపులూ వదలిసర్దుకుపోవడంరెండోమార్గం.పెళ్ళయ్యాక అప్పటిదాకా తన కొంగుపట్టుకుని తిరిగినకొడుక్కి తనపై ఆధారపడాల్సినపనిలేదని ..జీవితాంతముతోడుకోసం పెళ్ళాడిన జీవిత భాగస్వామితో అతనుకలసి ఉం డాలనీ ఆ కన్నతల్లి గుర్తించాలి .తానూఒకరోజునఅలానే ఆఇంట కోడలిగా అడుగుపెట్టినవిషయం గుర్తుకుతెచ్చుకోవాలి.'అత్తాఒకింటికోడలే !' కోడలూ మరోనాటికి అత్తే!   ఇంటికికోడలుగా వచ్చినంతమాత్రాన అంతవరకూ తల్లిని అన్నీ అడుగుతూ ఇంతకాలం పెరిగి పెద్దైన తనభర్త, తల్లినివదిలేసిపూర్తిగాతనకే ప్రాధాన్యమివ్వాలని,అక్కాచెల్లెళ్ళనూ అన్నదమ్ములనూ వదిలేసి తనకే స్వంతంకావాలనీదేనికోసమూఅత్తగారిపై అస్సలుఆధారపడకూడదనీఆఇంటికోడలు ఆలోచించ కూడదు .తామంతాఒక్కటేఅన్నభావనమనస్సులోఏర్పర్చుకోవాలి.అప్పుడుఏసమస్యాఉత్పన్నంకాదు. .వీటినన్నింటినీ మననం చేసుకుంటు అత్తగారిలోని అమ్మతనాన్ని గౌరవిస్తూ అమ్మకోసం ఓ పండుగ జరుపుకున్నట్లే అత్తగారి కోసమూ ఓ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశమే ... ఈ మదర్-ఇన్‌-లా డే. .
ఈ పండుగలన్ని అమెరికా వంటి దేశాల్లో సంవత్సరంపొడవునా దూర దూరంగా ఉంటూ ఇలాంటి సందర్భాలలో ఒకచోట కలసి తమ ప్రేమను అత్తగారికి చూపి పూల బొకేలు ఇచ్చి, ఆదరించి , కేకులు కట్చేసుకుతింటూ, ఒకరోజుకలసిమెలసిఉండేందుకే!ఎల్లప్పుడూఇళ్ళలోనేఉండేభారతీయకుటుంబాల్లో సైతం ఈ పండుగ జరుపుకుంటే తప్పేం లేదు , ప్రత్యేక గుర్తింపు కోరుకోడం మాననైజంకదామరి!
జై అత్తలకూ జైజైకోడళ్ళాకూ! 

Saturday 20 October 2012

సరదాల దసరా ‘బొమ్మల కొలువు’ ప్రాముఖ్యం


 సరదాల దసరాబొమ్మల కొలువుప్రాముఖ్యం

                         నమస్తే సిద్ద సేవ్యానీ ఆర్యే మందార వాసినీ
                        
కుమారీ కాళీ కపాలీ కపిలే కృష్ణపింగళే
                        
భద్రకాళీ నమస్తుభ్యం కోటదుర్గా నమోస్తుతే
                        
దండీ చండీ నమస్తుభ్యం తారణీ వరవర్ణినీ…. అంటూ భక్తిశ్రధ్ధలతో దుర్గాదేవిని స్తుతిస్తూ,పూజిస్తూనవరాత్రిఉత్సవాలుమొదలవుతాయి.ఈపండుగకుమరోపేరుదసర.ఇదిఒకప్రధానమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులుదేవీనవరాత్రులు,పదవరోజువిజయదశమికలసిదసపది,అంటేరాత్రులుఅనిఅర్ధం.,శరదృతువు ఆరంభంలోవచ్చేపండుగ కనుకశరన్నవరాత్రులనీఅంటారు.ఈ పండుగ మొదటి మూడు రోజులు పార్వతిదేవిని తరవాతిమూడురోజులలక్ష్మీదేవినిచివరిమూడురోజులుసరస్వతిదేవినిపూజిస్తారు. దశరా అనగానే పిల్లలకూ పెద్దలకూ అమిత సరదా! ఇదిసరదాలదశరా !కొత్తఅల్లుళ్ళుకూతుళ్ళూవారిపిల్లలతో వారిపిల్లలతోఈపండుగహడావిడిఇంతాఅంతాకాదు.ఇదిపెద్దపండుగ!అంటేఎక్కువ రోజులు జరుపుకునే పండుగ . ……అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
                      ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చిన యమ్మ దన్నులో
                      నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
                     యమ్మ,కృపాబ్దియిచ్చుతమహత్వకవిత్వపటుత్వసంపదల్----- అంటూ.. కవిపుంగవులుయోగులుసైతంనవరాత్రులలోఅమ్మవారినిపూజిస్తారు..శక్తినిపూజించేశాక్తేయులకుఇదిముఖ్యమైనపండుగ.దేవీఆలయాలలోఅమ్మవారికిఒక్కోరోజుఒక్కోఅలంకారంచేస్తారు.పదవరోజుపార్వేటఉంటుంది.,పూర్వంపాండవులుతమఆయుధాలనుజమ్మిచెట్టుపైఉంచిఅఙ్ఞాతవాసంగడిపి,విజయదశమిన వాటినితిరిగితీసుకున్నారు,అందుచే జమ్మిచెట్టువద్ద పార్వేట చేయడం ఆనవాయితీగావచ్చింది.
పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు లోకాలన్నీ జయించి తానే గొప్పవాడుకావాలనీ అంతాతనకు లొంగిఉండాలనేకోరికతోబ్రహ్మగురించీకఠినతపంచేసివరాలుపొంది,ఆవరగర్వంతోరెచ్చిపోయిఅందరినీ బాధించసాగాడు.ఎవ్వరూఏఆయుధంవల్లవాడినిసమ్హరించలేకపోతారు.అప్పుడుత్రిమూర్తులు,దేవతలంతాతమతమశక్తులనుదేవికిఇచ్చి,మహిషునిసమ్హరించమనివేడుకుంటారు. శివుని తేజం ముఖంగా, విష్ణుతేజంబాహువులుగా,బ్రహ్మతేజంపాదములుగాకలిగినస్త్రీమూర్తిగాత్రిమూర్తులశక్తులుఉద్భవించి ,18 బాహువులతో శివుని శూలము,విష్ణుమూర్తిసుదర్శనచక్రము,ఇంద్రునివజ్రాయుధము, వరుణ దేవునిపాశము,బ్రహ్మదేవునిఅక్షమాల,కమండలము ఆయుధాలుగా ధరించి,హిమవంతుని సింహ  వాహనాన్నీఅధిరోహించి,సర్వదేవతల ఆయుధములతోమహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పిందిదేవి. మహిషాసురునివైపుపోరు సల్పుతున్నఉదద్రుడు, మహాహనుడు, అసి లోముడు, బాష్కలుడు,బిడాలుడుమొదలైనవారినిసంహరించినతరువాతమహిషాసురునిఎదుర్కొంది.ఈయుద్దము లో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగాపోరిచివరకుతిరిగిమహిషిరూపము లో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా , విజయదశమి ,పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది.
బొమ్మల కొలువుపిల్లలుఆనందంగా,ఉత్సాహంగాదశరా బొమ్మలకొలువుపెడతారు, పెద్దలుసహకరించి కావల్సినఏర్పాట్లూసలహాలూఇస్తుంటారు.నవరాత్రులలో9రాత్రులుఈబొమ్మలకొలువుజరుపుకుంటారు.ముత్తైదువులను ,పిల్చిపసుపుకుంకుమలుతాంబూలాలూపండ్లుపూలువాయినాలుఇస్తారు..మహిషాసురుణ్ణిచంపేందుకు దేవికొంతకాలముసూదిమొనమీదతపస్సుచేసిందంటారు.అందుకని బొమ్మల కొలువున్నన్నిరోజులుసూదిలోదారముపెట్టిఏపనిచెయ్యరు.ఈబొమ్మలకొలువుసాధారణంగాతొమ్మిదిమెట్లతోఅలంకరిస్తారు.. వారి కళాదృష్టి, ఆర్ధిక స్తోమత, సౌకర్యాలనుబట్టిఈమెట్లపై రకరకాలబొమ్మలను అమరుస్తారు.మెట్లపైతెల్లనిబట్టపరచిదానిపైబొమ్మలనుఅమర్చుతారు.పైమెట్లపైదేవుళ్ళబొమ్మలు,దేవతాఅమ్మవార్ల బొమ్మలు ఉంచి అలంకరిస్తారు.క్రిందమెట్లపైన కింది మెట్లు పైప్రాపంచికజీవితానికిసంబం దించిన బొమ్మలు ,మధ్యన క్షత్రియధర్మాన్ని తెలుపుతూ ఉండేరాజు,రాణి,యుద్ధవీరులవంటిబొమ్మల నుంచుతారు. పై మెట్టు మీదవుంచే దేవీ కలశంఉంచుతారు. క్రిందనుండీతామస,రాజస,సత్వగుణాలకు ప్రతీకగా ఈమెట్లపై బొమ్మలఆమరిక ఉంటుంది,ఈమూడుగుణాలనూఅధిగమిస్తేదేవికరుణఅందుకోగల మనిసంకేతం .భక్తిని,త్యాగాన్నీస్నేహభావాన్నీ ,సమానత్వాన్నీ ,సేవాభావాన్నీ ,శ్రధ్ధనూపెంచండమేఈపండుగఅంతరార్ధం,పేదధనికభేదంలేకఅందారినీపిల్చి,కలసిమెలసిఆటపాటలటో,పరస్పరం,ఉన్నంతలో నైవేద్యంపేర వాయినాలరూప్మలో అందరికీఇచ్చితమస్నేహాన్నిచాటుకుంటారు.  ధూపదీపనైవేద్యాలతో ప్రతిరోజూలలితాసహస్రనామాలు,లక్ష్మీఅష్టోత్తరాలూచదివిపూజలుచేస్తారు.రోజూఒకఅమ్మాయికిఒకసువాసినికిభోజనంపెట్టితాంబూలం,అలంకరణవస్తువులు,బట్టలుఇస్తారు.ఇలాదసరాతొమ్మిదిరోజులుదాన
ధర్మాలుచేస్తారు. ప్రతిరోజూసాయంత్రముపేరంటానికిముత్తైదువులను,పిలిచి, అందరికీపసుపుకుంకుమ, తాంబూలము,దక్షిణఇస్తేతమకుఅష్టైశ్వర్యాలుసిద్ధిస్తాయని,అమ్మవారిఅనుగ్రహంకలుగుతుందనినమ్మకం. గంధము,పసుపుధరించడంవల్లఆరోగ్యంబాగాఉంటుంది,చల్లదనం , ఏదైనా శారీరక చర్మసంబంధ వ్యాధులుంటే నయమైపోతాయి.ఒకసారిమొదలెట్టిన బొమ్మలకొలువు ప్రతిసంవత్సరము కొనసాగు తుంటుంది.కొన్నిప్రాంతాలలోసంక్రాంతికిబొమ్మలకొలువుపెట్టేఆనవాయితీ, అప్పుడు మూడురోజులే పెడతారు. బొమ్మల కొలువు పెట్టడం మొదలు పెట్టాక సంవత్సరానికో మెట్టు చొప్పున పెంచుకుంటూ తొమ్మిది మెట్ల వరకు పెంచుతారు. ప్రతీ సంవత్సరము తప్పనిసరిగాఓక్రొత్తబొమ్మకొనడంసంప్రదాయం. ప్రస్తుతం ప్లాస్టిక్బొమ్మలు,బార్బీలుచోటుచేసుకున్నాయికానీపూర్వంమట్టిబొమ్మలు,పింగాణీబొమ్మలు , కొయ్యబొమ్మలు,తాటాక్లుబొమ్మలూపెట్టేవారు.దేవునిప్రతిరూపాలైన  శివుడు, పార్వతి,వినాయకుడు , సుభ్రహ్మణ్యేశ్వరుడు,శ్రీరాముడు ,సీతమ్మ,శ్రీకృష్ణుడు,లక్ష్మి,సరస్వతి,ఇంకాఇతరదేవతలబొమ్మలూ,
తత్వబోధకులైనశంకారాచార్యాదులబొమ్మలు,వివేకానందుడు,రామకృష్ణపరమహంస,బుద్దుడు,లాంటిబోధకులబొమ్మలూ,స్వాతంత్ర్యసమరయోధులబొమ్మలు,పెళ్ళితంతుబొమ్మలు,హాస్యపుబొమ్మలు,
కౌరవపాండవులయుధ్ధసీన్లు,అంగడి,పార్కు,జ్యూవంటిసెట్టింగ్స్కూడాపెడతారు .నవరాత్రిబొమ్మలకొలువుపెట్టడంలోఒకప్రత్యేకతవుంది.మానవులుఎలాగైనామంచితనాన్నీపెంచుకుంటూ పరమాత్మ వైపు పయనించేలాఆత్మపరంగాతానుపైమెట్లవైపుఎదుగుతూజీవితంలోముందుకుసాగాలని.ఇలాతాముఉన్నతస్థాయికిచేరుతూచివరికిదేవునిలోఐక్యమైపోడం.కొలువుప్రదర్శనలో 9 మెట్లు అమర్చిఅందులో రకరకాలబొమ్మలు పెడుతున్నాం.తొమ్మిది మెట్లలోఒక్కొక్కమెట్టుపైనా క్రమపద్ధతిలోనే బొమ్మలను అమర్చాలి.బొమ్మలను అమర్చడంలోనూ ఒకపధ్ధతి పాటిస్తారు.మొదటి మెట్టుపైప్రాణముండీ కదల్లేని, గడ్డి,చెట్లవంటివి,రెండవమెట్టుపైనత్త,శంఖువంటిమెల్లనికదలికగలవాటిని,మూడవమెట్టుపైచీమలవంటిచిరుప్రాణులబొమ్మలునాలుగవమెట్టుపైఎండ్రకాయవంటిపాకుడుచలనమున్నబొమ్మలు ,ఐదవమెట్టుపైజంతువులు,పక్షులువంటివివాటిని,ఆరవమెట్టుపైఅంగడిసెట్టి,పోలీస్,వృత్తులుతెలిపేబొమ్మలు,కుటుంబం,పాఠశాలఇంకావివిధరకాలమానవులబొమ్మలు.ఏడవమెట్టుపైతస్సుచేసేఋషుల,పద్మవ్యూహం ,యఙ్ఞ వాటికవంటిబొమ్మలు,ఎనిమిదవమెట్టుపైదశావతారములు ,నవగ్రహాలు, పంచభూతముల రూపాలు అష్టదిక్పాలకులబొమ్మలు.పెడతాము.తొమ్మిదవ మెట్టుపై త్రిమూర్తులు,త్రిమాతలు దుర్గ వివిధరూపాలు, అష్ట లక్ష్ములబొమ్మలుపెడతాము..ఇంకాపార్కు, జ్యూ,వంటి సెట్టింగ్స్ ,అనేకరకాల పళ్ళు,కూరగాయలు, సైనికులు, పక్షులు, జంతువులపెడతారు. కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పాక, నిర్మల్, తంజావూర్బొమ్మలు సేకరించేవారు. ఈకొలువులుసాధారణంగాఆడపిల్లలుఉన్నఇళ్లలోఎక్కువఆర్భాటంగాజరపడంజరుగుతుంటుంది.ఈపండుగప్రత్యేకతేమంటేప్రతిఅంశంలోనూసామాజికస్పృహ,తెలివితేటలువ్యక్తమవుతాయి.పిల్లలుతమఆలోచనాశక్తికిపదునుపెట్టిబొమ్మలకొలువుపెడుతుంటారసరాపండుగల్లోప్రత్యేమైనవిబతుకమ్మలు,పులివేషాలు,బుట్టబొమ్మలు,బొమ్మలకొలువు,ప్రభలుమొ..ఈవిశేషాలుప్రాంతాలనుబట్టిమారుతుంటుంటాయి.తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. విజయ దశమి రోజున రాముడు రావణుని సమ్హరించి విజయంసాధించినరోజనీ,పాండవులు  జమ్మి చెట్టు పైఉంచినతమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజనీ ,ఈ రోజునసందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటంజరుగు తుంటుంది, ఇదే పార్వేట అంటే! దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరపుకుంటారు. మైసూరు, కలకత్తా, ఒరిస్సా, తెలంగాణా, విజయవాడలలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపు కుంటారు. ఇవే కాక ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు. ఒంగోలులో కళాకారులుఅమ్మవారినివివిధరూపాల్లో అలంకరించి ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షససంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శించేవారు.
                  వార్తపత్రికలో -అక్టోబర్ 21న ' సరదాల బొమ్మలకొలువు ' చెలి  సెక్షన్లో  ప్రకటితం.

Sunday 14 October 2012

అక్టోబర్ --15.-- ప్రపంచ అంధుల సహకారదినోత్సవం .


                          అక్టోబర్ --15.-- ప్రపంచ అంధుల సహకారదినోత్సవం  .

    సర్వేంద్రియాణాం నయనంప్రధానం అన్నారుపెద్దలు.ఏది ఉన్నాలేకపోయినా కళ్ళంటూ ఉంటేతన వారినీతననూచూసుకోవచ్చు.జన్మనిచ్చినతల్లి,తండ్రులతోపాటుప్రకృతిసౌందర్యానితిలకించవచ్చు.
'ది రైట్‌ టు సైట్‌'' అనేది ఈసారి ప్రపంచదృష్టిదినోత్సవనినాదం.మానవులంతాఆనందంగాజీవించాలని కోరుకుంటారు. జీవితంలో విసిగి వేసారినపుడు,స్నేహితులెవరైనాపలకరిస్తే"ఏముందోయ్ జీవితమంతా  అంధకారంబంధురంగాఉంది"అంటారుఅంధకారంఅంటేతెలీకపోయినాఅదివాడుకపదం.ఎన్నోసేవాసంస్థలు'తమసేవల్లోభాగంగాకంటిపరీక్షలునిర్వహించిపేదసాదలకుఆపరేషన్లుచేయించిఉచితంగాకంటిఅద్దాలుఅందిస్తుంటారు.ప్రపంచఆరోగ్యసంస్థకంటిచూపుకైతీసుకోవల్సినజాగ్రత్తలుజనావళికిఅందిస్తూనేఉంది. అలాగేవిషన్‌ 2020నిమరింతగా ప్రచారంచేసేందుకు గాలా టూర్‌ను ఏర్పాటుచేస్తోంది. కంటిప్రాముఖ్యతచదువులేనిసామాన్యులకుసైతంఅర్ధమయ్యేలాప్రముఖులచేతప్రచారంచేయిస్తున్నది. ప్రకటనలను, ప్రోగ్రాములనుఅన్నిపత్రికలలోనూ,జాతీయ,అంతర్జాతీయటీవీఛానళ్ళలోప్రసారమయ్యేలా చూస్తోంది .
ప్రాధమికపాఠశాలస్థాయినుండేకంటిపరీక్షలుజరిపిఏవైనాలోపాలుంటేముందేసులువైనమార్గాలుచేపట్ట డంమంచిది.దానికైపాఠశాలసిబ్బందికివాటియాజమాన్యాలు సహకరించాల్సి ఉంటుంది.కంటిపరీక్షలు, 5సం వయస్సులోనూ ,తర్వాత ఇరవై ఏళ్ళవయస్సులోనూ,ముప్పై ఏళ్ళప్పుడూ,చేయించుకోడం వల్ల గ్లకోమా,రెటీనా వంటి సమస్యలు ఏమైనా ఉంటేవాటిని త్వరగా గుర్తిస్తే ... చికిత్స సులువవుతుంది .
40 సం. వయసు రాగానే ప్రతి రెండు నుంచి నాలుగేళ్ళకు ఒకసారి కంటిపరీక్షలు చేయించుకోవాలి .
65 ఏళ్ళు చేరేకఏడాదికొకసారిపరీక్షలుఅవసరము .ఈపరీక్షలుఏసమస్యలులేనప్పుడుసాధారణముగా చేయించుకోవాలి .సమస్యఉన్నట్లుఅనుమానంవస్తేతప్పకవెంతనేనిపుణులైనవైద్యులనుసంప్రతించాలి.. షుగర్ వ్యాధిగ్రస్తులు,వంశపారంపర్యంగా డయాబెటిస్ ,కంటిసంబంధితసమస్యలు ఉన్నవారూ, 40సం. రాగానే  తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలి .
అంధత్వసమస్యలపై ప్రజలనుజాగృతపరిచే ఉద్దేశంతోప్రపంచఆరోగ్యసంస్థ ప్రతిసంవత్సరము అక్టోబర్ రెండోగురువారము, ప్రపంచ దృష్టిదినోత్సవం,నిర్వహించాలని నిర్ణయించి,1998నుండీజరుపుతూ ఉన్నారు.కంటిచూపుతోమనస్సునుతెలుపవచ్చు.ప్రపంచంలోనివిషయాలన్నీతెల్సుకోవచ్చు.కనుసన్నల్తో పనులుజరిపించుకోవచ్చు.అదేచూపులేనివారుఏమీచేయలేకపోగాతమపను లన్నింటికీ ఇతరులపై ఆధారపడి బ్రతుకే భారమైపోతుంది..రంగుల ప్రపంచము గురించీ ఏమీతెలీదు. ఆ కటిక చీకటిలో ఆత్మీయులనే గుర్తించలేకపోతారు. అందువల్లే చూపును ఎప్పుడూ పదిలంగా కాపాడుకోవాలి .కళ్ళు ప్రపంచానికి వాకిళ్ళు!
అంధత్వము అంటే పూర్తిగాకాని పాక్షికం గాకాని చూడలేని స్థితి. కంటి చూపు పోవడాన్ని గుడ్డితనం లేదా అంధత్వం అంటాం.ఇదినేత్రసంబంధమైనలేదానరాలసంబంధమైనకారణాలవలనకలుగవచ్చును.
అంతర్జాతీయ అంధుల ఆసరా దినోత్సవం అక్టోబర్‌ 15 న ఆచరిస్తూ అంధులకు దారి చూపేది, ఆస రాగా నిలిచే ది తెల్లటి చేతి కర్ర. ఈ తెల్లటిచేతికర్రను అంధత్వానికి సంకేతంగా గ్రహించి ఐక్య రాజ్య సమితి 1981వ సంవత్స రంలో అక్టోబర్‌ 15 వ తేదీని వరల్ట్‌ వైట్‌ కేన్‌ డేగా గుర్తించింది.
దృష్టి మాంద్యాన్ని కొలిచే వివిధ కొలమానాలు ఇంకా అంధత్వ నిర్వచనాలు అభివృద్ధి చేయబడ్డాయి." పూర్తి అంధత్వంఅంటే  చూపు పుర్తిగా లోపించడం. దీనిని వైద్య పరిభాషలో " నో లైట్ పెర్సెప్షన్స్  అంటారు. ఇంకా కొంతచూపుమిగిలివున్నవీరుకాంతి ఉన్నదీ లేనిదీ,ఆకాంతి ఏదిక్కునుండి వస్తున్నదీ మాత్రమే గుర్తించగలరు.
అంధులలో ఎవరికి ప్రత్యేకమైన సహాయం అవసరం అనే విషయం మీద వివిధ ప్రభుత్వ చట్టాలు క్లిష్టమైన నిర్వచనాలు తయారుచేశాయి. వీటిని చట్టపరమైన అంధత్వం అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం దృష్టి మాంద్యం అంటే సవరించిన దృష్టి తీవ్రత 6/18 కంటే తక్కువగా ఉండడం, కానీ 3/60 కంటే మెరుగ్గా ఉండడం. అంధత్వం ,అనగా దృష్టి తీవ్రత 3/60 కంటే తక్కువగా ఉండడం.
కొన్ని రంగుల మధ్య భేధాన్ని గుర్తించలేకపోవడాన్ని వర్ణ అంధత్వం లేదా వర్ణాంధత ,కలర్ బైండ్నెస్ అంటారు. రాత్రి సమయంలో విటమిన్ ఎ. లోపం మూలంగా కలిగే దృష్టి మాంద్యాన్ని రేచీకటి , నైట్ బ్లైండ్ నెస్  అంటారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అంచనాల ప్రకారం 2002 సంవత్సరంలొ ప్రపంచంలో సుమారు 161 మిలియన్ మంది కంటిచూపు లోపాలతో బాధపడుతున్నారని వీరిలో 124 మిలియన్  మందిలోదృష్టి మాంద్యంఉన్నట్లుమరియు37మిలియన్మందిఅంధులుగాప్రకటించింది.అంధత్వంచాలాకారణాలమూలంగా కలుగుతుంది:కంటి జబ్బులు,దృష్టి మాంద్యం ఎక్కువగాపౌష్టికాహారలోపంమూలంగాకలుగుతాయి. ప్రపంచఆరోగ్యసంస్థఅంచనాలప్రకారంప్రపంచవ్యాప్తంగాఅంధత్వంకలగడానికిముఖ్యమైనకారణాలు:శుక్లాలు ,గ్లకోమా ,యువియైటిస్ , ట్రకోమా ,కార్నియల్ తెలుపుదనము ,చక్కెరవ్యాధి, ఇంకా కొన్ని  ఇతర కారణాలు.అభివృద్ధి చెందుతున్న దేశాలలో అంధత్వానికి ఎక్కువగా నివారించగలిగే కారణాలవల్లేజనం బాధ పడటం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అంధులలో వృద్ధులుఎక్కువగాఉన్నా పిల్లల్లో అంధత్వం పేద దేశాలలో ఎక్కువగా కనిపిస్తుందనిఅంచనావేసిన 40 మిలియన్ అంధులలో 7080శాతంమందిలో సరైన వైద్యంతో దృష్టిని కొంత లేదా పూర్తిగా తిరిగి పొందవచ్చును.పాశ్చాత్యదేశాలలో కలిగే అంధత్వం వయోసంబంధమైన మాక్యులా లేదా రెటినా లోపాల వలన కలుగుతుంది. మరొక కారణం నెలలు నిండ కుండా పుట్టే పిల్లలలో కలిగే రెటినోపతీ.
అతిప్రమదకరమైనదైనకల్తీసారా...తాగటంవలనఅంధత్వంకలుగవచ్చును.కానీమనదేశంలో,ముఖ్యంగా మనరాష్ర్ట్రంలో తాగుడుమాన్పించడఅసాధ్యం.అందువల్ల కనీసంకంటిపరీక్షలైనాసరిగాచేయించుకుంటూ కంటిచూపుకోల్పోకుండా జాగ్రత్తపడేలాగా జనాలనుజాగృతిపరచాలి.కంటికిసంబంధించినఏసమస్యనైనా   అశ్రద్ధ చేస్తే ప్రమాదమనీ కంటిచూపు మందగించినా, కళ్ళనుండి నీరు కారుతున్నా, కళ్ళు ఎర్రబడినా,
పుసులు కడుతున్నా, తలనొప్పి వస్తున్నా వెంటనే కంటి డాక్టరును సంప్రదించాలనీ తాగుబోతుల కుటుంబాలకుతెలియజెప్పాల్సినబాధ్యతసమాజసేవాసంఘాలపైనఉంది..మసకవెలుగులో,ప్రయాణాల్లో చదవడంవలనకూడా కంటి చూపుతగ్గే ప్రమాదం ఉందని తెల్సినా ఎవ్వరూ ఖాతరుచేయట్లేదు..
      అంధత్వ లెక్కలను ఒకసారి పరిశీలిస్తే 50 ఏళ్ళ క్రితం ప్రపంచవ్యాప్తంగా నాలుగున్నర కోట్లమంది అంధులు. ప్రస్తుతం ప్రతి ఐదు సెకన్లకీ ప్రపంచంలో ఒకవ్యక్తికి చూపు పోతోందని, ప్రతి ఐదునిమిషాలకి ఓ చిన్నారిచూపు కోల్పోతున్నదని అంచనా. అలాగే ఏటాదాదాపుడెబ్భయ్‌ లక్షలమంది అంధులుగా మారుతున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలోదాదాపు32 కోట్లమందిఅంధులులేదా దృష్టి లోపాలతో బాధపడుతున్నవారున్నారు. వారిలో నాలుగున్నర కోట్లమందిగుడ్డివారు కాగాఇరవయ్యేడు న్నరకోట్లమందికికంటిసమస్యఅవగాహనలేనికారణంగాచిన్నచిన్నఇన్‌ఫెక్షన్లుకూడాఅంధత్వాన్నితెచ్చిపెడ్తున్నాయి. స్త్రీలకంటేపురుషులే కంటిజాగ్రత్తలుఎక్కువగాతీసుకుంటారని,అంధులలోరెండింటమూడు వంతులు స్త్రీలు, పిల్లలేఉన్నారనిసర్వేలుతెలియజేస్తున్నాయి.వృద్ధాప్యంమీదపడినకొద్దీకంటిసమస్యలు అధికమవడంసాధారణం.సరైనఆహారంలేనందునఅభివృధ్ధిచెందుతున్నదేశాల్లోపేదప్రజలుఅంధత్వబారిన పడుతున్నారు. 90 శాతంఅంధులుపేదదేశాల్లోనివసిస్తున్నవారేనితెలుస్తున్నది..నిజానికిఅంధులలో దాదాపు 80 శాతం మందికి చూపు తెప్పించగలిగే అవకాశం వుంది. ఆర్థిక ఇబ్బంది కారణంగాఅంధుల శ్రేయస్సు కుంటుపడుతోంది.దురదృష్ణవశాత్తూ నేటి వైద్యాలయాల్లోని అశ్రధ్ధకారణాంగా కొంత మంది పేదలు కంటుచూపుకోల్పోతున్నారనడంలో అతిశయోక్తిలేదు.
                కంటిజాగ్రత్తకైఅంతాగుర్తుంచుకోవలసినకొన్నివిషయాలు:ఎప్పుడూకూడానెంబరులేనికళ్ళ
జోళ్ళనుధరించరాదు.చలువకళ్ళద్దాలువాడేప్పుడుఅవిఅల్ట్రావైలెట్‌కిరణాలనుంచికాపాడేవిగాఉండాలి.కంట్లోనలుసుపడినప్పుడుచేత్తోగట్టిగానలపడంకానీరుద్దడంగానీచేయకూడదు.చేతికున్నమట్టి,ధూళికణాలు ,సూక్ష్మక్రిములుకంటిలోకిచేరిఅలర్జీలేదాఇన్‌ఫెక్షన్‌నుకలిగించేప్రమాదముంది.మహిళలువంటచేసేటప్పుడు , వేడిఅవిరికళ్ళకు తగిలినప్పుడు లేదా కూరగాయలు శుభ్రం చేసే సమయంలోధుమ్ముపడితే వెంటనే చేతులు శుభ్రం చేసుకుని చేతి వేళ్ళతో నీటిని కళ్ళమీద చిలకరించి మెత్తని గుడ్డతో కళ్ళు తుడుచుకోవాలి. కళ్ళను చన్నీళ్ళతో కడగాలి.కంటికి శ్రమకలిగించకండాకడగాలి. కళ్ళలో మంట ఏర్పడి ఎరుపెక్కినపుడు  చిట్కావైద్యాలుచేయక కంటి డాక్టరుకు చూపాలి.
                  అంధులకోసం ప్రవేశపెట్టాల్సిన పథకాలగురించి, అలాగే నిరుపేదలకుఉచిత కంటిచికిత్స చేయించాల్సిన అవసరంగురించి, ఆరోగ్యశాఖా మాత్యులు,ఇతరప్రభుత్వఅధికారులనుఆలోచించాల్సిన అవసరం ఎంతైనాఉంది. ఈ అంతర్జాతీయ అంధుల ఆసరా దినోత్సవం అక్టోబర్‌ 15 సందర్భంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి కళ్ళు ఎంత ముఖ్యమో, వాటినెలా కాపాడుకోవాలో అనేఅంశాలపై సభలు సమావేశాలుజరపడమేకాకసాధారణజనావళికిస్పందనకలిగేలాచూడటంప్రతిఒక్కరిబాధ్యతగాభావించాల్సి ఉంది. మనచూపును కాపాడుకోవడంతోబాటు, మనపిల్లలు కంటి సంబంధిత అనారోగ్యాలతో పుట్ట కుండా జాగ్రత్తతీసుకోమని హెచ్చరించాల్సిఉంది స్కూలు, కాలేజి పిల్లలకుకంటిచూపుకు సంబంధించిన విషయాలపైవక్తృత్వ,వ్యాసరచనపోటీలునిర్వహించాలి.పుట్టుఅంధులైనవారికిఆసరాఇవ్వనుప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలి. 2020 నాటికి లోకంలో అంధత్వం అనేది లేకుండా చేయాలనేదిప్రపంచఆరోగ్య సంస్థ ఆశయం. దీని ఆవస్యకతనుఅందరికీ తెలియపరచిఅందరూ అంధత్వనివారణకైప్రపంచవ్యాప్తంగా ప్రయత్నించాలి. కంటి డాక్టర్లు,మెడికల్‌సంస్థలు,ఐడోనార్సు ,ఇతరకంటిసేవాసంస్థలుకూడాప్రజలందరికీ అవగాహన కల్గించి సహాయం అందించాలి.. విషన్‌ 2020 వెబ్‌సైట్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టుతో సహా కళ్ళకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రచురిస్తుంది.
      మనిషి తల్చుకుంటే సాధ్యంకానిదేమీ లేదని ఎన్నోసార్లు రుజువైంది. ప్లేగు, మసూచి, కుష్టు లాంటి అనేక భయంకర వ్యాధులనివారణకు కృషి జరిగింది. ఇంకెన్నోనయం కావనుకున్నఅనారోగ్యాలునామ రూపాల్లేకుండాపోయాయి.కొన్నివేలజబ్బులతోబాటుటీబీ,క్యాన్సర్‌లాంటిఅమితప్రమాదకరమైనరోగాలకు సైతం మందు కనిపెట్టాడు.పోలియోదాదాపుగా అంతరించింది.తీవ్ర దృష్టిలోపాలను ఆపరేషన్ ద్వారా సవరించగలుగుతున్నారు. పుట్టినతర్వాత ప్రాప్తించేఅంధత్వాలులేకుండాచేయడంఎంతమాత్రంఅసాధ్యం కాదు. ఎందరో కంటి నిపుణులు ఇప్పుడీ విషయంమీద గట్టిగా కృషిచేస్తున్నారు. కనుక, 'విషన్‌ 2020' ఆశయం నెరవేరుతుందని, అంధత్వం లేని ఆదర్శవెలుగువంతమైన సమాజంవస్తుందని ఆశిద్దాం.
********అక్టోబర్ 15 ప్రపంచ అంధుల సహకారదినోత్సవం  సందర్భంగా వార్త దినపత్రికలో ప్రచురితం. ********