Thursday 23 July 2015

దృష్టి -సృష్టి



దృష్టి -సృష్టి

దృష్టి -సృష్టి  రచనఆదూరి.హైమవతి.

 

ఒక రోజున సాయం సమయంలో తులసీదాసు తాను వ్రాసిన ‘ తులసీ రామాయణం’ చదివి అర్ధం చెప్తుండగా , ఆయన చుట్టూ జనం కూర్చుని ఆరామాయణగాధను ఆలకిస్తున్నారు. ఆసమయంలో తులసీదాసులంకా పట్టణం లోని అశోక వనంలో సీతమ్మ తల్లి విచారంగా అశోకవృక్షం క్రింద కూర్చుని దూరంగాఉన్నతటాకంలోని తెల్ల కలువలను చూస్తూ ., శ్రీరాముని స్మరించుకుంటూ , తన అవస్తకు చింతిస్తూ ఉందిఅని పరవశంతో చెప్తుండగా పెద్దగాలి రివ్వున వీయసాగిందిఅక్కడకూర్చున్న జనమంతా అది  ఏదో భీకర గాలీ వానా వచ్చేసూచనేమో అని భయపడసాగారు. ఇంతలో వాయుపుత్ర హనుమంతుడు అక్కడ దిగాడు.

అయ్యా! తులసీదాసు గారూ!వందనం !మీ రామాయణ ప్రవచనం మధురంగాఉంది,నేను ఆకాశ మార్గాన వెళ్తూ వింటున్నాను,ఐతే తమరు ఒక్క చిన్న పొరపాటు చెప్తున్నారు,అందుకే నేను దిగివచ్చానుఆనాడు లంకా నగరంలోని అశోకవనంలో ఉన్నవి తెల్ల కలువలు కావుఎఱ్ఱ కలువలు ! తమరు అది సవరించి ప్రవచించండి ! తమ గ్రంధంలోనూ సవరించండి !” అని వినయంగా కోరాడు.

అక్కడి శ్రోతలంతా హనుమంతుని దర్శన భాగ్యం కలిగినందుకు మహదానంద పడసాగారు. తులసీదాసురామ భక్త హనుమాన్  కు జయమగుగాక! హనుమత్ ప్రభూనేను నిరంతరం రామ నామం జపిస్తూ నాదైవం నా మనస్సులో స్పురింపజేసే ఆలోచనలనే రామాయణకావ్యంలో రచించాను. నాదేవుడు నాచే ఏతప్పూరాయించడు !” అని స్థిర చిత్తంతో , చిరునవ్వుతో చెప్పాడు .

దానికి హనుమఅయ్యా! తూలసీదాసుగారూ ! తమరు ఊహించి వ్రాస్తున్నారు,నేను స్వయంగా లంకా నగరాన్నీఅశోక వనాన్నీ , తటాకంలోని  కలువలను దర్శించినవాడనునేను ప్రత్యక్ష సాక్షిని . కనుక మీరు మరోలా భావించక మీ గ్రంధాన్ని సవరించాల్సిఉందిఅని చెప్పాడు గంభీరకంఠంతో.

తులసీదాసు చిరునవ్వుతోహనుమా న్ జీ! స్వామీ ! నా ప్రభువు నాచే ఎన్నడూఒక్కతప్పైనా వ్రాయించడుఆనమ్మకం నాకుంది,అందువల్ల ఆచెఱువులోవి తెల్లకలువలేకానీఎఱ్ఱకలువలు కానేకావు“  అని స్థిరంగా అన్నాడు .

ఇద్దరిమధ్యా వాగ్వివాదం పెరగసాగింది. అప్పుడు హనుమ వాదన మనకెందుకు ? మనం వెళ్ళి సీతారాములను దర్శించి ,  సమయంలో  కలువలను చూసిన  తల్లినీ , అన్నివిషయాలూ ఆమె ద్వారా అలకించిన ప్రభువునూ అడిగి వాస్తవం తేల్చు కుందాం రండిఅని కోరగా తులసీదాసు అంగీకరించాడు.ఇద్దరూబయల్దేరి వెళ్ళిశ్రీరాముని,సీతమ్మ తల్లిని కల్సి నమస్కరించి నిలిచారు.

వారు ఏమీచెప్పకుండానే శ్రీరాములవారుహనుమా! తులసీదాసు వ్రాసినది సత్యం !లంకానగరం లోని అశోకవనంలోని సరస్సులో ఉన్నవి తెల్లకలువలే! ” అన్నారు చిరునవ్వుతో.

ప్రభూ ! నేను స్వయంగా చూశానుకదా! నాకళ్ళే నన్ను మోసంచేస్తాయా! అమ్మా!సీతమ్మతల్లీతమరు చెప్పండి కలువల రంగు ఎరుపా! తెలుపా!” అన్నాడు హనుమ చేతులు జోడించి.సీతమ్మవారు చిరునవ్వుతో శ్రీరాముని వంక చూసింది.’తమరేచెప్పమన్నట్లుగా .

శ్రీరాములవారుహనుమా! నీవు రావణుని పట్ల క్రోధంతో ఉండటాన , నీకళ్ళు సైతం ఎఱ్ఱబారి చూసినవన్నీ నీకు ఎఱ్ఱగానే కనిపించాయినిజానికి అవన్నీ తెల్లనివే! మన దృష్టి ఎట్టిదో సృష్టీ అట్టిదిగా ఉంటున్నదిఅని చెప్పారు.హనుమ తన సందేహం తీరటంతో  , తులసీదాసుతో కలసితిరుగు ప్రయాణ మయ్యాడు.

చూశారామన దృష్టిని బట్టే మన కళ్ళు లోకాన్నిచూస్తాయి కనుక మనం నిరంతరం మన మనస్సునూ మంచిగా ఉంచుకుని చూస్తే లోకమంతా మంచిగానే కనిపిస్తుంటుంది.అలా చేయను ప్రయత్నిద్దామా!

ఒక్కడేగా !?-


ఒక్కడేగా !?-ఆదూరి.హైమవతి.[కథ

ఒక్కడేగా !?
ఒక్కడేగా !?
కిట్టిగాడు నిద్ర లేచేసరికి వాడిబామ్మతాత కనిపించక పోయే సరికి వాడికి తిక్కరేగింది. “ తాతా ! బామ్మా ! “అని పెద్దగా అరుస్తూ ఇల్లంతా తిరిగాడు. వంటగదిలో హడావిడిగా ఉన్నతల్లి వద్దకెళ్ళిఅమ్మా! బామ్మా,తాతా ఏరే?” అని అడిగాడు
బయట తోటలో ఉన్నారేమో చూడుఅందివాడి అమ్మ .వాడుగబగబా తోటలో కెళ్ళి చూశాడు,అక్కడి సిమెంట్ బెంచి ఖాళీగా ఉంది. తిరిగి ఇంట్లోకి వచ్చి ఈమారునాన్నా! బామ్మా తాతా ఏరీ?” అని అడిగాడుగడ్డం గీక్కుంటున్న వాళ్ళనాన్న తలతిప్పకుండానేపెరట్లో పూలుకోస్తున్నారేమో చూడరాదూ !” అన్నాడు. కిట్టిగాడు పెరట్లోకెళ్ళి అక్కడ గిన్నెలుతోముతున్న గంగమ్మను ,
మాబామ్మా తాతా ఇక్కడగాని ఉన్నారా?” అని అడిగాడు .” లేరుబాబూ ! బయటికి గానీ వెళ్ళారేమో! ” అంది గంగమ్మ .
వాడితిక్క ఎక్కువై వీధిగుమ్మముందు అరచేతుల్లోముఖం పెట్టుకుని కూర్చున్నాడు, బామ్మతాతలకోసం ఎదురుచూస్తూ. కాస్త సేపటికి చేతులో పూజబుట్టతో వచ్చారు ఇద్దరూ.
వారు కినిపించగానే ఛెంగున గెంతి దగ్గరకెళ్ళిఎక్కడకెళ్ళారు పొద్దుటే ?” ఆశ్చర్యంగా అడిగాడుకిట్టి.
ఈరోజుగురుపూర్ణమికదరా ! అందుకని ఆలయానికి వెళ్ళివస్తున్నాంఅందిబామ్మ
అలాగేంఅంటూ తాతచెయ్యిపట్టుకుని లోపలికి నడిచాడు కిట్టు
ఇంకో మారు మళ్ళీ బామ్మతాత లేవగామే కనిపించకపోడంతో ,’ఈరోజూ గుడికే వెళ్ళి ఉంటారనిగుమ్మంలోనే కాపేశాడుకిట్టు. ” ఈరోజు ఏగుడికెళ్ళారు బామ్మా!” అని అడిగాడు వారురాగానే
ఈరోజు వరలక్ష్మీ వ్రతంకదా ! అందుకని లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళాంఅందిబామ్మ .
మరో మారు బయటికెళ్ళివస్తున్న బామ్మతాతలతో రోజు ఆలయానికీ?” అన్నాడు.
రోజున వినాయచవితిరా కిట్టూ ! అందుకని వినాయకుని గుడికిఅందిబామ్మ.
మళ్ళీ ఇంకో మారు ఆలయం నుండీవస్తున్న వారిని కిట్టిగాడుఈరోజే ఆలయానికీ?” అన్నాడు , బామ్మ నవ్వుతూదేవీనవరాత్రులురా కిట్టూ! అందుకే దుర్గాదేవి కోవెలకుఅంది కుంకుమ వాడినుదుటపెడుతూ .
బామ్మా! నాకో అనుమానం . మన దేవునిగదిలోనే దేవుడున్నడని నీవు పూజ చేస్తూ రోజుకోగుడి కి ఎందుకెళుతున్నావు? నీవునాకు రాత్రిపూట నిద్రపోయేప్పుడు రోజూకధలుచెప్తున్నావుగదా! ఓరోజునీవుచెప్పినకధ ……
ఒక ఊర్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. అతడిని ఆఫీస్ లోక్రిందివారుసార్ సార్అనిపిలుస్తారు,అతడిపై అధికారులుమిస్టర్ ఎస్ పీ! ” అంటారు. ప్రజలుఎస్ పీ సార్అని, స్నేహితులుఏమోయ్ ! రావ్అనీ , వాళ్ళ అమ్మనాన్నఏరా!బాబూఅనీ , భార్య 
ఏమండీ! ” అనీ , అన్నతమ్ములు , అక్కచెల్లెళ్ళూఅన్నా!” లేకఒరే తమ్ముడూఅనీ , పిల్లలునాన్నగారూఅనీ పిలుస్తారు.ఆఫీస్ కు యూనిఫాం వేసుకుంటాడు, ఇంట్లో పంచెకట్టుకుంటాడు, షికారుకు వేరేడ్రెస్ , నిద్రపోయేప్పుడు నైట్ డ్రెస్ , ప్రయాణాలకు వేరేడ్రెస్ ,కానీ ఏడ్రెస్ వేసుకున్నా , ఎవరెలా పిలిచినా అతడు ఒకే మనిషి. డ్రేస్ లూ , పిలిచే పధ్ధతులూ మారుతున్నాయికానీ మనిషి మారడంలేదు. భగవంతుడు ఒక్కడే రూపనామాలు మాత్రం వేరు , అందుకనే మనం దేవుని ఒకే రూపాన్ని ,ఒకే పేరున పూజిస్తే చాలు —‘ అనిచెప్పావుగదా ! మరి రోజుకోగుడికివెళుతున్నా రెందుకూ?” అని ఐదేళ్ళ కిట్టూగాడు అడిగినప్రశ్నకు బామ్మ తాత విస్తుపోయారు