Sunday 18 August 2013

కదళీ ఫలం

చిన్నారి 




కదళీ ఫలం


ap -   Sun, 18 Aug 2013, IST


కదళీ ఫలం,andhra prabha,telugu, news paper,epaper,hyderabad,online games for girls, telugu news, hot,cinema,show,sunday book,breaking news,telangana,vidyaprabha, corparate accounting,student voice,kulasa,naika,balaprabha,chintana,business,sports

దుర్వాస మహర్షి తన భార్య అయిన 'కదళి'తో కలిసి ఒక పర్ణశాలలో నివస్తున్నాడు. అక్కడే భార్య సహకారంతో జపతపాదులు చేసు కుంటూ కాలం గడుపుతున్నాడు.
భర్త కోపం గురించి తెలిసిన కదళి ఎంతో జాగ్రత్తగా ఆయనకు సపర్యలు చేస్తుండేది.
ఒక రోజు సాయంత్రం అలసటగా ఉండడంతో మహర్షి ఆశ్రమం బయట నడుం వాల్చాడు. ఇంతలో సాయం సంధ్యా సమయం మించిపోతోంది. సంధ్యావందనం చేసుకునే సమయం దాటిపోతుండడంతో భర్తను లేపడం తన కర్తవ్యంగా భావించింది కదళి.
మంచి నిద్రలో ఉన్న దుర్వాసుడిని ఆమె తట్టి లేపింది. నిద్రాభంగం కావడంతో కోపం తెచ్చుకున్న ఆయన తీవ్రంగా కదళివైపు చూశాడు. అంతే ఆ తీక్షణతకు తట్టుకోలేక కదళి భస్మమయి పోయింది.
ముందు వెనుక ఆలోచించక తెచ్చుకున్న కోపంతో జరిగిన ఆనర్థానికి బాధపడ్డాడు దుర్వాసుడు.
కొన్నాళ్ల తరువాత కదళి తండ్రి తన కుమార్తెను చూసేందుకు ఆశ్రమానికి వచ్చాడు. అయితే జరిగిన విషయం చెప్పడానికి భయపడ్డాడు దుర్వాసుడు. చివరికి ఆయన పదేపదే అడగ్గా జరిగిన విషయం చెప్పి క్షమించమని వేడుకున్నాడు.
అంతేకాక తన తపో శక్తితో కదళి భస్మం నుండి ఒక చెట్టును సృష్టించాడు. అదే కదళృ వృక్షం. ఆ ఫలమే కదళీ ఫలం.
ఆ ఫలాన్ని మామగారికి ఇస్తూ నేటి నుంచి మీ కుమార్తె కదళీ అందరికీ ఇష్టురాలై దేవతా కార్యక్రమాల్లో, శుభకార్యాల్లో ముఖ్య భూమిక పోషిస్తుందని మాట ఇచ్చారు.
ఇప్పటికీ మనం అరటిపండును (కదళీ ఫలం)ను దేవుడిముందుంచి కదళీ ఫళం సమర్పయామి అని చెప్పి నైవేద్యం పెడుతున్నాం.
- ఆదూరి హైమావతి, చికాగో.
*****************************************
ఆదివారం 18-8-2013 ఆంధ్రప్రభ ' చిన్నారి 'లో ప్రచురితం.

Sunday 11 August 2013

అసూయ అనర్థ హేతువు

చిన్నారి 




అసూయ అనర్థ హేతువు


apr -   Sun, 11 Aug 2013, IST


రాజుపాలెం అనే గ్రామంలో భూకామందు మాధవయ్య కొడుకు కుమార్‌, పేదవాడైన కొమరయ్య కొడుకు కిట్టయ్య ఒకే స్కూళ్లో చదువుకుంటున్నారు. కొమరయ్య అతడి భార్య కూలికి వెళ్లి వచ్చిన డబ్బులతో గంజి తాగి బతికేవాళ్లు. వాళ్లుండే గుడిసెలో ఏ లైట్లు లేవు. చమురు దీపపు వెలుగులో గడిపేవారు. చీకట్లో గంజి తాగుతూ
తమ బిడ్డకు ధనం కన్నా గుణం గొప్పదని, ధనం కోసం ఏ దుర్మార్గాలూ చేయరాదని, అంతా మన ప్రవర్తనను బట్టే జరుగుతుందని చెప్పేవారు.
తల్లిదండ్రులు చెప్పే మాటలతో కిట్టయ్య చిన్నప్పటినుంచి మంచి విద్యార్థిగా పేరుతెచ్చుకున్నాడు. తరగతిలో వాడే ఫస్ట్‌ మార్కులు తెచ్చుకునేవాడు. వాడి చేతిరాత ఎంతో బాగుంటుందని ఎన్నోసార్లు పంతులుగారు బోర్డుపై రాయించేవారు.
చిరిగిన పాతగుడ్డలతో వచ్చే కిష్టయ్యకు మంచిపేరు రావడం, పంతులుగారు ఎప్పుడూ వాడిని మెచ్చుకోవడాన్ని కుమార్‌ భరించలేకపోయేవాడు. ఆ ఏడాది ఆగస్టు 15 పండుగ నుద్దేశించి జరిపిన ఆటల పోటీలు, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు ఇలా అన్నీ కలిపి ఓ పది బహుమతులు కిట్టయ్య సొంతం చేసుకున్నాడు. కిట్టయ్యకు అన్ని బహుమతులు రావడం చూసి అకారణంగా కోపం
పెంచుకున్నాడు కుమార్‌. ఎలాగైనా వాడిని బాధించి సంతోషించాలని ఆలోచించసాగేడు. ఒకరోజు చెరువు గట్టుమీద అమ్మ నేర్పిన

పద్యాలను వల్లె వేసుకుంటూ వస్తున్నాడు. కిట్టయ్యను చెరువులోకి తొయ్యాలని ఒక చెట్టుకింద కాపు కాస్తున్నాడు కుమార్‌. కిట్టయ్య తన దగ్గరకి రాగానే కుమార్‌ గభాలున నీళ్లలోకి తోసాడు. అయితే అదే ఊపుతో కుమార్‌ కూడా నీళ్లలో పడ్డాడు.
తండ్రివెంట చేపలవేటకు వెళ్లే అలవాటున్న కిట్టయ్య నీళ్లలోంచి ఈదుకుంటూ బయటకు వచ్చాడు. అయితే ఈత రాని కుమార్‌ రక్షించండి! రక్షించండి! అంటూ నీళ్లలో కేకలు వేయసాగాడు. మళ్లిd నీళ్లలోకి దూకి కుమార్‌ను ఒడ్డుకుతీసుకువచ్చాడు. అక్కడే కడుపులోంచి నీళ్లను బయటకు కక్కించి ఇంటికి తీసుకెళ్లాడు. తను చేసిన పనికి సిగ్గుతో తలదించుకున్న కుమార్‌ క్షమించమని కిట్టయ్యను వేడుకున్నాడు. కిట్టయ్య ఇద్దరం కలిసుందామని స్నేహహస్తాన్ని చాచాడు.
-- ఆదూరి హైమావతి, చికాగో
ఆదివారం ఆంధ్రప్రభ 11ఆగస్ట్ లో ప్రచురితం.

Thursday 8 August 2013

మృకండుమహర్షిచరిత్ర .


మృకండుమహర్షిచరిత్ర  .        

  మృకండుమహర్షి మృగశృంగమహర్షి కుమారుడు.మృగశృంగమహర్షితపశ్శక్తిచేచనిపోయినసువృత్తను  తిరిగి బ్రతికించగా, సువృత్తతండ్రినుచథ్యుడుతనకుమార్తెనుఅతనికిచ్చివివాహంచేస్తాడు.సువృత్తకుమారుడే మృకండుడు. శాలగ్రామమనే మహాతీర్ధంలో సర్వప్రాణుల హితంకోరితపస్సుచేసి శ్రీమహావిష్ణువును మెప్పించిదర్శనంపొందుతాడు, విష్ణువుమృకండు భక్తికిమెచ్చిఅతనికి కుమారునిగాజన్మిస్తాననిఅతడు కోరకుండానే వరమిస్తాడు.మృకండు సార్థక నామధేయుడు.ఆయనతపస్సులో లీనమైనిశ్చలుడై ఉన్న సమయంలోఆయన శిలవలె ఉండడం వల్లమృగములు వచ్చితమకండుయాన్నితీర్చుకొనేవి.మృగములకండుయాన్నితీర్చినవాడుకనుకఆయన్నుమృకండుమహర్షిఅనిపిలిచేవారు. మరుధ్వతిఅనేమహాసాధ్విఆయన భార్య,వారికి ఉన్నఏకైక లోటు సంతానం లేకపోవడం,పుత్రులు లేకపొతేపైలోకాల లో ఉన్నత గతులు ఉండవని భావించి కాశీలో తపస్సు చేయను సతీసమేతంగాబయలుదేరుతాడు. కాశీలోవారు రెండులింగాలుప్రతిష్ఠించి,పరమశివునిగురించిఘోరతపస్సుచేస్తారు.మహాదేవుడుతపస్సుకిమెచ్చిప్రత్యక్షమైమృకండు మహర్షిని మరోమారు పరీక్షింపదలచి,'సద్గుణుడై16ఏళ్ళుమాత్రమేజీవించే కుమారుడు  కావాలాలేక దుర్గుణు డైన చిరంజీవికావాలా 'అనిఅడగ్గామృకండు మహర్షి సద్గుణుడైన 16 ఏళ్ళు బ్రతికేపుత్రుడుచాలంటాడు.శివుడుసంతసించి ' అలాంటి పుత్రుడ్ని ఇచ్చాను 'అని చెప్పి అదృశ్యమౌతాడు.

    మహాదేవునిమాటప్రకారం మరుధ్వతిగర్భవతై,దివ్యతేజస్సుకలిగిన పుత్రుడ్ని ప్రసవించింది. మృకండుమహర్షి కొడుకుకనుక వానికి 'మార్కండేయుడు' అని నామకరణం చేశారు.7సంవత్సరాలు 3నెలలునిండినవెంటనేమార్కండే యుడికిఉపనయనంచేశారు.ఒకరోజుమృకండమహర్షినిచూడనుసప్తఋషులురాగామార్కండేయుడువారికినమస్కరిం చగా వారు దీర్ఘాయుష్మాన్ భవా!అని దీవిస్తారు. మృకండుమహర్షిఇదివినితనకొడుకునిజంగాచిరంజీవిఅవుతాడా!’అనిఅడగ్గాసప్తఋషులు దివ్యదృష్టితో శివుడు మృకండుతో అన్నమాటలు గ్రహించి,మార్కండేయునిబ్రహ్మవద్దకుతీసుకువెళ్ళిఆయనచేతనూ 'చిరంజీవా!అని దీవింపచేస్తారు.మార్కండేయుడినినిరంతరశివారాధనచెయ్యమనిచెప్తారు.16సంవత్సరాలునిండినరోజుయమకింకర్లుమార్కండేయుడిప్రాణాలుతీసుకొనుటకైవస్తారు.యమకింకరులుమార్కండేయుడి తేజస్సుచూసి మార్కండేయుడిప్రాణాలుతేవడంతమవల్లకాదని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన దున్నపోతుమీదమార్కండేయుడిప్రాణాలుతీయడానికిబయలుదేరతాడు.అకుంఠితభక్తితోశివారాధనచేస్తున్నమార్కండేయుని పైయముడుతనపాశాన్నివిసిరేసరికిమార్కండేయుడుశివలింగాన్నికౌగలించుకొని'చంద్రశేఖరాష్టకాన్నిభక్తితోపఠిస్తాడు,‘శివామహాదేవాకాపాడు!అనిమార్కండేయడు అన్నవెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు.దీన్నిచూసియముడు భయపడిమహాదేవా! క్షమించు కరుణించమనిప్రార్ధిస్తాడు. శివుడు  " చిరంజీవిగా జీవించమని ' మార్కండేయుని దీవించాడు.అలా మహర్షి మృకండు తన అకుంఠితభక్తిని కుమారనికి అభ్యసింపజేసి చిరాయువైన కుమారుని పొందు తాడు. 

*************************************** ఆదూరి.హైమవతి.

మృకండు మహర్షి జయంతి సందర్భంగా ఆగష్టు 2వతేదీనవార్త దినపత్రిక చెలి,ప్రచురితము.