Wednesday 5 September 2012

గురుతరమైన గురువులబాధ్యత..


                       గురుతరమైన గురువులబాధ్యత..
                  గురుబ్రహ్మా గురుర్విష్ణుః - గురుదేవో మహేశ్వరః
                  గురుస్సాక్షాత్ పరబ్రహ్మా -తస్మైశ్రీ గురవేన్నమః-  అనే పవిత్రమైన భారతీయసంస్కృతి మనది. గురువులోబ్రహ్మావిష్ణుఈశ్వరస్వరూపాలను దర్శించి,స్మరించి,నమస్కరించేమనం ఈనాడు గురు స్వరూపంలో రక్కసులనూ యమదూతలనూ ,కర్కశ కరాళులనూచూస్తుండటంసిగ్గుచేటుకాదా!    
' గు 'కారో అంధకారస్య -'రు ' కారో తన్నిరోధకృత్ --అంటూగురువుకు అఙ్ఞా నాంధకారాన్ని పారద్రోలి ,  ఆ అఙ్ఞానాన్ని తిరిగి దరిచేరనివ్వని భగవత్ స్వరూపునిగా సృష్ట్యాదినుండీ గురువుకు అమోఘమైన గౌరవంఉంది.వేదకాలంనుండీ'గురు'స్థానంగౌరవప్రదమైనదిగాచెప్పుకుంటాం.శ్రీమహావిష్ణువుమానవా
కారంతోశ్రీరామునిగావచ్చినపుడుఆయనతనగురువులైనవశిష్టుని ,విశ్వామిత్రునిమాటలనుమన్నించి,గౌరవించాడు.శ్రీకృష్ణుడుతనగురువైనసాందీపునీమహర్షికిశిశ్రూషచేసిగురుపుత్రునియమధర్మరాజు
నుండీబ్రతికించితెచ్చిగురుదక్షిణఇచ్చుకున్నాడు.పాండవమధ్యముడుఅర్జునుడుతనగురువైనద్రోణాచార్యులకు,ద్రుపదునిపట్టితెచ్చిఅప్పగించిగురుదక్షిణచెల్లించుకున్నాడు.ఇలాపురాతనకాలంనుండీశిష్యులుతమకువిద్యాదానంచేసినగురువుపట్లతమకృతఙ్ఞతనుచూపుతూవచ్చారు.
గురువులుసైతంతమశిష్యులనుతమబిడ్డలవలె ప్రేమించి,అభిమానించి,ఎంతోఅప్యాయతతోఆదరించి విద్యబోధించడంజరిగేది.శిష్యులశారీరక,మానసికపరిస్థితులనుగమనిస్తూవారిఅవసరాలుగుర్తిస్తూవిద్యాబోధనచేపట్టేవారుగురువులు.పురాణకాలంనుండీగురుకులాల్లోఉండిగురువులకుపనులుచేస్తూవారు
పెట్టేభోజనంతింటూవిద్యనభ్యసించేవారుశిష్యులు..నేడు-- అదంతామారిపోయింది .“గురుశిష్యబంధాలు గుంటలోపాతేసివిద్యలన్నియువిప్రవవీధికొచ్చె!అన్నట్లుఅటుఆడమగగురువులుసైతంఅనేకరకాలుగాతమవిద్యార్ధులనుహింసించడంచదువుతూనేఉన్నాం.గురువులుతమబాధ్యతలను,కర్తవ్యాలనుమరు
వడం, జరుగుతున్నది.డబ్బుఎరవేస్తేఎంతటిడిగ్రీసర్టిఫికేట్లయినాచేతుల్లోపడుతున్నాయ్.అలాంటిడిగ్రీలు పొందినఉపాధ్యాయులుఎలాంటి విద్య అందిస్తారో మనం ఊహించవచ్చు.     
      ఎంతోప్రేమతోవిద్యాబోధనచేయవలసినగురువులునేడువికృతచేష్టలతోవిలన్సైపోతున్నారు .ఈనాడు వార్తాపత్రికల్లో,టీ.వీఛానల్స్ లోప్రసారమవుతున్నసంఘటనలుసభ్యసమాజంసిగ్గుతోతలవంచుకేనేలా  ఉన్నాయి.ఒకపాఠశాలలో ఏదోదొంగిలించిఉంటుందన్నఅనుమానంతోబట్టలన్నీవిప్పించి ఒకబాలికను ఉపాధ్యాయినివెతికిందిట!, తెలుగు[మాతృభాష] మాట్లాడారని పిల్లలను అతి క్రూరంగా దండించడం , వాతలుపెట్టడం,రాత్రిబట్టతడిపిందనిహాస్టల్వార్డన్స్అరాచకంగా[ ఇంగ్లీషుపాలకులుసైతంఇంతనీచంగాదండించలేదేమోఆరోజుల్లో]ఆచిన్నారిచేనాలుకతోనాకించి,ఆమెవంటిబట్టలతోతుడిపించడం!ఇదాఆచరించ
వలసినవిధానం !ఇదాఉపాధ్యాయ సర్టిఫికేట్తోఉద్యోగాలకువచ్చినగురుస్థానంలోనివారుచేయవలసిన పని!దేశద్రోహులకో,దారుణనేరాలుచేసినవారికోవిధించేశిక్షలుకూడాఇంతక్రూరంగాఉండవేమో!కేవలంఆపిల్లలకుప్రభుత్వంఅందిస్తున్నసహకారానికికాపలాదారుగాఉండి ,తనకర్తవ్యంనిర్వహిస్తున్నందుకేతానుజీతంతీసుకుంటూతనకుటుంబాన్నిపోషిoచుకుంటున్నవిషయంమరచితనస్వంత సొమ్మేదోవారికిదోచి పెడుతున్నధోరణిలోఇలాంటికిరాతకచర్యలుచేపట్టడంఏట్రైనింగ్లోబోధింపబడిఉందో!లేకమరేదైనాకులమతభేదాలుపాటిస్తూఇలాంటిపనులుచేయడంజరిగిఉంటేఅదిఏమాత్రంక్షమించరానినేరం.ఉధ్యోగాలకువచ్చినపుడుఉద్యోగధర్మంతప్పమిగిలినవన్నీపక్కనపెట్టితనవృత్తిధర్మంపాటించగలిగితేనేఇలాంటిఉధ్యోగాలకురావాలి.లేదామడికట్టుకునిఇళ్ళలోకూర్చోవాలి.పూర్వంఉపాధ్యాయులనుతల్లిదండ్రులు'తమబిడ్డలను శిక్షించైనాచదువుచెప్పమనేవారు.అనాటిఉపాధ్యాయులదృష్ణంతాకేవలంతమవద్దకువచ్చినచిన్నారులకువిద్యాబోధనచేయటంమీదేఉండేది.!అందుకేతల్లిదండ్రులుతమపిల్లలనుదండించినాపట్టించుకునేవారుకారు,ఐతేఆదండనతీరువేరుగాఉండేది,దండనఎందుకోఅటుతల్లితండ్రులకూ,ఇటుపిల్లలకూతెలిసేది, వంటిపై పడిన ఆదండన మనస్సుపైకాక బుధ్ధిపై పడేది.అందుకే దండనపొందినపిల్లలుఆతర్వాతబాగా చదివేవారు,నేటి\శిక్షలతీరేమారిపోతున్నది!,అందుకేపిల్లలనుశిక్షించడంనేరంగామారింది.నేడుఆశిక్షకుభయపడిఎంతోమందిప్రభుత్వబళ్ళలోచదివేపేదవిద్యార్ధులుచదువులుమానేసిపనులకువెళుతుంటేఅదే
కార్పొరేట్,కాన్వెంట్స్కూళ్ళలోచదివేపిల్లలనుబాధిస్తేకేసులుపెట్టిఉపాధ్యాయులనురచ్చకీడుస్తున్నారు.
ఐనాఅలాంటివారినిచూసిమరొకరూమరొకరూమారకపోగామనస్తత్వంవికృతంగామారటంఎక్కువైపోతున్నది.సర్వులకూసమానహక్కులూ, సమాన హోదాలూ, సమానబాధ్యతలూ, ఇస్తున్నమన స్వతంత్ర భారతదేశంలో విదేశీ ఉద్యోగులవలెభారతీయవిద్యార్ధులనిలాక్రూరమైనశిక్షలువిధించడంఏమాత్రంసమం జసం!మానవతనూ,మానవీయవిలువలనూవిధ్యార్ధులమనస్సుల్లోనాటవలసినహాస్టల్స్ ,విద్యాలయా లూ,జైళ్ళవలెతయారవటంహేయంకాదూ!గురుపూజోత్సవాలు,గురువులకుసన్మానాలూ,గౌరవాలూ, సమాజంపట్ల వారి బాధ్యతలను గుర్తు చేసేందుకే అనేవిషయం గుర్తుంచుకోడం అతిముఖ్యం. 

No comments:

Post a Comment