Wednesday 5 September 2012

గురువులే దేశానికి మార్గ నిర్దేశకులు.


               గురువులే దేశానికి మార్గ నిర్దేశకులు.

            తల్లి దండ్రులు జన్మ నిస్తే , గురువుప్రపంచంలో బ్రతకవలసినఉత్తమమార్గాన్నిచూపే దిక్సూచి వంటివాడు. జన్మించినప్రతివారూజన్మసార్ధకతకు శ్రమించాల్సిఉంటుంది.,దానికైఉత్తమఉపాధ్యాయుల బోధలూ,వారిసందేశాత్మక ప్రబోధాలూ,ఆశీర్వాదాలూఅవసరం.పౌరాణికయుగంలోశ్రీరామచంద్రాదులూ,కృష్ణబలరాములూ,సాక్షాత్ భగవత్ స్వరూలులైనా గురుపాదసేవ చేయటం గురుబోధలుపొందటం, గురువుఆశీర్వచనాలతో ఉన్నతినీ, విజయాన్నీ సాధించడంమనకుతెల్సు,పాండవులుద్రోణాచార్యునివద్దవిద్యగడించిఉత్తమమార్గంలోచరించిఆదర్శప్రాయులయ్యారు.
వారంతామానవజాతికిఉపాధ్యాయులపట్లమెలగవలసినతీరుతెన్నులనుఆచరించిచూపారు.చారిత్రకయుగంలోశివాజీ తనగురువైన సమర్ధ
రామదాసును రుద్రమదేవితనగురువైనతాంతియాతోపేనుసేవించివిజయమార్గాన్నిఅందుకున్నారు.ఈయుగంలో వివేకానందుడురామకృష్ణపరమహంసగురువుకృపతోకాళీమాతదర్శనాన్నిపొందగలిగాడు.ఇలాఅనేకమందిమహామహులు గురుకృపతోఅసాధారణప్రఙ్ఞాపాటవాలనూ,అమోఘకార్యాలనూసాధించగలిగారు ఈకలియుగంలోసైతం అనేకమంది మహానుభావులుగురుఆశీర్వాద,బోధనలతో జీవితంలో విజయాలు సాధించారు, సాధిస్తున్నారు. గురువు లేనివిద్య గురిలేని బాణంవంటిది. 
            పూరం నుండీ భారతదేశంలో గురువుకిచ్చినస్థానం గొప్పది. గురువును గౌరవించడమన్నది భారతీయుల ప్రత్యేకసంస్కారం.గురువునుసాక్షాత్దైవస్వరుపంగామనంభావిస్తాం.ఈఆధునికయుగంలోసైతంఎంతోమందితామువిద్యపుర్తిచేసిఉన్నతపదవులుఅలంకరించినాతమనుతీర్చిదిద్దిసుద్దులునేర్పిన గురువులనుగుర్తుంచుకునిగౌరవిస్తూనేఉన్నారు.స్వాతంత్ర్యభారతదేశంలోమనభారతమాజీరాష్ట్రపతిఐనడా.సర్వేపల్లిరాధాకృష్ణన్ పుట్టినరోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి , ఉత్తమఉపాధ్యాయులనుభారతప్రభుత్వంగుర్తించి పురస్కారాలు అందించడమెంతైనా ఆనందదాయకం. విద్యార్థుల జీవితాల్లో జ్ఞానజ్యోతులు వెలిగించే గురువులకు మనదేశంలో మాత్రమే ఇలాంటి ప్రత్యేక గుర్తింపు లభించడం మనదేశానికే గర్వకారణం.
                నేటి తమిళనాడు లోని తిరుత్తణిలో సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులకు సెప్టంబర్ 5, 1888 లోజన్మించినబిడ్దడేసర్వేపల్లిరాధాకృష్ణన్.వారిదిఅతిసాధారణబ్రాహ్మణకుటుంబం.తండ్రివీరాస్వామిజమీందారువద్ధచిన్నఉద్యోగం చేసేవారు.తిరుత్తణి లోజన్మించిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మాతృభాషతెలుగు.చిన్నతనంతిరుత్తణి,తిరువల్లూర్, తిరుపతి లో గడచింది. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఎం ఏ ఆర్ట్స్ డిగ్రీ పొందారు.రాధాకృష్ణన్  కు ఆయన 16వయేటనే  శివకామమ్మ తో 1904 లో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు ఆడపిల్లలు, ఒక మగపిల్లడు.
చిన్నతనంలోనే భారతీయ తత్త్వం, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలలో మంచి అవగాహన సాధించారు. ఇవివారిభవితవ్యానికిచక్కటిపునాదివేశాయి.భారతీయతత్వవాణిని,అందరికీఅర్ధమయ్యేలా సులభసైలిలో వ్రాశారు రాధాకృష్ణన్ పండితుడు..
1918 లో మైసూర్ విశ్వవిద్యాలయంలో తత్వ శాస్త్రబోధకునిగాతన ఉద్యోగజీవితాన్నిప్రారంభించారు. అప్పటికే అయన చాలా రచనలు చేశారు.అవి ది క్వెస్ట్, జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ, ఇంటర్నేషల్ జర్నల్ ఆఫ్ ఎతిక్స్ వంటి ప్రముఖ పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
1931 లో ఆయన  ఆంధ్ర విశ్వవిద్యాలయానికి, 1939 లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయ, 1953 నుండి1962 వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గానూ,భారత దేశానికి స్వాతంత్రంవచ్చిన తర్వాత యూనివెర్సిటి ఎడ్యుకేషన్ కమీషన్ అధ్యక్షుడనిగానూ , 1949 లో సోవియట్ యూనియన్ (రష్యా)లో భారత రాయబారిగా నూ చేశారు.ఈపదవులన్నీ ఆయనవిద్వత్తుకు ,ఙ్ఞానానికీ నిదర్శనాలు. 1954 లో, భారత దేశం అత్యున్నత గౌరవం - భారత రత్న అందుకున్నారు. భారత ఉప రాష్ట్రపతిగా వ్యవహరించి, 1962 నుండి 1967 వరకుభారతదేశరెండవరాష్ట్రపతిగాదేశానికితమసేవలు అందించారు . రాధాకృష్ణన్ మంచిఉపాధ్యాయునిగా ,గొప్ప తత్త్వవేత్తగా,రాజకీయనాయకునిగాగుర్తింపుపొందాడు.సర్వేపల్లిరాధాకృష్టన్‌కిఉపాధ్యాయవృత్తిపట్లఅభిమానం.దేశాన్నితీర్చిదిద్దేమేధావులుఉపాధ్యాయులే అని ఆయన విశ్వాసం. రాధాకృష్ణన్ రాష్ట్రపతిగాఉన్నపుడుకొందరు విద్యార్థులు, స్నేహితులుఆయన్నికలిసిఆయన జన్మదినోత్సవాన్నిఘనంగా జరపాలనిఉందని కోరగా,’ ఆయన తన జన్మదినోత్సవాన్నీ జరపటానికిబదులుగా ఈరోజునుటీచర్స్‌డేగాజరిపితేసంతోషంగాఉంటుందనిచెప్పారు.ఆయనకోరికమేరకురాధాకృష్ణన్‌జన్మదినోత్సవాన్నిఉపాధ్యాయ దినోత్సవంగాప్రభుత్వంప్రకటించింది.1962నుంచియేటా సెప్టెంబర్ 5న గురుపూజోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్నది. మండల, జిల్లా  ,రాష్ట్ర , జాతీయ స్థాయిలలో ఎంపికైన గురువులను సన్మానించడ ఆనవాయితీగా వస్తున్నది.
గురుపూజోత్సవంనాడుఎవరిగురువులనువారుతమకుతోచినరీతిలోసత్కరిస్తూవేడుకలుజరుపుకుంటారు.ఈరోజునపాఠశాలలవిద్యార్థులు,ఉపాధ్యాయులనుగౌరవించడం,సమావేశాలుఏరాటుచేసుకోడంజరుగుతున్నది.ప్రతిసంవత్సరంభారతదేశంలోవిశిష్ఠసేవలుఅందించినఉపాధ్యాయులనుఅధ్యాపకులనుఎంపికచేసిజాతీయస్థాయిలోనూఢిల్లీలోనివిఙ్ఞానభవన్లోవారికిఅప్పటిరాష్ట్రపతిచేతులమీదుగాఅవార్డులుఅందించిగౌరవిస్తున్నారు. రాష్ట్రపతి భవన్లో వారికి తేనీటి విందు ఏర్పాటుచేస్తున్నారు.ఇలా డాక్టర్సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినంఉత్తమ ఉపాధ్యాయులకుగుర్తింపు నిచ్చేపవిత్రదినంగా జరుగుతుండటం ఆనందించవల్సిన విషయం .
    ప్రాధమికపాఠశాలలోఅఆలునేర్పినటీచర్నుండీవిద్యాభ్యాసంపూర్తయ్యేవరకుహైస్కూల్,కాలేజ్,విశ్వవిద్యాలయంవరకూ పాఠంచెప్పినప్రతిఒక్కరూగురువే.జీవితంలోఉత్తమస్థానాన్నిఅందుకోవాలనిపైపైకిఎదగాలనీగురువులుతమవిద్యార్ధులనుఆశీర్వదిస్తారు.తమవిద్యార్ధులుఉన్నతపదవులుఅలంకరించి,ఉత్తమసంస్కారవంతులుగాగుర్తింపుపొందినవిషయంతెలిస్తేముందుగాసంతోషపడేవ్యక్తి గురువే! .
        పూర్వపుగౌరవంగురువులకుక్రమేపీతగ్గుతూవస్తున్నది.గురుశిష్యులమధ్యఅనుబంధంకూడామారింది.గురుశిష్యబంధాలుగుంటలోపాతిపెట్టబడుతున్నాయి. నేడువిద్యార్థులుగురువులకుసరైనగౌరవ,మర్యాదలుఇవ్వడంలేదు.దానికికొంతవరకూకారణంకొందరుగురువులువిద్యార్థులపట్లఅసభ్యంగా అభ్యంతరకరంగాప్రవర్తించడంకావచ్చు,విద్యాబుద్ధులనుబోధించడంలోసరైనశ్రద్ధచూపకపోడంకావచ్చు.                  ప్రతిఏటా సెప్టెంబర్‌ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవంనాడుగురుశిష్యులపవిత్ర బంధం గురించి స్మరించడంవల్లతిరిగివారిమధ్యసరైనఅవగాహన,సాన్నిహిత్యంఏర్పడేఅవకాశంకలుగవచ్చు..విద్యార్ధులు తమగురువులనుగౌరవించడంనేర్చుకోవాల్సిఉంది,అదేవిధంగాగురువులుకూడావిద్యార్థులనుతీర్చిదిద్దడంలో
పూర్తిశ్రద్ధవహించాల్సినఆవశ్యకతనుకూడాఈఉపాధ్యాయదినోత్సవంగుర్తు చేస్తుంది.ఈసందర్భగా దేశంమొత్తంలోగురుస్థానంలోఉండివిద్యబోధించేగురువులంతాతమబాధ్యతలకుపునరంకితమై ఉత్తమ విద్యార్ధులనుఈభారతదేశానికిఅందించిబాధ్యతాయుతమైనపౌరులనుతయారుచేసినపుడేమనదేశ
పూర్వ ఔన్నత్యం తిరిగి పొందే భాగ్యం పొందగలుగుతాం.  
        ****************  వార్త దినపత్రికలోసెప్టెంబర్ 5 న ప్రచురితం ********************


No comments:

Post a Comment