Wednesday 1 August 2012

విశ్వమానవప్రేమికుడు అరవిందుడు.


యోగి అరవిందఘోష్  మహర్షి    
     . స్వాతంత్య్ర సముపార్జనకు తమదైన శైలిలో శ్రమచేసినమహానుభావుడుఅరవిందమహర్షి .ఆయన  తన జన్మదినం నాడే భారతదేశ దాస్యశృంఖలాలుఖండింపబడతాయని  ముందేచెప్పినజాతీయోద్యమ  నాయకుడు, సత్య సంకల్పుడు, ఆయనవలెనే ఆయన పాజిటివ్ థింకింగ్ ఎంతో మహోన్నతమైనది!
 అరవిందఘోష్ సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు,ఒక మంచి కవి ,జాతీయవాది,యోగి,తత్త్వవేత్త.గురువు.
అరబింద్ ఆగస్టు 15, 1872 న కోల్‌కతా లో కె.డి.ఘోష్ ,స్వర్ణలతాదేవిలకుజన్మించాడు.తండ్రికె.డి.ఘోష్  వైద్యుడు.తల్లి స్వర్ణ లతా దేవి గొప్ప భక్తురాలు.ఈయన పూర్తి పేరు అరబిందో ఘోష్. అరవింద అనగా బెంగాలీలోపద్మముఅనిఅర్థం.అరవిందఘో ఘోష్ కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో  అసాధారణతిభావంతు   డైన విద్యార్థిగా గుర్తింపు పొంది, సివిల్ సర్వీస్(ఐసిఎస్) పరీక్షలోఉన్నతశ్రేణిలోఉత్తీర్ణుడయ్యారు..ఐసిఎస్ పదవిని నిరాకరించి 1892లో భారతదేశానికి తిరిగి వచ్చాడు.
         సాహిత్య వ్యాసంగంలో కృషిచేస్తూనే , స్వాతంత్య్రోద్యమపొరాటంలోపాల్గొన్నాడు.ఈ పొరాటములో ఈయన  అతివాదులుగా విప్లవమార్గాన్నిఎంచుకొన్నారు."బరోడా"కుట్ర కేసులోఈయనకలకత్తా కేంద్ర కారాగారములో వున్నప్పుడుకలిగినఅనుభూతులతో పూర్తిగా ఆధ్యాత్మిక మార్గములో పయనించారు. వడొదరాలోనిమహారాష్ట్రయోగి ఐన విష్ణుభాస్కర్ లెలె ఉపదేశముతోఅధ్యాత్మికమార్గంపట్ల ఆకర్షితుడై అరబిందో రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపుకు క్రమక్రమంగా ప్రవేశించడం జరిగింది.. రెండవసారి కోల్‌కతాలోని ఆలీపూర్ కేంద్రకారాగారంలోశిక్షఅనుభవిస్తున్నపుడుఆధ్యాత్మికత పట్ల గాఢమైన ఆసక్తి కలిగింది.ఇక్కడఆయనచేసినభగవద్గీతపారాయణం,అనుసరణఆయనకుఅనేకఆధ్యాత్మికఅనుభూతుల్ని కలిగించాయి.
ఆతరువాత పాండిచ్చేరిలో ఆశ్రమస్థాపనచేయటం జరిగింది. అరవిందునిబోధల వలన ఎంతోమంది ఆయనకుశిష్యులుగామారారు.అరవింద్‌. Thelifedevine,సావిత్రిలాంటిఅద్భుతమైనకావ్యాలను  అందించిన ఋషి అరవిందమహాశయుడు. పరిపూర్ణమానవుని అవతరణ జరుగుతుందని, దానికోసం తన తపశ్శక్తిని వెచ్చించి అత్యున్నతమైన ఆధ్యాత్మికప్రవాహాన్ని భూమి వైపు మళ్ళించిన గొప్ప యోగ సాధకుడు అరవిందయోగీంద్రులు.  
న్యూ ల్యాంప్ ఫర్ ఓల్డ్అనేశీర్షికనముంబాయికి చెందిన ఇందు ప్రకాశ్ పత్రికలో 1893 ఆగష్టు నుంచి 1894 మార్చివరకూఅనేకవ్యాసాలనుచాలాఘాటుగారాశాడు. జాతీయతఅనేది మతం. దాన్ని దైవం ఇచ్చింది. ఈ భావం హృదయానికి, ఆత్మకు సంబంధించినదని అరవింద ఘోష్ జాతీయతను నిర్వచిస్తూ వ్యాసాలనురాశారు.1906లో అరవిందఘోష్ కళాశాల అధ్యక్షుడయ్యాడు. బెంగాల్ జాతీయ కళాశాలను స్థాపించి, బిపిన్‌ చంద్రపాల్, తిలక్‌లతో కలిసి రాజ్యాంగ పద్ధతుల ద్వారా ఆందోళన కొనసాగించాడు. విదేశీ వస్తు బహిష్కరణ అమలు జరిపాడు. వీటన్నిటి ద్వారా దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించవచ్చని సూచించాడు. 1905లో బెంగాల్ విభజనానంతరంరాజకీయాల్లోచురుకుగాపాల్గొన్నారు. వందేమాతరమ్ పత్రిక నిర్వహణలో బిపిన్ చంద్రపాల్‌తోసహకరించారు. బెంగాల్ యుగంధర్ పత్రికను ప్రారంభించారు.పుదుచ్చేరిలో నాలుగుసంవత్సరాలు ఏకాగ్రతతోయోగాభ్యాసం చేసినతదనంతరం 1914 వ సంవత్సరంలో' ఆర్య 'అనే అరవై నాలుగు పేజీల సమీక్షను మాసపత్రిక రూపంలో వెలువరించాడు. తర్వాతఆరున్నరసంవత్సరాలపాటుఆయనఈపత్రికద్వారానేతనముఖ్యమైనరచనలనుధారావాహికంగా ప్రజలకు చేరవేశాడు.
తీవ్రవాద జాతీయవాదాన్ని సమర్థించిన తత్వవేత్తలు, భారతదేశపు సర్వజ్ఞతను విశ్వసించారు. విదేశీ ప్రభుత్వసంస్థలప్రాబల్యం, సంస్కృతీ ప్రభావంనుంచి స్వాతంత్య్రం సాధించిన తర్వాతే హిందూ సంస్కృతి శిఖరాగ్రాలను అందుకుందని వారు నమ్మారు. జాతీయతను మత పరిభాషలో ప్రకటించారు. 
అరవిందఘోష్ అకుంఠిత దీక్షతో భారతమాత దాస్యశృఖంలాలను పగులగొట్టడానికి సాయుధసమరం జరిపినస్వాతంత్య్ర యోధుడు. అనేక ఏళ్ళపాటుపుదుచ్చేరిలో ఆయనకార్యకలాపాలుసాగించారు.బ్రిటిష్ దురాక్రమణకు ప్రతినిధి ఐనఆనాటి వైస్రాయ్ లార్డ్ మింటో చేత మోస్ట్ డేంజరస్మాన్అనివర్ణించబడిన, నాటివిప్లవవీరుడు అరవిందుడు1910ఏప్రిల్ 4న బ్రిటిష్ పాలనలోఉన్నభారతదేశాన్నివదిలి, ఫ్రెంచి వారి ఆక్రమిత ప్రాంతమైన భారతదేశంలోని పాండిచేరిచేరాడు.
       1902 ప్రాంతాలలో, కింగ్స్‌ఫర్డ్ అనేఆంగ్లేయుడు,నాలుగుసంవత్సరాలు కలకత్తాలో మేజిస్ట్రేట్‌గా పనిచేసాడు. అతడుచాలా కఠినుడు, రాజకీయ నేరాలకు ఆయన శిక్షలు చాలా దారుణంగా వుండేవి. వందేమాతరంఅని నినాదమిచ్చిన నేరానికి, బహిరంగంగా కొరడాదెబ్బల శిక్షవిధించాడు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ లార్డ్‌మోరే కూడా ఈ దారుణ శిక్షలకు చలించిపోయి, వైస్రాయ్ లార్డ్‌మింటోకు అంత తీవ్రమైన శిక్షలనుతగ్గించమనిఉత్తరంరాసాడు. తరువాత కింగ్స్‌ఫర్డ్, బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు జిల్లా జడ్జిగా వెళ్లాడు.బెంగాల్విప్లవకారులసంఘంఅతనినివధించాలనినిర్ణయించింది.ఈబాధ్యతఖుదీరాంబోస్,ప్రఫుల్ల రాకీలకుఅప్పగించబడింది.1908 ఏప్రిల్ 30 తేదీనవీరిరువురూ,కింగ్స్ ఫర్డ్ అనుకునివేరే బండి మీద బాంబులు విసిరారు. దానిలోని, కెన్నడీఅనే కుటుంబానికి చెందిన, ఇద్దరు స్త్రీ లు మరణించారు.దానితో దేశమంతా గగ్గోలెత్తింది మే 1నఖుదీరాంబోస్ అరెస్టయితే అరెస్టయిన ప్రఫుల్లరాకీ తాను రహస్యాలు ఎక్కడ బయటపెడతానో అన్న భయంతో ఏప్రిల్ 5న తానే కాల్చుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. దీని వెనక గల కుట్రను ఛేదించదలుచుకున్న ప్రభుత్వం, అరవిందుల పేరుతోగల 'మురారి పుకార్ 'తోటను సోదాచేసి అరవిందుల సోదరుడు హరీంద్రనాథ దత్‌ను, ఇంకా కొంతమందిని అరెస్టు చేసారు.
అదే ప్రసిద్ధి చెందిన ఆలీపూర్ బాంబు కేసు. దానిని కలకత్తా సెషన్స్ కోర్టులో విచారించింది బీచ్ క్రాఫ్ట్ అనే ఆంగ్లేయుడు . విచిత్రమేమిటంటే ఈయన అరవిందులు, కేంబ్రిడ్జ్‌లో సహోధ్యాయులు. గ్రీకుభాషలో అరవిందులు ప్రథముడైతే, బీచ్‌క్రాఫ్టు ద్వితీయుడయ్యాడు. ఈ కేసు విచారణకు ప్రభుత్వం పట్టుదలతో మద్రాసులోని ప్రముఖ క్రిమినల్ న్యాయవాది నార్టన్‌ను ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా నియమించింది. మరి వారికి దీటైన న్యాయవాది, ముద్దాయిల తరఫున ఎవరు వాదించగలరు? అపుడే చిత్తరంజన్‌దాస్ ఈ భారాన్ని వహించారు. పూర్తి కాలాన్ని ఈ కేసుకేవెచ్చించడంతో,ఆకర్మయోగికిచివరికిమిగిలిందిఏభైవేల అప్పు.... బండిని గుర్రాలను అమ్మేసుకున్నారు! 9 రోజులపాటు సాగిన ఆయనవాదన ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.తనవాదననుముగిస్తూఅరవిందులవాణివారిమరణానంతరంకూడఒక్కభారతదేశంలోనేకాకుండా ప్రపంచమంతావినిపిస్తుందన్నారు! సరిగ్గాఅదేజరిగింది.దేశభక్తి వైతాళికుడుగా, జాతీయవాదప్రవక్తగా వున్న శ్రీ అరవిందులు ఆతరువాత విశ్వమానవ ప్రేమికునిగా అవతరించారు. 1909లో మే 6న బీచ్ క్రాఫ్ట్, అరవిందుడునిర్దోషిఅనితీర్పుచెప్పారు! కానిసోదరులు హరీంద్రునికి, ఉలాస్కరదత్ కు మరణశిక్ష విధించబడింది. దేశబంధు చిత్తరంజన్‌దాస్, కలకత్తా హైకోర్టుకి అప్పీలు చేసి, వారిమరణశిక్షను ద్వీపాంతరవాస శిక్షగా మార్పించగలుగుతాడు.
వారి 40 సంవత్సరాల పాండిచేరి జీవితంలో వారు విశ్వమానవ ప్రేమికునిగానే శ్రమించారు. ఐనా భారతదేశాన్నిగిరించిన ఆలోచన మరువలేదు. అరవిందుల అనేక గ్రంథాలుపాండిచేరి లోజీవించిన కాలంలోనే రచింపబడ్డాయి, అందులో ఒకటి ది ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్, ఆ ఉద్గ్రంధం, వారిఆర్య మాసపత్రికలో 1918 డిసెంబర్‌నుంచి 1921 జనవరి దాకా వెలువడింది. సుమారు 400 పుటలు.అందులోముఖ్యంగాభారతరాజనీతినిగురించి,4 ప్రకరణాలు, సుమారు 60 పుటలు వున్నాయి.  ఐనా తిరిగి ఈ తికమకల మధ్య, ఇంకాఒక నూతన వెలుగుకు,సాయంకాలపువెలుగుకాదు,ఉదయ కాలపుయుగసంధ్యకుఅవకాశముంది.యుగాలతరబడిఉండినభారతదేశంచనిపోలేదు.తనచిరసృజనాత్మకభావాలను ఇంకా పూర్తిగా వెదజల్లలేదుఈదేశం జీవిస్తుంది. ఇంకాతన కొరకుమరియు విశ్వమాన వాళికి ఎంతో సేవ చేయవలసింది వుంది...' అనేది ఆగ్రంధంలోని చివరివాక్యం. అరవిందుల నిర్యాణం 1950 డిసెంబర్ 5న జరిగింది.ఐనా ఆయన భారత ప్రజలేకాక ఎంతోమంది ప్రపంచ ప్రజలహృదయాల్లో చిరంజీవియే! అట్టి మహామహునిభారతస్వాతంత్య్రదినోత్సవాన ,అరవిందులజన్మదినోత్సవానఆయన్ని
 స్మరించడం ఉచితం.
-విశ్వమానవప్రేమికుడు అరవిందుడు.అనే టైటిల్తో ఆగష్టు 15న ప్రచురితం.






                                






విశ్వమానవప్రేమికుడు అరవిందుడు.అనే టైటిల్తో ఆగష్టు 15న ప్రచురితం.
                             బాబోయ్ మళ్ళా బళ్ళు తీస్తున్నారు!
" అమ్మా! ఈ ఏడాదన్నా కొత్త స్కూల్ బ్యాగ్  కొంటావా, లేదా? "అని అనంత కొడుకు  సమంత్ ,
"ఆపాతదాంతోనే గడిపేయమనవుకదా? అందరూ కొత్త బాగ్స్ తో వస్తే మేం ఈ పాత బ్యాగ్స్ తో వెళిత అంతా మమ్మల్నే  చూస్తారు " అని కూతురు మధురిమతల్లి భుజాలుపట్టి ఊపసాగారు.
           అనంత తల తిరిగిపోసాగింది.అటు రెట్టింపుగా పెరుగుతున్న మరిది ఇంజనీరింగ్ ఫీజ్ , ఇటు ఆడపడుచుపెళ్ళి , ఎదుట పిల్లల కోరికలో అవసరాలో  , వీటికితోడు , పెరుగుతున్న అవసరాల తో పోటీగా పెరుగుతున్నధరలు,..మెప్పేట ఉచ్చులో మధ్యతరగతి బాధ్యతలుమోసే మహిళలకు  ప్రతినిధిగా అనంత . ఎటుచూస్తున్నా పెరగటం పెరగటం.పెరగటం... తమ ఒరుంబడి మాత్రం ఖర్చులకు తగ్గట్లు పెరగటం లేదు.

       మండే ఎండలు, అంతకన్నా మండే పెట్రోల్ ధరలు, దాంతో మరీ మండిపోతున్న , నోట్సులు , తెల్లకాగితాలపుస్తకాలు ,ఒకటేంటిఅన్నీఎండలతోపోటీపడిమండిపోతుండగాబళ్ళుతెరుస్తున్నారు .
ఏవెంత ఖరీదైనా కార్పొరేట్ స్కూళ్ళలో చదివించేస్థోమతున్నవారికి ఫరవాలేదుకానీ మధ్యతరగతి, క్రిందిమధ్యతరగతి వారి కుటుంబయజమానుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తేరోజులివి.[ అదీనీ ఆరైళ్ళకు మధ్య మధ్యలో ప్రమాదాలు సంభవిస్తుండగా  భయాలు ఇంకా ఇంకా పెరుగుతున్నాయ్ వారికి]
 తెల్లకార్డులున్నవారికి ప్రభుత్వం ఎటూ అన్నీ చవగ్గానో, ఉచితంగానో ఇస్తుంది అన్నింటికీ బలయ్యేది మధ్యతరగతి వారే!
     మధ్యతరగతిలో ని అప్పర్ మిడిల్ క్లస్ వారు కాస్త బయటపడనూ మొహమాటపడతారు,కవర్ చేసుకోను ప్రయత్నిస్తుంటారు.మధ్యమధ్య తరగతివారు సర్ధుబాటుచేసుకోను, పొదుపుచేయనూ , మరో మార్గం వెతుక్కోనూ చూస్తుండగా క్రింది మధ్యతరగతి వారు నీళ్ళబయటపడ్డ చేపలా, కుడితి లోపడ్డ ఎలకలా [మన్నించాలి ఈ ఉదాహరణకు కానీ నిజంసుమండీ!] ఏమీ చేయలేక , పరిస్థితులను ఎదిరించలేకఊగిసలాడుతుంటారు,ఆప్రయత్నంలోనేతమపిల్లలకుసరైనచదువులుఅందించడంలో
కూడా వెనుకపడిపోతుంటారు. ఫైలైపోతుంటారు,అప్పుడే కుటుంబాల్లో ఘర్షణలు ,వ్యధలూ మొదలౌ తుంటాయి.అవసరానికి ఒక్క శాతం సొమ్ము ఎప్పుడూ వారికి తక్కు వౌతుంటుంది..
 మధ్య మధ్య తరగతివారికి అవసరానికి సరిపడామాత్రమే ఉంటుండగా, హయ్యర్ మిడిల్ క్లాస్ వారి అవసరానికి ఒక్క శాతం సొమ్ము ఎక్కువగాఉంటుంటుంది.ఈ తేడాలునిరంతరంఉంటూనేఉంటుండటం వల్లవారిజీవితాలుకొతవరకూ అదోలా నడుస్తుండగామరికొందరివిఅస్తవ్యస్తమవుతున్నయి
                    
 ఆధారం అందితే పైకెగబాక గల తెలివితేటలున్న వారైనా అవకాశాల్లేక మొగ్గల్లోనే ముకుళించి పోతున్నారు.
    స్కూల్ యూనిఫాంస్ కొనాలన్నా , తెల్లకాయితాల పుస్తకాలు, నోట్సులూ, పెన్స్, పెన్సిల్స్ , స్కూల్ బ్యాగ్స్ అన్నీ భారమే వారికి.ప్రభుత్వ విధానాల వల్ల నష్టపడేది ఈ మధ్యతరగతి వర్గమే!  ఇంట్లో ఈగలమోత బయట పల్లకీలమోత లా బ్రతుకు తుంటారు , గృహిణుల విషయం ఆలోచిస్తే పాపం అన్నివిధాలా  బాధలూ, ఇబ్బందులూ పడేది వీరే. సమాజంలో ఇతరతరగతి వారిని చూసి అలా ఉండాలని అటుపిల్లలూ ఇటు పెద్దలూ అనుకుంటున్నా అందుకోలేని స్థితి వారిది. ఉట్టికీ స్వర్గానికీ కానిబ్రతుకులు. 
 స్కూళ్ళు తెరిచేపర్వo వారి పాలిట అరణ్యపర్వమే అవుతుంటుంది.ప్రతి క్వార్టర్కూ కట్టవలసిన ఫీజులూ, కొన వలసిన వస్తువులూ వారికి సవాల్ అవుతుంటాయి. పిల్లలు  సహజంగా పాతవాటితో  సర్దుకోనూ లేరు,పెద్దలు కొత్తవి   కొననూలేరు. దీంతో గృహిణికీ ,గృహస్తుకూ మధ్య పెద్ద రణ రంగం ! ఇది ఈనాటిమనమధ్యతరగతి వారి స్థితి. ఈ బళ్ళు తీసే రోజులు నిజానికివారికి పరీక్షాసమయాలేమరి!
                       కొత్త తరగతుల్లోకి కొత్తకొత్త బూట్లు, సంచులు,నోటు,అచ్చుపుస్తకాలతో వెళ్ళాలని పిలల్లికోరుకోడం సహజమే! అది మధ్యతరగతి గృహిణులపాలిట ఎంసెట్ పరీక్షలాంటిది.ప్రతి తరగతీ పిల్లలుదాటుతుంటే సంతోషంతోపాటుగా  , ఖర్చులుభరించే దైర్యం లేక గుండె బలం తగ్గిపోతుంటుంది.అయ్యో మళ్ళా బళ్ళు తెరిచేరోజులొచ్చాయే! అని భయపడటంలో వింతేముందీ! 

    [ బ్యాగ్స్ -బ్యాగ్స్ పేరుతో ఆదివారం 27th వార్తలో ప్రచురితమైంది.]

No comments:

Post a Comment