Thursday 8 August 2013

మృకండుమహర్షిచరిత్ర .


మృకండుమహర్షిచరిత్ర  .        

  మృకండుమహర్షి మృగశృంగమహర్షి కుమారుడు.మృగశృంగమహర్షితపశ్శక్తిచేచనిపోయినసువృత్తను  తిరిగి బ్రతికించగా, సువృత్తతండ్రినుచథ్యుడుతనకుమార్తెనుఅతనికిచ్చివివాహంచేస్తాడు.సువృత్తకుమారుడే మృకండుడు. శాలగ్రామమనే మహాతీర్ధంలో సర్వప్రాణుల హితంకోరితపస్సుచేసి శ్రీమహావిష్ణువును మెప్పించిదర్శనంపొందుతాడు, విష్ణువుమృకండు భక్తికిమెచ్చిఅతనికి కుమారునిగాజన్మిస్తాననిఅతడు కోరకుండానే వరమిస్తాడు.మృకండు సార్థక నామధేయుడు.ఆయనతపస్సులో లీనమైనిశ్చలుడై ఉన్న సమయంలోఆయన శిలవలె ఉండడం వల్లమృగములు వచ్చితమకండుయాన్నితీర్చుకొనేవి.మృగములకండుయాన్నితీర్చినవాడుకనుకఆయన్నుమృకండుమహర్షిఅనిపిలిచేవారు. మరుధ్వతిఅనేమహాసాధ్విఆయన భార్య,వారికి ఉన్నఏకైక లోటు సంతానం లేకపోవడం,పుత్రులు లేకపొతేపైలోకాల లో ఉన్నత గతులు ఉండవని భావించి కాశీలో తపస్సు చేయను సతీసమేతంగాబయలుదేరుతాడు. కాశీలోవారు రెండులింగాలుప్రతిష్ఠించి,పరమశివునిగురించిఘోరతపస్సుచేస్తారు.మహాదేవుడుతపస్సుకిమెచ్చిప్రత్యక్షమైమృకండు మహర్షిని మరోమారు పరీక్షింపదలచి,'సద్గుణుడై16ఏళ్ళుమాత్రమేజీవించే కుమారుడు  కావాలాలేక దుర్గుణు డైన చిరంజీవికావాలా 'అనిఅడగ్గామృకండు మహర్షి సద్గుణుడైన 16 ఏళ్ళు బ్రతికేపుత్రుడుచాలంటాడు.శివుడుసంతసించి ' అలాంటి పుత్రుడ్ని ఇచ్చాను 'అని చెప్పి అదృశ్యమౌతాడు.

    మహాదేవునిమాటప్రకారం మరుధ్వతిగర్భవతై,దివ్యతేజస్సుకలిగిన పుత్రుడ్ని ప్రసవించింది. మృకండుమహర్షి కొడుకుకనుక వానికి 'మార్కండేయుడు' అని నామకరణం చేశారు.7సంవత్సరాలు 3నెలలునిండినవెంటనేమార్కండే యుడికిఉపనయనంచేశారు.ఒకరోజుమృకండమహర్షినిచూడనుసప్తఋషులురాగామార్కండేయుడువారికినమస్కరిం చగా వారు దీర్ఘాయుష్మాన్ భవా!అని దీవిస్తారు. మృకండుమహర్షిఇదివినితనకొడుకునిజంగాచిరంజీవిఅవుతాడా!’అనిఅడగ్గాసప్తఋషులు దివ్యదృష్టితో శివుడు మృకండుతో అన్నమాటలు గ్రహించి,మార్కండేయునిబ్రహ్మవద్దకుతీసుకువెళ్ళిఆయనచేతనూ 'చిరంజీవా!అని దీవింపచేస్తారు.మార్కండేయుడినినిరంతరశివారాధనచెయ్యమనిచెప్తారు.16సంవత్సరాలునిండినరోజుయమకింకర్లుమార్కండేయుడిప్రాణాలుతీసుకొనుటకైవస్తారు.యమకింకరులుమార్కండేయుడి తేజస్సుచూసి మార్కండేయుడిప్రాణాలుతేవడంతమవల్లకాదని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన దున్నపోతుమీదమార్కండేయుడిప్రాణాలుతీయడానికిబయలుదేరతాడు.అకుంఠితభక్తితోశివారాధనచేస్తున్నమార్కండేయుని పైయముడుతనపాశాన్నివిసిరేసరికిమార్కండేయుడుశివలింగాన్నికౌగలించుకొని'చంద్రశేఖరాష్టకాన్నిభక్తితోపఠిస్తాడు,‘శివామహాదేవాకాపాడు!అనిమార్కండేయడు అన్నవెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు.దీన్నిచూసియముడు భయపడిమహాదేవా! క్షమించు కరుణించమనిప్రార్ధిస్తాడు. శివుడు  " చిరంజీవిగా జీవించమని ' మార్కండేయుని దీవించాడు.అలా మహర్షి మృకండు తన అకుంఠితభక్తిని కుమారనికి అభ్యసింపజేసి చిరాయువైన కుమారుని పొందు తాడు. 

*************************************** ఆదూరి.హైమవతి.

మృకండు మహర్షి జయంతి సందర్భంగా ఆగష్టు 2వతేదీనవార్త దినపత్రిక చెలి,ప్రచురితము.

No comments:

Post a Comment