Sunday 22 July 2012

జులై 11 ప్రపంచ జనాభాదినోత్సవం.

                                 జులై  11 ప్రపంచ జనాభాదినోత్సవం.

 పెరుగుతున్న జనాభా అదుపుకు స్ర్తీలే ప్రధమపాత్రపోషించవలసి ఉంది.ఇటుమురికివాడల్లోనూ, అటుగ్రామీణ ప్రాంతాల్లోనూ   ప్రచారం అవసరం.గ్రామీణప్రాంతాల్లో జనాభానియంత్రణ  చేసుకుంటే పాపమనేమూఢనమ్మకాలతో తమసంతానాన్నిపెంచుకుంటూపోయి,విద్యవైద్యసదుపాయాలు,కనీసంచదువు,కూడూగుడ్డాకూడాసమకూర్చలేకపోతున్నారు.వారి మూడనమ్మకాల్నుపారదోలడంలో ముఖ్యంగా మహిళలుసహకరింకరించాల్సి ఉంది. మంచి జీవితంకావలంటే జనాభా నియంత్రణ ఉండాలి.
     మానవ వనరులు కాపాడుకుంటూ రాబోయే తరాలవారికి మన సంస్కృతితెలియజేయాల్సియవత జనాభా నియంత్రణ గురించి ప్రఛారం చేయాల్సి ఉంది. 2050నాటికి భారతజనాభా 1.54 బిలియన్స్‌ కి చేరుతుంది.. చైనాను మించిపోయేపరిస్దితిఏర్పడుతుంది.

 భూమిపై మానవుని భారం రోజు రోజుకు పెరుగుతుంది.పలు దేశాలుజనాభానియంత్రణకు చర్యలు చేపడతున్నా.. అవి పూర్తి స్థాయిలో ఫలించటం లేదు.ప్రతిసెకనుకు 5గురు బిడ్డలు లుపుడుతూనే ఉన్నారు.ప్రపంచ జనాభా2011
అక్టోబర్ చివరినాటికి 700 కోట్లకు చేరుకోనుందని నిపుణులు అంచనా వేరుశారు,అది ఇప్పటికి ఇంకా ఎంతో పెరిగీ ఉండవచ్చు.ఇలా సెకనుకు ఐదుగురు జన్మించటంవల్ల ఏటా ప్రపంచ జనాభాకు అదనంగా 7.8కోట్లు పెరుగుతుంది. పది సంవత్సరాలక్రితం ప్రపంచ జనాభా దాదాపు 600కోట్లు ఉండేది. గత 50 సంవత్సరాలప్రపంచజనభాగణాంకాలను పరిశీలిస్తే 1960లో ప్రపంచజనాభా 300 కోట్లు ఉండగా, 1999\నాటికి ఆ సంఖ్య 600 కోట్లకు చేరుకుంది.2025 నాటికి ప్రపంచజనాభా 800కోట్లకుచేరుకోవచ్చని ఐక్య రాజ్య సమతిలెక్కలు అంచనా వేస్తున్నాయి. ప్రతిఏటా 8 కోట్లచొప్పున జనాభాపెరుగుతుండటం వల్ల ఆందోళణ తప్పదని పలువురువిశ్లేషకులుహెచ్చరిస్తున్నారు.


         'నేషనల్ జియోగ్రాఫిక్" అనే  మ్యాగజైన్ లో ప్రచురితమైనఒకవ్యాసంలోరాబర్ట్ కుజింగ్ పలు కీలక అంశాలను వెల్లడించారు. ' ప్రస్తుతంభూగోళం పైనీటి మట్టాలు తగ్గిపోతున్నాయి.అలాగే మత్స్య సంపత కూడాకనుమరుగుయి
పోతుంది.. ప్రతి ఏటా దాదాపు 100 కోట్ల మంది కడుపునిండా తిండిలేకఆకలితోఅల్లాడుతున్నారని"హెచ్చరిoచారు. ఈ ప్రభావం కారణంగా ఆహారకొరతఏర్పడుతుందని ఆయన గుర్తు చేశారు.

      ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 20 సంవత్సరాల మధ్య యువకులు180కోట్ల మంది ఉన్నారు. జనాభా నిలకడగా ఉంచటానికి ప్రతి జంటకు సగటున 2.1మందిపిల్లలు మాత్రమే ఉండాలని నిపుణులు అంటున్నారు. కాగా ఐరోపా, తూర్పుఆసియాదేశాల్లో రోజు రోజుకు పెరిగిపోతున్న వృద్ధుల సంఖ్యకు తగినట్లుగాయువకులులేక పోవడం పై ఆందోళణ పెరుగుతోంది

        జనాభాను వర్ణించేందుకు అనేక ప్రమాణాలు వాడబడతాయి. జననాలు, మరణాలు,వలసలు,కుటుంబ జీవన విధానాలు, , సామాజిక వైద్య సదుపాయాలు,కుటుంబనియంత్రణ,యుద్ధాలు, ఉత్పాతాలు వంటి ఎన్నో అంశాలు జనాభాను ప్రభావితంచేస్తాయి.ఫిబ్రవరి 25 2006నాటికిప్రపంచ జనాభా 6.5 బిలియన్లకు(6,500,000,000 లేదా650 కోట్లు) చేరుకుంది. 2012నాటికి భూమిమీద 7 బిలియన్లజనాభాఉంటుందనిఅంచనా..గడచిన50సంవత్సరాలలోనూ, ముఖ్యంగా 1960 - 1995మధ్యకాలంలోమెరుగైన వైద్య సౌకర్యాలు లభించినందువలనా, ఆహారోత్పత్తిపెరిగినందు వలనాప్రపంచ జనాభా వేగంగా పెరిగింది. ప్రపంచ జనాభాలో ఒక్క ఆసియాఖండంలోనే 40శాతం ,ఆఫ్రికాలో 12 శాతం, యూరోప్‌ దేశాల్లో 11 శాతం, ఉత్తర అమెరికాలో8శాతం, దక్షిణమెరికా 5.3 శాతం, ఆస్ట్రేలియాలో 0.3 శాతం
ప్రజలుజీవిస్తున్నారు.
    

      ఒక ప్రాంతంలో సంతానోత్పత్తి రేటులో వచ్చే తేడాలు, పెద్దయెత్తునజరిగేవలసలు, రోగాలు, కరవు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అంశాలవలనజనాభాతరగవచ్చును. పాతకాలంలో -ప్లేగు, కలరా వంటి  వ్యాధులవలన ఒకోప్రాంతంలోజనాభా బాగా తగ్గడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాలనుండిపట్టణాలకు వలసలవెళ్ళడం వలన గ్రామాల జనాభా తగ్గుతున్నది.జనాభా పెరుగుదలనునియంత్రించే విధానాన్ని జనాభా నియంత్రణ అంటాo. 


 పురాతన గ్రీస్ దేశంలో తమఅధిక జనాభా ఆవాసాలకోసం వారుసుదూరప్రాంతాలలోవలసకేంద్రాలనుస్థాపించారు.
ఆధునిక కాలంలో భారత దేశంలో కుటుంబ నియంత్రణవిధానాన్ని చాలా విధాలుగాప్రోత్సహిస్తున్నారు. చైనాలో ఒకే బిడ్డవిధానాన్ని అధికారికంగా అమలుచేశారు.
   

      జనాభా నియంత్రణకు లేటు వయసు పెళ్లిళ్లే సమర్థనీయం.
  3031ఏళ్లకువివాహాంచేసుకునేవారకేప్రోత్సాహకాలుఇవ్వాలి.అధికజనాభాతోవనరులునానాటికీతగ్గిపోతున్నాయి.అస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలే వారిప్రజల ఉద్యోగాలరక్షణకు భారతీయుల్ని తిప్పి పంపిస్తున్నాయి. దేశంలో జనాభాపెరుగుదల,వనరుల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది భవిష్యత్తులోయుద్ధాలుఉన్నవారికీలేనివారికీ మధ్యే జరుగుతాయి.

 ఈ భూమ్మీద వందకోట్ల మందికి ఆహారం దొరకడం లేదు.40 కోట్లమందికిపౌష్టికాహారం లేదు.ఏటా కోటి మందికి పైగా పిల్లలు ఆకలితోచనిపోతున్నారు.జనాభా పెరుగుతోంది కాని ఆహార ఉత్పత్తి పెరగడం లేదుముంబాయి,ఢిల్లీ,  కల్కత్తా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాదు, అహమ్మదాబాదు,పూణే,కాన్పూర్, సూరత్ గత వందేళ్లలో దేశ జనాభా అయిదు రెట్లుపెరిగింది..13 నుంచి19 సంవత్సరాల మధ్య యువతులు ఎక్కువగా పిల్లల్ని కనడం,18 ఏళ్ల లోపే వివాహాలు చేసుకోవడం వంటి కారణాలు జనాభాపెరుగులకుకారణమవుతున్నాయి.ప్రతి ఒక్కరిలో, ఆరోగ్యం, సుఖ జీవనం ఆరోగ్య\జీవనం , వంటి అంశాలపీ అవగాహనపెరగాలి, తమ బిడ్డలకు 
మంచి విద్య ఆహారంకల్పించడంవంటివి బాగా ఆలోచించిగ్రామీణప్రజలకుఅవగాహనకలిపిస్తేజనాభానియంత్రణసులువవుతుంది.అప్పుడే జనాభానియంత్రణకు చేసేప్రయత్నాలుఫలిస్తాయి.





No comments:

Post a Comment